Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Bjp Mp Gvl Fire On Cm Jagan Allegation Of Giving Navratnas With Central Funds

BJP MP GVL: సీఎం జగన్పై బీజేపీ ఎంపీ జీవీఎల్ ఫైర్.. కేంద్ర నిధులతోనే నవరత్నాలు ఇస్తున్నారని ఆరోపణ..!

Published Date :June 18, 2023 , 10:15 pm
By Rajesh Veeramalla
BJP MP GVL: సీఎం జగన్పై బీజేపీ ఎంపీ జీవీఎల్ ఫైర్.. కేంద్ర నిధులతోనే నవరత్నాలు ఇస్తున్నారని ఆరోపణ..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

BJP MP GVL: ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలనపై దేశ వ్యాప్తంగా బీజేపీ సదస్సులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతోన్న సదస్సుల్లో ముఖ్య నేతలు పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ పాల్గొన్నారు. 9 ఏళ్ల మోడీ పాలనలో తీవ్రవాదాన్ని అణిచి వేశామని జీవీఎల్ తెలిపారు. అంతేకాకుండా ఏపీలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు సీఎం జగన్.. కేంద్ర నిధులతో అమలు చేసే పథకాలకే నవరత్నాలు అనే పేరుతో పథకాలిస్తున్నామని చెప్పుకుంటున్నారని ఆరోపించారు. గడప గడపకు కార్యక్రమానికి వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్తే ప్రజలు తిరగబడుతున్నారన్నారు. ఏపీ రాజధాని ఏదంటే అదుర్స్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డైలాగునే సీఎం జగన్ చెబుతారని విమర్శించారు. రాజధాని ఏదంటే..? లేదు.. తెలియదు.. చెప్పలేం అనే డైలాగే వైసీపీ నేతల నుంచి వస్తుందని తెలిపారు. పరిపాలన చేతకాకుంటే సీఎం జగన్ రాజీనామా చేయాలని జీవీఎల్ దుయ్యబట్టారు.

Read Also: Chinmayi: సింగర్ చిన్మయి పిల్లలను చూశారా .. ఎంత ముద్దుగా ఉన్నారో

Also Read

  • Nashik TCS Case: నిదా ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
  • Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
  • PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్‌బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
  • CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..

మరోవైపు బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ కు అమిత్ షా సహకరిస్తున్నారని అచ్చెన్న ఏదేదో మాట్లాడారని.. కానీ బీజేపీ ఏపీ ప్రజలకు మాత్రమే సహకరిస్తుందని ఆయన అన్నారు. అమిత్ షాని జగన్ రాత్రుళ్లే కలుస్తున్నారన్న అచ్చెన్న.. చంద్రబాబు అమిత్ షాను ఎప్పుడు కలిసారో గుర్తు తెచ్చుకోవాలని తెలిపారు. బీజేపీతో అవసరం ఉంటే ఓ రకంగా.. అవసరం లేకుంటే మరో రకంగా మాట్లాడ్డం సరికాదన్నారు. ఏపీలో బీజేపీపై టీడీపీ రాజకీయాలు మానుకోవాలని చెప్పారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకపోవడానికి బీజేపీనే కారణమని టీడీపీ అంటోందని.. వాళ్లని పట్టుకోవడం మా పనా అని విష్ణువర్థన్ ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ గో బ్యాక్ అని నినాదాలు చేసిన టీడీపీ.. ఇప్పుడు సీబీఐ, ఈడీ కమ్ బ్యాక్ అంటోందని ఎద్దేవా చేశారు.

Read Also: Kadiyam Srihari : నా చేతికి ఖడ్గం ఇచ్చి నా బాధ్యత మరింత పెంచారు

మరోవైపు ఏపీ రాజధాని ఏదో వైసీపీ నేతలు చెప్పగలరా అంటూ విష్ణువర్దన్ రెడ్డి ప్రశ్నించారు. జగన్ గాల్లో తిరుగుతున్నారు.. రోడ్ల మీద తిరిగితే ఏపీ అభివృద్ధేంటో తెలుస్తుందని అన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలివ్వలేకపోతోందని విమర్శించారు. ఏపీని మద్యాంధ్ర ప్రదేశ్ గా మార్చారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం పన్నుల భారమేసి ప్రజలను పీల్చి పిప్పి చేస్తోందని.. ఇళ్ల పట్టాల కోసం చేసిన భూ సేకరణలో అధికార పార్టీ నేతలు భారీ అవినీతికి పాల్పడ్డారంటూ విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • gvl
  • jagan
  • telugu news
  • YSRCP

తాజావార్తలు

  • Nashik TCS Case: నిదా ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!

  • Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!

  • PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్‌బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్

  • CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..

  • Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions