Pawan Kalyan: గాజువాకలో జనసేన జెండా ఎగరడం ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలోని గాజువాక జంక్షన్ లో వారాహి విజయ యాత్ర బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు మీద పోరాటం చేస్తుంటే సీఎం ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. వైజాగ్ ఎంపీ ఒక రౌడీషీటర్ అని పవన్ ఆరోపించారు. ఒక రౌడీషీటర్ ను వైజాగ్ ఎంపీగా గెలిపించారని.. అటువంటి ఎంపీ ప్రధాని దగ్గరకు వెళ్లి స్టీల్ ప్లాంట్ ను కాపాడగలరా అని దుయ్యబట్టారు.
Read Also: Vadivelu: కమెడియన్ వడివేలు అలాంటివాడా.. ఆమెకు ఆఫర్స్ రాకుండా చేసి.. సెట్ లో అలా అడిగి
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
విశాఖ ఉక్కు కోసం భూములు ఇచ్చిన రైతులు పరిహారం రాక ఇప్పటికీ ఆలయాల్లో ప్రసాదాలు తిని బ్రతకలిసిన పరిస్థితి ఏర్పడిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. తనకు పోరాటం నేర్పింది ఉత్తరాంధ్ర అని తెలిపారు. మరోవైపు 2024లో గాజువాకలో జనసేన జెండా ఎగరడం ఖాయమని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఓడిపోయిన ఒక నాయకుడికి గాజువాకలో ఇంత ఆదరణ లభించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. గాజువాకను తాను ఎప్పుడు వదల్లేదని.. తాను ఓడిపోవడం తప్ప తప్పు చేయలేదని పవన్ అన్నారు. జనసేన ఆశయానికి ప్రజలు అండగా ఉంటారనేది ఎప్పటికప్పుడు మీ ఆదరణ నిరూపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
Read Also: Lokesh Kanagaraj : త్వరలోనే రోలెక్స్ చిత్రాన్ని తెరకెక్కించనున్న స్టార్ దర్శకుడు..?.
కేసులున్నోడికి, మర్డర్లు, లూటీలు చేయించేవాడికి ధైర్యం ఉండదని పవన్ కళ్యాణ్ తెలిపారు. తాను ప్రధాని, హోమ్ మంత్రి కాళ్ళ మీద పడైన స్టీల్ ప్లాంట్ సాధించగలనన్నారు. ఆంధ్రా ఎంపీలంటే దోపిడీదారులనే అభిప్రాయం ఢిల్లీ పెద్దల్లో ఉందని పవన్ చెప్పారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తాను ఢిల్లీ పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేస్తానని.. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు, పార్టీలు కలిసి వస్తే ఐరన్ ఓర్ సొంత గనులు కేటాయించే వరకు బాధ్యత తీసుకుంటానని తెలిపారు. గంగవరం పోర్టు వల్ల నిర్వాసితులను ఆదుకోవాలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికే ఎక్కువని.. ప్రభుత్వంపై ప్రజల్లో కోపం వ్యతిరేకత పెరుగుతోందని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలియజేశారు. మరోవైపు గంగవరంలో దోపిడీకి గురైన కార్మికులకు న్యాయం జరగకపోతే హర్తాళ్ కు దిగుతామని ఆయన హెచ్చరించారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!