Pawan Kalyan: ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ జెండా ఎగరకూడదంతే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరకూడదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. గోదావరి జిల్లాల నుంచే వారాహి యాత్ర చేపట్టిన పవన్.. ప్రతీ సమావేశం, ప్రతీ మీటింగ్, ప్రతి బహిరంగసభలో.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై విరుచుకుపడుతున్నారు.. ఏ నియోజకవర్గానికి వెళ్తే.. అక్కడి స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించడంతో పాటు.. సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర మంత్రులు, నేతలను ఎవ్వరినీ వదలడంలేదు.. అయితే, ఈ రోజ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు 150 మంది వివిధ పార్టీలు చెందిన నాయకులు, కార్యకర్తలు.. ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.. రాజకీయాల్లోకి సమర్థత ఉన్నవాళ్లు మరింతమంది రావాలని నా ఆకాంక్షగా పేర్కొన్న ఆయన.. నేరస్థులను ఎదుర్కోవాలంటే చట్టాలపై అవగాహన ఉన్నవాళ్లు కావాలన్నారు.. ఇక, వచ్చే నెల 5, 6 తేదీల్లో రాజమండ్రిలో జనసేన పార్టీ సమావేశం నిర్వహిస్తాం అని వెల్లడించారు.. అయితే, రాబోయే ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరకూడదు అంతే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
కాగా, వారాహి యాత్రలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ రోజు భీమవరం అంబేద్కర్ సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.. సాయంత్రం 5 గంటలకు అంబేద్కర్ సెంటర్లో నిర్వహించనున్న బహిరంగ సభ ప్రసంగించనున్నారు.. ఇక, అనంతరం భీమవరం నుంచి హైదరాబాద్ బయల్దేరి వెళ్లనున్నారు.. మరోవైపు.. 6వ తేదీ తర్వాత తిరిగి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వారాహి యాత్ర ప్రారంభం అవుతుందని జనసేన పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. మొత్తంగా.. వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఓవైపు.. జనసేనాని వ్యాఖ్యలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న కౌంటర్ ఎటాక్ మరోవైపుతో ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ నడుస్తోంది. మరోవైపు, భీమవరం బహిరంగ సభలో పవన్ కీలక విషయాలను వెల్లడించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.. మరోసారి భీమవరం నుంచి తాను పోటీ చేసే విషయంపై ఈ రోజు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!