Pawan Kalyan: ఆ పరిస్థితి ఉండకూడదనే జనసేన స్థాపించా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన వారాహి యాత్ర కొనసాగుతోంది.. ఓవైపు సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెడుతూనే.. మరోవైపు జనవాణి పేరుతో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు.. ఇక, బహరంగ సభల్లో అధికార పార్టీ నేతలను టార్గెట్ చేసి ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఈ రోజు పశ్చిమ గోదావరి నరసాపురం నియోజకవర్గ నాయకులతో సమావేశం నిర్వహించిన ఆయన.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 2008 నుంచి రాజకీయాల్లో ఉన్నాను.. మార్పుకోసం పంతం పట్టి కొనసాగుతున్నా.. సమాజంలో విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు చాలా అవసరం.. ఈ మూడు కొద్ది మంది చేతుల్లోకి వెళ్లి.. మిగతా వాళ్లు దేహి అనే పరిస్థితిలో ఉండకూడదని ఉద్దేశంతో జనసేన స్థాపించానని తెలిపారు. ఎక్కడ చూసినా ఇసుక దోచేస్తున్నారు.. దీని వల్ల పర్యావరనానికి ముప్పు ఏర్పడుతుంది. ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంది.. ఆక్వా వల్ల ఏర్పడే కాలుష్యాన్ని నియంత్రించడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
ఉమ్మడి గోదావరి జిల్లాలో ఆక్వా కాలుష్యం వల్ల ఆరోగ్యం అనేది పెద్ద సమస్యగా మారిపోతుందన్నారు పవన్ కల్యాణ్.. గోదావరి జిల్లాలో కేరళ తరహా టూరిజం అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి.. కానీ, పెట్టుబడి పెట్టేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి లాంటివాళ్ళు వ్యాపారాలు చే..స్తూ తమ స్వార్థం చూసుకుంటున్నారని విమర్శించారు. నేను పార్టీ నడుపుతూ దెబ్బలు తిన్నాను తప్ప కార్యకర్తల ఆత్మగౌరవానికి ఎక్కడ భంగం వాటిల్లకుండా చూడగలిగాను అన్నారు. డబ్బులు ఖర్చు చేయకుండా అభిమానులు కార్యకర్తల ప్రేమాభిమానాన్ని జనసేన పార్టీ సొంతం చేసుకోగలుగుతుందని వెల్లడించారు.
Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
గోదావరి మీద ఆనకట్ట కట్టాలని కాటన్ ఒక్కడు పూనుకుంటే పని పూర్తి చేయగలిగారు.. అలా రాష్ట్రం కోసం ఇక్కడి ప్రజల కోసం కొంతమంది ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు పవన్.. పదవులకోసం పార్టీని తాకట్టు పెట్టలేం.. కనీసం విదేశాల్లో తరహా డంపింగ్ యార్డులు కూడా ఏర్పాటు చేయలేకపోతున్నారని మండిపడ్డారు.. రాజకీయాలంటే ఎంతసేపు బూతుల తిట్టుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం గా మార్చేశారని ఆరోపించారు. అందరి దృష్టి , దిష్టి గోదావరి జిల్లాల పైన పడింది.. దీని నుంచి విముక్తి కల్పించేందుకు గోదావరి జిల్లాల నుంచి పోరాటం మొదలు పెట్టానని వెల్లడించారు. ఉభయగోదావరి జిల్లాల్లో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవకూడదని లక్ష్యాన్ని పెట్టుకున్నామని పేర్కొన్నారు. ముఖ్య మంత్రి 18 ఏళ్ల వయసులో చేసిన అరాచకాలను తీసుకొని ఇప్పటి వైసీపీ నాయకుల పిల్లలు డీఎస్పీ, ఎస్పీలను కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎదుటి వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు మనం నోరు ఎత్తకపోతే మనకి అన్యాయం జరిగినప్పుడు ఎవరు రారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!