Parliament Session 2024: ప్రతిష్టంభనకు తెర.. నేటి నుంచి సజావుగా పార్లమెంట్ ఉభయసభలు!
- ఎట్టకేలకు ప్రతిష్టంభనకు తెర
- కిరణ్ రిజిజు ప్రకటన
- లోక్సభలో రాజ్యాంగంపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శీతాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి.. వారం రోజులుగా పార్లమెంటులో నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. అదానీ వ్యవహారం, యూపీ సంభల్ అల్లర్లు తదితర అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుపడుతుండటంతో.. సోమవారం కూడా ఉభయసభలు వాయిదా పడ్డాయి. దాంతో లోక్సభ స్పీకర్ ఓంబిర్లా అఖిలపక్ష సమావేశం నిర్వహించి.. నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఓ ప్రకటన చేశారు. మంగళవారం నుంచి ఉభయసభల సమావేశాలూ సజావుగా జరిగేలా సహకరించేందుకు అన్ని పక్షాలూ అంగీకరించాయని తెలిపారు.
రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంపై డిసెంబర్ 13, 14 తేదీల్లో లోక్సభలో.. డిసెంబర్ 16, 17 తేదీల్లో రాజ్యసభలో చర్చ జరగనుందని కిరణ్ రిజిజు తెలిపారు. సంభల్ హింస, మణిపుర్ అల్లర్లపై నిబంధనల ప్రకారమే నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. ఇక నేటి నుంచి పార్లమెంట్ ఉభయసభలు సజావుగా సాగనున్నాయి. సోమవారం అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్ నుంచి గౌరవ్ గొగొయ్, డీఎంకే నుంచి టీఆర్ బాలు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి కల్యాణ్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.
Also Read
- Shreyas Iyer: 63 మ్యాచ్ల తర్వాత రీఎంట్రీ.. కెప్టెన్గా తొలి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Crispy Raw Potato Paratha Recipe: ఉడికించిన బంగాళదుంపలు అవసరం లేదు.. పచ్చి ఆలూతో నిమిషాల్లో కరకరలాడే పరాఠా తయారీ ఇలా!
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడిని పక్కనబెడితే ఫలితం ఇలాగే ఉంటది".. టీమిండియా మేనేజ్మెంట్పై ఫైర్..
Also Read: Travis Head: ఆ భారత బౌలర్ను ఎదుర్కొన్నానని.. నా మనవళ్లకు గర్వంగా చెబుతా: హెడ్
ఈరోజు ఉదయం 10 గంటలకు ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్లు సమావేశం కానున్నారు. పార్లమెంట్ భవనంలో, రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఖర్గే కార్యాలయంలో సమావేశం జరగనుంది. అదానీ అంశంపై చర్చించాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోంది. బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితి, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రసాయన ఎరువుల సమస్యల, ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలకు నిధుల కొరత,మణిపూర్-ఈశాన్య రాష్ట్రాల సమస్యలపై చర్చ జరగాలని త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోంది. సంభాల్ హింస, అల్లర్లపై చర్చ జరపాలని సమాజ్ వాది పార్టీ సిద్ధంగా ఉంది. ఢిల్లీలో వాయ కాలుష్యంపై చర్చ జరగాలని ఆమ్ ఆద్మీ పార్టీ కోరుకుంటోంది. పార్లమెంట్ ఉభయ సభలు 5 రోజుల వరుస వాయుదాల వల్ల రూ.45 కోట్లు ఖర్చు వాటిల్లింది.
తాజావార్తలు
-
Shreyas Iyer: 63 మ్యాచ్ల తర్వాత రీఎంట్రీ.. కెప్టెన్గా తొలి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు..
-
Hero Passion+ Disc: న్యూ లుక్, డిజిటల్ ఫీచర్లతో విడుదలైన హీరో ప్యాషన్ కొత్త మోడల్.. 71KM మైలేజీ
-
Bahubali -3 : బాహుబలి 3.. అసలు సాధ్యమయ్యే పనేనా?
-
Sree Vishnu : శ్రీవిష్ణు బంపర్ ఆఫర్.. ‘దీవాన’కు బై 1 గెట్ 1 ప్రకటించిన హీరో!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!