Parigi : హైడ్రా రాకున్నా రెవెన్యూ అధికారుల దూకుడు..
- ఇళ్ల స్థలాల కేటాయింపు – ప్రస్తుతం నెలకొన్న వివాదం
- తహసీల్దార్ వ్యాఖ్యలు – లబ్ధిదారుల ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parigi : వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ అధికారుల చర్యలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల క్రితం తుంకులగడ్డ ప్రాంతంలో ప్రభుత్వంచే కేటాయించిన ఇళ్ల స్థలంలో లబ్ధిదారుడు ఇల్లు నిర్మించేందుకు బునాది గోడలు నిర్మిస్తుండగా, పరిగి తహసీల్దారు జేసీబీతో వచ్చి వాటిని ధ్వంసం చేశారు. అంతేకాదు, ఈ ఘటనను వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తి సెల్ఫోన్ను లాక్కొనడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై స్థానికులు అధికారుల తీరును తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు.
2002లో సర్వే నంబర్ 530లో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించి, అప్పటి తహసీల్దార్ వారికీ సర్టిఫికెట్లు అందజేశారు. అయితే ఆర్థిక కారణాల వల్ల చాలా మంది అప్పట్లో ఇళ్లు నిర్మించలేకపోయారు. ఇప్పుడు, కొంతమంది తమ స్థలాల్లో బునాది వేస్తే, తహసీల్దార్ ఆనంద్ జేసీబీ సహాయంతో గోడలను కూల్చివేయడం స్థానికులను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
Also Read
- NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
- Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
- YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
- Supreme Court: 'గృహిణులు జాతి నిర్మాతలు'.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
తహసీల్దార్ ఆనంద్ మాట్లాడుతూ, అప్పటి ఇళ్ల స్థలాల సర్టిఫికెట్లు చెల్లుబాటు కానివని, అవి ఫేక్ సర్టిఫికెట్లుగా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు. ఇంకా, “ఇళ్ల స్థలాలను కేటాయించినప్పుడు మూడు సంవత్సరాల్లోపు ఇల్లు నిర్మించాలి. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కట్టుకుంటే, ఆ స్థలం తిరిగి ప్రభుత్వ అధీనంలోకి వెళ్తుంది” అని స్పష్టం చేశారు. ఇక, పేదలకు అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో కొంతమంది ఇళ్లను నిర్మించుకుని జీవనం సాగిస్తుండగా, ఇప్పుడే కొత్తగా ఇళ్ల నిర్మాణం చేపట్టే వారికి అడ్డంకులు ఎందుకు పెడుతున్నారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల తీరుపై ప్రజల్లో ఆగ్రహం నెలకొంది.
Kesineni Chinni: విశాఖ స్టేడియం పేరు మార్పు వివాదంపై వైసీపీకి టీడీపీ కౌంటర్..
తాజావార్తలు
-
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
-
Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?