Paralysis: బ్లుటూత్ పరికరంతో పక్షవాతం వచ్చిన వ్యక్తి అవలీలగా నడుస్తున్నాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పక్షవాతం వచ్చిందంటే నడవడానికి కాలు రాదు, చేయి లేవదు. ఇంకేముంది అతని లైఫ్ అంతటితో ఆగిపోయినట్లే. పక్షవాతం వచ్చిన వారు ఇంకా పర్మినెంట్ గా మంచానికి పరిమితం కావాల్సిందే. వారు ఎటు తిరగాలన్న తిరగలేరు. కనీసం బాత్రూంకు వెళ్దామన్న ఇతరుల సాయమైనా కావాల్సిందే. అంతగా తిరగాలంటే వీల్ ఛైర్ వాడాల్సిందే. అయితే ఫారెన్ కంట్రీస్ లో టెక్నాలజీ పెరిగిపోతుంది. నెదర్లాండ్లోని పక్షవాతానికి గురైన ఓ వ్యక్తి ప్రత్యేక బ్లూటూత్ పరికరం సాయంతో ఎవరి అవసరం లేకుండా నడవగలుగుతున్నాడు.
Also Read :kim jong un: దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న కిమ్.. ఔషధాల కోసం విదేశాల ఆశ్రయం
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
ఏంటీ అవాక్కయ్యారా పక్షవాతం వచ్చిన వ్యక్తి బ్లూటూత్ నడవడమేంటనీ ఆశ్చర్యపోతున్నారా.. అవును మీరు విన్నది నిజమే.. ఆ వ్యక్తి బ్లూటూత్ను మెదడు, వెన్నుముకకు అనుసంధానించి సంకేతాలు పంపిస్తుండటం వల్లే వీల్ చైర్ కు పరిమితమైన ఆ వ్యక్తి నడవగలుగుతున్నాడు. ఈ పరికరాన్ని స్విట్జర్లాండ్కు చెందిన పరిశోధకులు రూపొందించారు. 12 సంవత్సరాల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ 40 ఏళ్ల గెర్డ్ జాన్ ఓస్కం. అతని వెన్నుముక దెబ్బతిన్నది. ఎన్ని ట్రీట్ మెంట్స్ చేయించుకున్నా.. వెన్నుముక సరిగా రాకపోగా చివరికి అతను పక్షవాతానికి గురయ్యాడు. ఇంకా చేసేదేమీ లేక అప్పటినుంచి చక్రాల కుర్చీకే పరిమితమైపోయాడు. ఆ వ్యక్తి నడవాలని పట్టుదలతో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీంతో వైద్యులు మెదడు, వెన్నెముకల్లో ఎలక్ట్రోడ్లను అమర్చారు. వీటిని బ్లూటూత్తో లింక్ చేశారు. అయితే ఈ బ్లూటుత్ మెదడు నుంచి వచ్చే సంకేతాల వల్ల కాళ్లతో పాటు అతని ఇతర శరీర భాగాల కదలికలను నియంత్రిస్తోంది.
Also Read : Mohan Babu: మోహన్ బాబు వంద కోట్ల సినిమా.. ప్రొడ్యూసర్ ఎవరంటే..?
దీంతో జాన్ ఓస్కం ఇతరుల సహాయం లేకుండానే సొంతంగా నిలబడగలుగుతున్నాడు. నడవగలుగుతున్నాడు, అలాగే మెట్లు కూడా ఎక్కుతున్నాడు. ప్రస్తుతం తయారుచేసిన ఈ బ్లూటుత్ పరికరం పరిమాణం కాస్త పెద్దదిగా ఉందని.. భవిష్యత్తులో దీన్ని చిన్నగా తయారుచేసేందుకు ప్లాన్ వేస్తున్నామని పరిశోధకులు పేర్కొన్నారు. మొత్తానికి నడవాలనే తన ఆశయం ముందు పక్షవాతన్నే ఎదురించాడు జాన్ ఓస్కం. ఇలాంటి పరికరాలు ఇండియాలో కూడా వస్తే.. పక్షవాతం వాళ్లకు ఉపయోగపడుతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!