kim jong un: దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న కిమ్.. ఔషధాల కోసం విదేశాల ఆశ్రయం
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా? నిద్రలేమి, మద్యంపై అతిగా ఆధారపడడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారా? అంటే అవునని అంటుంది దక్షణ కొరియా గూఢచారి ఏజెన్సీ. కిమ్ నిద్ర రుగ్మతతో బాధపడుతున్నారని.. ఆల్కహాల్, సిగరెట్ల వ్యసనం తీవ్రమైందని తెలిపింది. కిమ్ చికిత్స కోసం విదేశాల నుంచి ఔషధాలు దిగుమతి చేసుకుంటోందని వెల్లడించింది. కిమ్ కు అనారోగ్య సమస్యలు మరింత తీవ్రం కావడంతో ఔషధాలను వాడుతున్నారంటోంది దక్షిణ కొరియా.
Also Read : Karnataka: వీడేం డాక్టర్ సామి.. ఆపరేషన్ థియేటర్లోనే తప్ప తాగిపడిపోయాడు
Also Read
- Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఆరోగ్యంపై సస్పెన్స్ వీడినట్టేనా!? కుడ్యచిత్రం ఆవిష్కరణ
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్ నుంచి అతనొక్కడే మినహాయింపు.. కారణమేంటో..! సర్వత్రా చర్చ
- Israel-Lebanon: లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు.. 14 మంది మృతి
- Salim Dola: టర్కీలో దొరికిన దావూద్ రైట్ హ్యాండ్.. భారత్ మాస్టర్ ప్లాన్ హిట్!
కిమ్ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు అక్కడి అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అతనికి చికిత్స చేసేందుకు విదేశీ వైద్య సమాచారాన్ని సేకరిస్తున్నారు. కిమ్ కు ఉన్న జబ్బును తగ్గించే ఔషధాల కోసం వెతుకుతున్నారని దక్షిణ కొరియా నిఘా సంస్థ వివరించింది. అయితే కిమ్ మద్యపానం, ధూమపానం అతిగా చేయడం ద్వారా నిద్ర రుగ్మత మరింత పెరిగి.. తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని వెల్లడించింది. అంతేకాకుండా కిమ్ కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఉన్నాయని.. ఇటీవల చాలా అలసిపోయినట్లుగా ఉన్నట్లు తెలిపింది దక్షిణ కొరియా.
Also Read : WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ లో వారితో ప్రమాదమంటున్న రిక్కీ పాంటింగ్
ఇన్నీ అనారోగ్య సమస్యలు ఉన్నా కిమ్.. తన అలవాట్లలో ఏం మార్పులేదని దక్షిణకొరియా నిఘా సంస్థలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా కిమ్ కోసం ఉత్తర కొరియా విలువైన బ్రాండ్ల విదేశీ సిగరెట్లను పెద్ద సంఖ్యలో దిగుమతి చేసుకుంటోందని దక్షిణ కొరియా అధికార పీపుల్ పవర్ పార్టీ శాసనసభ్యుడు ఒకరు తెలిపారు. ఇటీవల కిమ్ చిత్రాలను ఆర్టిఫిషీయల్ ఇంటెలిజన్స్ ద్వారా విశ్లేషిస్తే.. కిమ్ బరువు అనూహ్యంగా పెరిగినట్లు కనిపిస్తోందని దక్షిణ కొరియా అధికారి తెలిపారు. కిమ్ 140 కిలోలు ఉండొచ్చని వెల్లడించారు.
Also Read : Sachin Tendulkar : రెజ్లర్ల ఉద్యమంపై సచిన్ ఎందుకు మౌనంగా ఉన్నారు?
మరోవైపు ఉత్తర కొరియాలో ఫిబ్రవరిలో తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడింది. దానికి కారణం కిమ్ జాంగ్ ఉన్ నియంత పోకడలేనని అక్కడి వారు అంటున్నారు. ఆకలితో చాలా మంది చనిపోయిన పరిస్థితి కూడా ఏర్పడింది. నేరాలు, ఆత్మహత్యలు, ఆకలి మరణాలు ఉత్తరకొరియాలో గతంలో కంటే రెట్టింపయ్యాయని దక్షిణ కొరియా వెల్లడించింది. అయితే అక్కడి పరిస్థితులను చక్కదిద్దేందుకు అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చర్యలు చేపట్టారు. అధికార పార్టీ ప్రముఖులతో సమీక్ష నిర్వహించారు. ఉత్తర కొరియాలో వ్యవసాయ రంగం పరిస్థితులపై చర్చించారు. కిమ్ జాంగ్ దేశం కోసమా.. లేదంటే తన ప్రాణాల కోసం పోరాడుతాడో చూడాలి.
తాజావార్తలు
-
AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
-
Tamil Cinema : కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ కుదుపు.. హీరోలకు రెమ్యునరేషన్ ఇచ్చేది లేదని నిర్ణయం
-
Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
-
Ashu Reddy: 9.5 కోట్ల చీటింగ్ కేసు.. మీడియా ముందుకు అషు రెడ్డి?
-
Traffic Constable: రైతు ఇబ్బంది తీర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. స్థానికుల నుంచి ప్రశంసల వర్షం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!