Pakistan Elections: పాకిస్థాన్లో ఎన్నికలు.. కొత్త ప్రధానిని ఎన్నుకోనున్న 12.85 కోట్ల మంది ఓటర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Elections: పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికలకు నేడు(గురువారం) ఓటింగ్ జరగనుండగా, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు సైన్యం మద్దతు ఉందని భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బుధవారం కూడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బలూచిస్థాన్ ప్రావిన్స్లోని ఎన్నికల కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్న జంట బాంబు పేలుళ్లలో కనీసం 30 మంది మరణించారు. 40 మందికి పైగా గాయపడ్డారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉండడంతో షరీఫ్కు చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది.
Read Also: Taxpayers Data: దేశంలో రూ.కోటి సంపాదిస్తున్న వారి సంఖ్య 2.16లక్షలు
Also Read
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్గాంధీ విమర్శలు
- IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
- Faaah : 'ఫాహ్..' వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
తన పార్టీ ఎన్నికల చిహ్నమైన క్రికెట్ ‘బ్యాట్’ను తొలగించాలన్న ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించడంతో ఇమ్రాన్ఖాన్ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 74 ఏళ్ల షరీఫ్ గురువారం జరిగే ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నాలుగోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ పోటీలో బిలావల్ భుట్టో-జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) కూడా ఉంది. బిలావల్ భుట్టో-జర్దారీని ప్రధానమంత్రి పదవికి పార్టీ ప్రకటించింది.
విధుల్లో ఆరున్నర లక్షల మంది భద్రతా సిబ్బంది
పాకిస్తాన్ ఎన్నికల సంఘం గత ఏడాది డిసెంబర్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ను విడుదల చేసింది. భద్రతా పరిస్థితి క్షీణించినప్పటికీ ఎన్నికల ప్రక్రియను యథాతథంగా ఉంచింది. పాకిస్థాన్లో సాధారణ ఎన్నికల కోసం దాదాపు 6,50,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ఈ ఎన్నికల్లో 12.85 కోట్ల మందికి పైగా నమోదైన ఓటర్లు ఓటు వేయనున్నట్లు అధికారులు తెలిపారు. ‘రేడియో పాకిస్థాన్’ వార్తల ప్రకారం, ఓటర్ల భద్రత కోసం దాదాపు 6,50,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. వీరిలో పోలీసులు, పౌర సాయుధ దళాలు, సాయుధ దళాల సిబ్బంది ఉన్నారు.
ఉదయం 8 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభం
గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పాకిస్తాన్ ఎన్నికల సంఘం (ECP) ప్రకారం, జాతీయ అసెంబ్లీకి 5,121 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 4,807 మంది పురుషులు, 312 మంది మహిళలు, ఇద్దరు ట్రాన్స్జెండర్లు ఉన్నారు. నాలుగు ప్రావిన్షియల్ అసెంబ్లీలకు 12,695 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 12,123 మంది పురుషులు, 570 మంది మహిళలు, ఇద్దరు ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ఇప్పటికే మేజిస్ట్రేట్కు ప్రత్యేక అధికారాలు ఇచ్చిన ప్రిసైడింగ్ అధికారి ఓటింగ్ మెటీరియల్ను పోలీసులు, ఆర్మీ సిబ్బంది రక్షణలో పోలింగ్ స్టేషన్లకు తీసుకువెళతారని ఈసీపీ అధికారి ఒకరు తెలిపారు.
Read Also: Hookah banned: కర్ణాటకలో హుక్కా బ్యాన్… ఆ కేసులు పెరగడం వల్లేనా?
కమిషన్ డేటా ప్రకారం, పంజాబ్లో అత్యధికంగా 7,32,07,896 మంది ఓటర్లు నమోదు కాగా, సింధ్లో 2,69,94,769 మంది, ఖైబర్ పఖ్తుంఖ్వాలో 2,19,28,119 మంది, బలూచిస్థాన్లో 53,71,947 మంది, రాజధాని ఇస్లామాబాద్లో 10,83,029 మంది ఓటర్లు ఉన్నారు. ECP దేశవ్యాప్తంగా 9,07,675 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో పురుష ఓటర్లకు 25,320, మహిళలకు 23,952 మరియు మరో 41,403 మిశ్రమ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ ప్రకారం, 44,000 పోలింగ్ స్టేషన్లు సాధారణమైనవి కాగా, 29,985 సున్నితమైనవి మరియు 16,766 అత్యంత సున్నితమైనవిగా ప్రకటించబడ్డాయి.
ఇమ్రాన్ పార్టీపై పెద్ద ఆరోపణ
ఇదిలావుండగా, ఫిబ్రవరి 8న జరగనున్న ఎన్నికల్లో తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ‘కావలసిన ఫలితాలు’ సాధించేందుకు పాకిస్థాన్లో రాజకీయ కుట్ర జరుగుతోందని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ ‘పీటీఐ’ బుధవారం ఆరోపించింది. గురువారం జరగనున్న ఎన్నికల్లో ఖాన్ పార్టీని గెలిపించకుండా రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని పీటీఐ అధికార ప్రతినిధి రౌఫ్ హసన్ బుధవారం అన్నారు. ప్రస్తుత ఎన్నికల ప్రక్రియలో ఖాన్, అతని పార్టీ స్థాయి ప్లేయింగ్ ఫీల్డ్ లేదని ఆరోపించారు.
తాజావార్తలు
-
Alprazolam Seizure : సైబరాబాద్లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్ను చంపేశారు
-
Nayanthara : మహాశక్తి’తో కంబ్యాక్ ఇస్తుందా?
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?