Taxpayers Data: దేశంలో రూ.కోటి సంపాదిస్తున్న వారి సంఖ్య 2.16లక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taxpayers Data: భారతదేశంలో సంవత్సరానికి రూ.కోటి కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2023-24 అసెస్మెంట్ సంవత్సరంలో ఈ సంఖ్య 2.16 లక్షలకు చేరుకుంది. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్లో వెల్లడించారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి ప్రకారం, 2019 నుండి గణనీయమైన పెరుగుదలతో అధిక ఆదాయాన్ని సంపాదించేవారిలో సానుకూల ధోరణి కనిపిస్తోంది. ఇది ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ డేటా నుండి స్పష్టంగా కనిపిస్తుంది.
వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 27.6 శాతం వృద్ధిని నమోదు చేశాయని, పన్ను సంస్కరణలు, దేశ ఆర్థికాభివృద్ధిలో మంచి వేగం ఇందుకు కారణమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దీంతో పాటు ‘ప్రొఫెషనల్ ఇన్కమ్ రిపోర్టింగ్’లో కూడా పెరుగుదల కనిపించిందని పార్లమెంట్లో తెలియజేశారు. ఏటా కోటి రూపాయలకు పైగా ఆదాయం పొందుతున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరిగింది. తాజా సమాచారం ప్రకారం 2023-24 అసెస్మెంట్ సంవత్సరానికి డిసెంబర్ 31, 2023 నాటికి ఈ సంఖ్య 2.16 లక్షలకు పైగా పెరిగిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్లో బడ్జెట్ సెషన్లో తెలిపారు.
Also Read
- Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు!
- Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
Read Also:Handbag: ఈ బుల్లి హ్యాండ్ బ్యాగ్ ధర ఎన్ని లక్షలో తెలిస్తే అవాక్కవుతారు..
ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి కూడా మాట్లాడుతూ.. దేశంలో ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేసే వారి సంఖ్య ఏడాది ప్రాతిపదికన గణనీయంగా పెరుగుతోందని అన్నారు. వీరిలో కూడా కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య వేగంగా పెరిగింది. 2019-20 అసెస్మెంట్ సంవత్సరంలో ఈ సంఖ్య రూ. 1.09 లక్షల కోట్లు కాగా, 2022-23 అసెస్మెంట్ సంవత్సరంలో రూ. 1.87 లక్షలకు తగ్గింది.
అక్టోబర్ 26, 2023 నాటి డేటా ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023-24 అసెస్మెంట్ సంవత్సరానికి 7.41 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేశారు. వీరిలో 53 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు మొదటిసారిగా ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ డేటాను విడుదల చేసింది. దీని ప్రకారం 2013-14 అసెస్మెంట్ సంవత్సరంలో ఆదాయ రిటర్న్లను దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య 3.36 కోట్లు, ఇది 2021-22 అసెస్మెంట్ సంవత్సరంలో 90 శాతం పెరిగి 6.37 కోట్లకు చేరుకుంది.
Read Also:8th Pay Commission: ఉద్యోగులకు ప్రభుత్వం షాక్… ఇప్పట్లో 8వ వేతన సంఘం లాంటివేం లేవు
తాజావార్తలు
-
Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
-
Toxic Advance Booking: రిలీజ్కు ముందే యష్ ‘టాక్సిక్’ రికార్డు.. ‘ధురందర్’ను దాటేసిన బుకింగ్స్!
-
Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
-
Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ, రేపు పలుచోట్ల మోస్తరు వర్షాలు!
-
Raaka: ‘బన్నీని ఇలా ఎప్పుడూ చూడలేదు’.. ‘రాకా’ సెట్ చూసి షాకైన మంచు లక్ష్మి
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!