Taxpayers Data: దేశంలో రూ.కోటి సంపాదిస్తున్న వారి సంఖ్య 2.16లక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taxpayers Data: భారతదేశంలో సంవత్సరానికి రూ.కోటి కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2023-24 అసెస్మెంట్ సంవత్సరంలో ఈ సంఖ్య 2.16 లక్షలకు చేరుకుంది. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్లో వెల్లడించారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి ప్రకారం, 2019 నుండి గణనీయమైన పెరుగుదలతో అధిక ఆదాయాన్ని సంపాదించేవారిలో సానుకూల ధోరణి కనిపిస్తోంది. ఇది ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ డేటా నుండి స్పష్టంగా కనిపిస్తుంది.
వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 27.6 శాతం వృద్ధిని నమోదు చేశాయని, పన్ను సంస్కరణలు, దేశ ఆర్థికాభివృద్ధిలో మంచి వేగం ఇందుకు కారణమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దీంతో పాటు ‘ప్రొఫెషనల్ ఇన్కమ్ రిపోర్టింగ్’లో కూడా పెరుగుదల కనిపించిందని పార్లమెంట్లో తెలియజేశారు. ఏటా కోటి రూపాయలకు పైగా ఆదాయం పొందుతున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరిగింది. తాజా సమాచారం ప్రకారం 2023-24 అసెస్మెంట్ సంవత్సరానికి డిసెంబర్ 31, 2023 నాటికి ఈ సంఖ్య 2.16 లక్షలకు పైగా పెరిగిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్లో బడ్జెట్ సెషన్లో తెలిపారు.
Also Read
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
- Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
Read Also:Handbag: ఈ బుల్లి హ్యాండ్ బ్యాగ్ ధర ఎన్ని లక్షలో తెలిస్తే అవాక్కవుతారు..
ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి కూడా మాట్లాడుతూ.. దేశంలో ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేసే వారి సంఖ్య ఏడాది ప్రాతిపదికన గణనీయంగా పెరుగుతోందని అన్నారు. వీరిలో కూడా కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య వేగంగా పెరిగింది. 2019-20 అసెస్మెంట్ సంవత్సరంలో ఈ సంఖ్య రూ. 1.09 లక్షల కోట్లు కాగా, 2022-23 అసెస్మెంట్ సంవత్సరంలో రూ. 1.87 లక్షలకు తగ్గింది.
అక్టోబర్ 26, 2023 నాటి డేటా ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023-24 అసెస్మెంట్ సంవత్సరానికి 7.41 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేశారు. వీరిలో 53 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు మొదటిసారిగా ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ డేటాను విడుదల చేసింది. దీని ప్రకారం 2013-14 అసెస్మెంట్ సంవత్సరంలో ఆదాయ రిటర్న్లను దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య 3.36 కోట్లు, ఇది 2021-22 అసెస్మెంట్ సంవత్సరంలో 90 శాతం పెరిగి 6.37 కోట్లకు చేరుకుంది.
Read Also:8th Pay Commission: ఉద్యోగులకు ప్రభుత్వం షాక్… ఇప్పట్లో 8వ వేతన సంఘం లాంటివేం లేవు
తాజావార్తలు
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?