Taxpayers Data: దేశంలో రూ.కోటి సంపాదిస్తున్న వారి సంఖ్య 2.16లక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taxpayers Data: భారతదేశంలో సంవత్సరానికి రూ.కోటి కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2023-24 అసెస్మెంట్ సంవత్సరంలో ఈ సంఖ్య 2.16 లక్షలకు చేరుకుంది. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్లో వెల్లడించారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి ప్రకారం, 2019 నుండి గణనీయమైన పెరుగుదలతో అధిక ఆదాయాన్ని సంపాదించేవారిలో సానుకూల ధోరణి కనిపిస్తోంది. ఇది ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ డేటా నుండి స్పష్టంగా కనిపిస్తుంది.
వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 27.6 శాతం వృద్ధిని నమోదు చేశాయని, పన్ను సంస్కరణలు, దేశ ఆర్థికాభివృద్ధిలో మంచి వేగం ఇందుకు కారణమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దీంతో పాటు ‘ప్రొఫెషనల్ ఇన్కమ్ రిపోర్టింగ్’లో కూడా పెరుగుదల కనిపించిందని పార్లమెంట్లో తెలియజేశారు. ఏటా కోటి రూపాయలకు పైగా ఆదాయం పొందుతున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరిగింది. తాజా సమాచారం ప్రకారం 2023-24 అసెస్మెంట్ సంవత్సరానికి డిసెంబర్ 31, 2023 నాటికి ఈ సంఖ్య 2.16 లక్షలకు పైగా పెరిగిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్లో బడ్జెట్ సెషన్లో తెలిపారు.
Also Read
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
Read Also:Handbag: ఈ బుల్లి హ్యాండ్ బ్యాగ్ ధర ఎన్ని లక్షలో తెలిస్తే అవాక్కవుతారు..
ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి కూడా మాట్లాడుతూ.. దేశంలో ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేసే వారి సంఖ్య ఏడాది ప్రాతిపదికన గణనీయంగా పెరుగుతోందని అన్నారు. వీరిలో కూడా కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య వేగంగా పెరిగింది. 2019-20 అసెస్మెంట్ సంవత్సరంలో ఈ సంఖ్య రూ. 1.09 లక్షల కోట్లు కాగా, 2022-23 అసెస్మెంట్ సంవత్సరంలో రూ. 1.87 లక్షలకు తగ్గింది.
అక్టోబర్ 26, 2023 నాటి డేటా ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023-24 అసెస్మెంట్ సంవత్సరానికి 7.41 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేశారు. వీరిలో 53 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు మొదటిసారిగా ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ డేటాను విడుదల చేసింది. దీని ప్రకారం 2013-14 అసెస్మెంట్ సంవత్సరంలో ఆదాయ రిటర్న్లను దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య 3.36 కోట్లు, ఇది 2021-22 అసెస్మెంట్ సంవత్సరంలో 90 శాతం పెరిగి 6.37 కోట్లకు చేరుకుంది.
Read Also:8th Pay Commission: ఉద్యోగులకు ప్రభుత్వం షాక్… ఇప్పట్లో 8వ వేతన సంఘం లాంటివేం లేవు
తాజావార్తలు
-
Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!