Taxpayers Data: దేశంలో రూ.కోటి సంపాదిస్తున్న వారి సంఖ్య 2.16లక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taxpayers Data: భారతదేశంలో సంవత్సరానికి రూ.కోటి కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2023-24 అసెస్మెంట్ సంవత్సరంలో ఈ సంఖ్య 2.16 లక్షలకు చేరుకుంది. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్లో వెల్లడించారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి ప్రకారం, 2019 నుండి గణనీయమైన పెరుగుదలతో అధిక ఆదాయాన్ని సంపాదించేవారిలో సానుకూల ధోరణి కనిపిస్తోంది. ఇది ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ డేటా నుండి స్పష్టంగా కనిపిస్తుంది.
వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 27.6 శాతం వృద్ధిని నమోదు చేశాయని, పన్ను సంస్కరణలు, దేశ ఆర్థికాభివృద్ధిలో మంచి వేగం ఇందుకు కారణమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దీంతో పాటు ‘ప్రొఫెషనల్ ఇన్కమ్ రిపోర్టింగ్’లో కూడా పెరుగుదల కనిపించిందని పార్లమెంట్లో తెలియజేశారు. ఏటా కోటి రూపాయలకు పైగా ఆదాయం పొందుతున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరిగింది. తాజా సమాచారం ప్రకారం 2023-24 అసెస్మెంట్ సంవత్సరానికి డిసెంబర్ 31, 2023 నాటికి ఈ సంఖ్య 2.16 లక్షలకు పైగా పెరిగిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్లో బడ్జెట్ సెషన్లో తెలిపారు.
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
Read Also:Handbag: ఈ బుల్లి హ్యాండ్ బ్యాగ్ ధర ఎన్ని లక్షలో తెలిస్తే అవాక్కవుతారు..
ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి కూడా మాట్లాడుతూ.. దేశంలో ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేసే వారి సంఖ్య ఏడాది ప్రాతిపదికన గణనీయంగా పెరుగుతోందని అన్నారు. వీరిలో కూడా కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య వేగంగా పెరిగింది. 2019-20 అసెస్మెంట్ సంవత్సరంలో ఈ సంఖ్య రూ. 1.09 లక్షల కోట్లు కాగా, 2022-23 అసెస్మెంట్ సంవత్సరంలో రూ. 1.87 లక్షలకు తగ్గింది.
అక్టోబర్ 26, 2023 నాటి డేటా ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023-24 అసెస్మెంట్ సంవత్సరానికి 7.41 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేశారు. వీరిలో 53 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు మొదటిసారిగా ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ డేటాను విడుదల చేసింది. దీని ప్రకారం 2013-14 అసెస్మెంట్ సంవత్సరంలో ఆదాయ రిటర్న్లను దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య 3.36 కోట్లు, ఇది 2021-22 అసెస్మెంట్ సంవత్సరంలో 90 శాతం పెరిగి 6.37 కోట్లకు చేరుకుంది.
Read Also:8th Pay Commission: ఉద్యోగులకు ప్రభుత్వం షాక్… ఇప్పట్లో 8వ వేతన సంఘం లాంటివేం లేవు
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!