Pakistan: అప్పుల ఊబిలో పాకిస్థాన్.. ఖర్చులు తగ్గించుకునేందుకు పొదుపు బాట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: దాయాది దేశమైన పాకిస్థాన్ ప్రజల జీవితంపై ఆర్థిక సంక్షోభం అధికంగా ప్రభావం చూపుతోంది. సంక్షోక్షం తలెత్తడంతో ఆ దేశ సర్కారు నిత్యావసర వస్తువులపై కోత పెడుతోంది. అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన పాక్… తన ఖర్చులను తగ్గించుకునే పనిలో నిమగ్నమైంది. ద్రవ్యోల్బణం నుంచి బయటపడడానికి పొదుపు బాటను పట్టింది. ధరల పెరుగుదలతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ దుర్భర పరిస్థితుల్లో ధరల పెరుగుదల భారాన్ని తగ్గించుకునేందుకు ఆ దేశ ప్రజలు వంటగ్యాస్ను ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.
ఇంధన పొదుపు ప్రణాళిక అనే అంశంపై మంగళవారం పాక్ కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఇప్పటి నుంచి మార్కెట్లను రాత్రి 8.30గంటల వరకు, కళ్యాణ మండపాలను రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతించనున్నట్లు విలేకర్ల సమావేశంలో ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. దీనితో ఖజానాకు రూ.6వేల కోట్లు ఆదా అవుతాయన్నారు. ఫిలమెంట్ బల్బుల తయారీని ఫిబ్రవరి 1 నుంచి నిలిపివేయడం రూ.2,200 కోట్లు, గ్యాస్ను తక్కువగా వాడుకునే శంకువు ఆకారపు గీజర్ల వాడకాన్ని మాత్రమే అనుమతించడం ద్వారా రూ.9,200 కోట్లను ఆదా చేయనున్నామని చెప్పారు. పక్కపక్కనే ఉండే వీధి దీపాలను వెలిగించకపోతే రూ.400 కోట్లు మిగులుతాయని చెప్పారు.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
Harassment: దేశం విడిచి వెళ్తే రూ.కోటి ఇస్తామంటున్నారు.. సిట్ దర్యాప్తుకు హాజరైన మహిళా కోచ్
దేశంలోని ప్రభుత్వ కార్యాలయల్లో పొదుపు నిబంధనలను పాటించాలని ఆయన వెల్లడించారు. దీనిలో భాగంగా వర్క్ ఫ్రమ్ హోం విధివిధానాలను 10 రోజుల్లో ప్రకటిస్తామని పేర్కొన్నారు. సమావేశాలను సూర్యకాంతి అందుబాటులో ఉన్నప్పుడే నిర్వహించుకోవాలని, ఈరోజు మంత్రివర్గ సమావేశం అలానే జరిగిందని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి ఎలక్ట్రిక్ బైక్లను ప్రవేశపెడతామన్నారు. ఇదిలా ఉండగా.. ధరల భారాన్ని తగ్గించుకునేందుకు పాక్ ప్రజలు వంటగ్యాస్ను ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. ‘పాకిస్థాన్లో సిలిండర్లలో కాకుండా ప్లాస్టిక్ బ్యాగుల్లో వంట గ్యాస్ నింపుతున్నారు. గ్యాస్ పైపులన్ నెట్వర్క్తో అనుసంధానమైన దుకాణాల్లో ప్లాస్టిక్ బ్యాగుల్లో గ్యాస్ నింపుతున్నారు. చిన్న ఎలక్ట్రిక్ సక్షన్ పంప్ సాయంతో వీటిని వంట గదిలో వినియోగిస్తున్నారు.’అని రాసుకొచ్చారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!