Pakistan: అప్పుల ఊబిలో పాకిస్థాన్.. ఖర్చులు తగ్గించుకునేందుకు పొదుపు బాట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: దాయాది దేశమైన పాకిస్థాన్ ప్రజల జీవితంపై ఆర్థిక సంక్షోభం అధికంగా ప్రభావం చూపుతోంది. సంక్షోక్షం తలెత్తడంతో ఆ దేశ సర్కారు నిత్యావసర వస్తువులపై కోత పెడుతోంది. అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన పాక్… తన ఖర్చులను తగ్గించుకునే పనిలో నిమగ్నమైంది. ద్రవ్యోల్బణం నుంచి బయటపడడానికి పొదుపు బాటను పట్టింది. ధరల పెరుగుదలతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ దుర్భర పరిస్థితుల్లో ధరల పెరుగుదల భారాన్ని తగ్గించుకునేందుకు ఆ దేశ ప్రజలు వంటగ్యాస్ను ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.
ఇంధన పొదుపు ప్రణాళిక అనే అంశంపై మంగళవారం పాక్ కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఇప్పటి నుంచి మార్కెట్లను రాత్రి 8.30గంటల వరకు, కళ్యాణ మండపాలను రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతించనున్నట్లు విలేకర్ల సమావేశంలో ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. దీనితో ఖజానాకు రూ.6వేల కోట్లు ఆదా అవుతాయన్నారు. ఫిలమెంట్ బల్బుల తయారీని ఫిబ్రవరి 1 నుంచి నిలిపివేయడం రూ.2,200 కోట్లు, గ్యాస్ను తక్కువగా వాడుకునే శంకువు ఆకారపు గీజర్ల వాడకాన్ని మాత్రమే అనుమతించడం ద్వారా రూ.9,200 కోట్లను ఆదా చేయనున్నామని చెప్పారు. పక్కపక్కనే ఉండే వీధి దీపాలను వెలిగించకపోతే రూ.400 కోట్లు మిగులుతాయని చెప్పారు.
Also Read
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
- Foods for Naturally Glowing Skin: మెరిసే చర్మం కావాలా? ఈ ఫుడ్ తీసుకుంటే సహజ కాంతి మీ సొంతం..!
- Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
- Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
Harassment: దేశం విడిచి వెళ్తే రూ.కోటి ఇస్తామంటున్నారు.. సిట్ దర్యాప్తుకు హాజరైన మహిళా కోచ్
దేశంలోని ప్రభుత్వ కార్యాలయల్లో పొదుపు నిబంధనలను పాటించాలని ఆయన వెల్లడించారు. దీనిలో భాగంగా వర్క్ ఫ్రమ్ హోం విధివిధానాలను 10 రోజుల్లో ప్రకటిస్తామని పేర్కొన్నారు. సమావేశాలను సూర్యకాంతి అందుబాటులో ఉన్నప్పుడే నిర్వహించుకోవాలని, ఈరోజు మంత్రివర్గ సమావేశం అలానే జరిగిందని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి ఎలక్ట్రిక్ బైక్లను ప్రవేశపెడతామన్నారు. ఇదిలా ఉండగా.. ధరల భారాన్ని తగ్గించుకునేందుకు పాక్ ప్రజలు వంటగ్యాస్ను ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. ‘పాకిస్థాన్లో సిలిండర్లలో కాకుండా ప్లాస్టిక్ బ్యాగుల్లో వంట గ్యాస్ నింపుతున్నారు. గ్యాస్ పైపులన్ నెట్వర్క్తో అనుసంధానమైన దుకాణాల్లో ప్లాస్టిక్ బ్యాగుల్లో గ్యాస్ నింపుతున్నారు. చిన్న ఎలక్ట్రిక్ సక్షన్ పంప్ సాయంతో వీటిని వంట గదిలో వినియోగిస్తున్నారు.’అని రాసుకొచ్చారు.
తాజావార్తలు
-
DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
-
Foods for Naturally Glowing Skin: మెరిసే చర్మం కావాలా? ఈ ఫుడ్ తీసుకుంటే సహజ కాంతి మీ సొంతం..!
-
Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
-
Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!