Pakistan: అప్పుల ఊబిలో పాకిస్థాన్.. ఖర్చులు తగ్గించుకునేందుకు పొదుపు బాట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: దాయాది దేశమైన పాకిస్థాన్ ప్రజల జీవితంపై ఆర్థిక సంక్షోభం అధికంగా ప్రభావం చూపుతోంది. సంక్షోక్షం తలెత్తడంతో ఆ దేశ సర్కారు నిత్యావసర వస్తువులపై కోత పెడుతోంది. అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన పాక్… తన ఖర్చులను తగ్గించుకునే పనిలో నిమగ్నమైంది. ద్రవ్యోల్బణం నుంచి బయటపడడానికి పొదుపు బాటను పట్టింది. ధరల పెరుగుదలతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ దుర్భర పరిస్థితుల్లో ధరల పెరుగుదల భారాన్ని తగ్గించుకునేందుకు ఆ దేశ ప్రజలు వంటగ్యాస్ను ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.
ఇంధన పొదుపు ప్రణాళిక అనే అంశంపై మంగళవారం పాక్ కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఇప్పటి నుంచి మార్కెట్లను రాత్రి 8.30గంటల వరకు, కళ్యాణ మండపాలను రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతించనున్నట్లు విలేకర్ల సమావేశంలో ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. దీనితో ఖజానాకు రూ.6వేల కోట్లు ఆదా అవుతాయన్నారు. ఫిలమెంట్ బల్బుల తయారీని ఫిబ్రవరి 1 నుంచి నిలిపివేయడం రూ.2,200 కోట్లు, గ్యాస్ను తక్కువగా వాడుకునే శంకువు ఆకారపు గీజర్ల వాడకాన్ని మాత్రమే అనుమతించడం ద్వారా రూ.9,200 కోట్లను ఆదా చేయనున్నామని చెప్పారు. పక్కపక్కనే ఉండే వీధి దీపాలను వెలిగించకపోతే రూ.400 కోట్లు మిగులుతాయని చెప్పారు.
Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
Harassment: దేశం విడిచి వెళ్తే రూ.కోటి ఇస్తామంటున్నారు.. సిట్ దర్యాప్తుకు హాజరైన మహిళా కోచ్
దేశంలోని ప్రభుత్వ కార్యాలయల్లో పొదుపు నిబంధనలను పాటించాలని ఆయన వెల్లడించారు. దీనిలో భాగంగా వర్క్ ఫ్రమ్ హోం విధివిధానాలను 10 రోజుల్లో ప్రకటిస్తామని పేర్కొన్నారు. సమావేశాలను సూర్యకాంతి అందుబాటులో ఉన్నప్పుడే నిర్వహించుకోవాలని, ఈరోజు మంత్రివర్గ సమావేశం అలానే జరిగిందని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి ఎలక్ట్రిక్ బైక్లను ప్రవేశపెడతామన్నారు. ఇదిలా ఉండగా.. ధరల భారాన్ని తగ్గించుకునేందుకు పాక్ ప్రజలు వంటగ్యాస్ను ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. ‘పాకిస్థాన్లో సిలిండర్లలో కాకుండా ప్లాస్టిక్ బ్యాగుల్లో వంట గ్యాస్ నింపుతున్నారు. గ్యాస్ పైపులన్ నెట్వర్క్తో అనుసంధానమైన దుకాణాల్లో ప్లాస్టిక్ బ్యాగుల్లో గ్యాస్ నింపుతున్నారు. చిన్న ఎలక్ట్రిక్ సక్షన్ పంప్ సాయంతో వీటిని వంట గదిలో వినియోగిస్తున్నారు.’అని రాసుకొచ్చారు.
తాజావార్తలు
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
-
Vivo X Fold 6: వివో X Fold 6 త్వరలో మార్కెట్లోకి.. Geekbenchలో లిస్టింగ్.. 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీ
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!