Pakistan : పాకిస్థాన్లో కురుస్తున్న డబ్బుల వర్షం.. రికార్డు సృష్టించిన స్టాక్ మార్కెట్?
- పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లో కాసుల వర్షం
- ఐదు రోజుల్లో 10 శాతం కంటే ఎక్కువ పెరుగుదల
- మొదటిసారిగా 80 వేల పాయింట్ల స్థాయిని దాటిన కేఎస్ఈ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan : శుక్రవారం భారత షేర్లు పతనమవుతున్నప్పటికీ.. గత ఐదు రోజులుగా పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లో కాసుల వర్షం కురుస్తోంది. కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ సుమారు ఐదు రోజుల్లో 10 శాతం కంటే ఎక్కువ పెరుగుదలను చూస్తోంది. దీంతో కేఎస్ఈ తొలిసారిగా 80 వేల మార్కులను దాటింది. పెట్టుబడిదారులు పాకిస్తాన్లో ఆర్థిక పునరుద్ధరణ సంకేతాలను చూస్తున్నారు. దేశం ఆర్థిక లోటు తగ్గుతోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీకరణకు సంబంధించి ప్రభుత్వం పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చు. కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్లో డబ్బు ఎలా కురుస్తుందో గణాంకాల భాషలో అర్థం చేసుకుందాం.
కరాచీలో రికార్డు
పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీ కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ రికార్డు స్థాయిలో ట్రేడవుతోంది. ట్రేడింగ్ సెషన్లో కేఎస్ఈ మొదటిసారిగా 80 వేల పాయింట్ల స్థాయిని దాటింది. 80,059.87 పాయింట్లకు చేరుకుంది. అంతకు ముందు రోజు 78,801.53 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే శుక్రవారం కేఎస్ఈ 79,664.65 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ప్రస్తుతం కేఎస్ఈ 441 పాయింట్ల లాభంతో 79,243.03 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్లో పెరుగుదల రాబోయే రోజుల్లో కొనసాగవచ్చు.
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
Read Also:Air India Airlines : టాటా ఎయిర్లైన్ కంపెనీకి మళ్లీ నోటీసు.. 15రోజుల్లో తప్పు సరిదిద్దుకోవాలని సూచన
5 రోజుల్లో 10 శాతానికి పైగా జంప్
గత 5 ట్రేడింగ్ సెషన్లలో కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ పెట్టుబడిదారులకు 10 శాతం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. జూన్ 11 న కేఎస్ఈ 72,589.49 పాయింట్ల వద్ద ముగిసింది. ఈరోజు కేఎస్ఈ 80,059.87 పాయింట్లతో రికార్డు స్థాయికి చేరుకుంది. అంటే ఈ కాలంలో కేఎస్ఈలో 7,470.38 పాయింట్లు పెరిగాయి. అంటే కేఎస్ఈ ఇన్వెస్టర్లకు 10.29 శాతం రాబడిని ఇచ్చింది.
క్షీణిస్తున్న స్టాక్ మార్కెట్
మరోవైపు, భారత స్టాక్ మార్కెట్లో క్షీణత కనిపిస్తోంది. ట్రేడింగ్ సెషన్లో సెన్సెక్స్ 350 పాయింట్ల వరకు పడిపోయింది. ఉదయం 11:50 గంటలకు సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్ల పతనంతో 77,330.57 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ సెషన్లో సెన్సెక్స్ కూడా రోజు కనిష్ట స్థాయి 77,131.82 పాయింట్లకు చేరుకుంది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ రికార్డు స్థాయికి చేరుకుని క్షీణతతో ట్రేడవుతోంది. నిఫ్టీ 23,667.10 పాయింట్లతో రికార్డు స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత 23,491.50 పాయింట్లతో రోజు దిగువ స్థాయికి చేరింది. ప్రస్తుతం నిఫ్టీ 25 పాయింట్లకు పైగా క్షీణతతో 23,541.95 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
Read Also:మీ పిల్లలు ఫోన్కు అడిక్ట్ అయ్యారా.. అయితే, ఇలా చేయండి..?
తాజావార్తలు
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్బస్టర్!!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!