Pakistan : పోలీసులు మొబైల్స్ పై నిఘా.. అవి చూశారో శిక్ష ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan : పాకిస్తాన్ పోలీసుల పాలిట సోషల్ మీడియా శాపంగా మారింది. కారణం వారు విధి నిర్వహణలో సోషల్ మీడియాను ఉపయోగించడమే. కరాచీ పోలీసులు తమ 18 మంది పోలీసులను తొలగించినట్లు పాకిస్తాన్ మీడియా నివేదించింది. వారు పోలీసు ప్రోటోకాల్ను పాటించడం లేదని ఆరోపించారు. అసలు విషయం ఏంటంటే.. డ్యూటీ సమయంలో పోలీస్ యూనిఫాంలో డబుల్ మీనింగ్ వాయిస్ ఓవర్లు, ప్లేబ్యాక్ పాటలు, అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్ ఐజీ ఉత్తర్వుల్లో తెలిపారు. ఈ క్రమంలో పోలీసు అధికారులు యూనిఫాంలో వీడియోలను ఏ ప్లాట్ఫారమ్లోనైనా అప్లోడ్ చేయవద్దని నిషేధించారు. పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Also:Harassment: మేనల్లుడి వేధింపులపై ఫిర్యాదు.. యూపీ మహిళను కొట్టి, గుండు గీయించారు..!
Also Read
- Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
- ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ బౌలింగ్కు అంతా ఫిదా.. ఇషాన్ కిషన్కు తెలియని సీక్రెట్ ఇదే..!
శుక్రవారం, కరాచీ పోలీసులు క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై 12 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. దీంతో మొత్తం సస్పెండ్ పోలీసుల సంఖ్య 18కి చేరుకుంది. శుక్రవారం సస్పెండ్ అయిన 12 మంది పోలీసులలో 9 మంది పురుషులు, ముగ్గురు మహిళా సిబ్బంది ఉన్నారు. అంతకుముందు గురువారం, కరాచీ పోలీస్ చీఫ్ జావేద్ ఆలం యూనిఫాంలో ఉన్న ఆరుగురు పోలీసులను వీడియోలు తీసి టిక్టాక్లో అప్లోడ్ చేసినందుకు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన ఆరుగురు పోలీసులలో ఇద్దరు మహిళా పోలీసులు కూడా ఉన్నారు.
Read Also:Dj Tillu : సైలెంట్ గా పని కానిచ్చేసిన సిద్దు జొన్నలగడ్డ.. మరో బొమ్మరిల్లు..
సింధ్ ఐజీ ఆదేశాల మేరకు చర్యలు
సింధ్ పోలీస్ ఐజీ గులాం నబీ మెమన్ ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కరాచీ ఏఐజీ, జోనల్ డీఐజీ, ఎస్ఎస్పీలను ఆదేశించారు. డ్యూటీ సమయంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ టిక్టాక్లో వీడియోలను అప్లోడ్ చేసే పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. పోలీసు శాఖలో క్రమశిక్షణను కాపాడేందుకు ఈ చర్య తీసుకున్నారు. సాక్షాత్తూ డ్యూటీలో ఉండగానే సోషల్ మీడియాను దుర్వినియోగం చేసిన ఉదంతాలు వెలుగులోకి రావడంతో పోలీసు శాఖ ఇబ్బందికరంగా మారింది.
తాజావార్తలు
-
Ravi Teja: ఇరుముడి జోష్లోనూ రవితేజ కొత్త సినిమాపై సస్పెన్స్! అసలేమైంది?
-
Ananthika Sanilkumar: ‘ఎల్లమ్మ’లో హీరోయిన్ ఫిక్స్.. డీఎస్పీకి జోడీ ఎవరో తెలుసా?
-
Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
-
Kangana Ranaut: కంగనా, రామ్దేవ్ వివాదానికి రాఖీతో ముగింపు.. మిఠాయిలతో మళ్లీ అన్నాచెల్లెళ్ల బంధం!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!