IndvsPak: అవును.. భారత్తో మ్యాచ్ ఉంది.. అయితే ఏంటీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ లో జరుగనున్న వన్డే వరల్డ్ కప్ లో ఉత్కంఠభరితమైన మ్యాచ్ ఏదైన ఉందంటే అది ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ మాత్రమే అని ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు చెబుతారు. ఎందుకంటే దాయాది దేశంపై ఇప్పటి వరకు మనకు మంచి ట్రాక్ రికార్డ్ ఉందనే చెప్పాలి. అయితే ఈ వరల్డ్ కప్ లో జరిగే మ్యాచ్ పై పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాంను అక్కడి మీడియా ప్రశ్నించింది. దీనిపై అతడు రియాక్ట్ అవుతూ.. అవును.. భారత్తో మ్యాచ్ ఉంది.. అయితే ఏంటీ? అని అన్నాడు.
Read Also: Viral News: శరీరంపై 800 టాటూలు.. కనీసం టాయిలెట్ క్లీన్ చేసే పని దొరకట్లేదు..!
Also Read
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
అయితే.. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పాక్ సారథి బాబర్ అజాం.. భారత్ తో జరిగే మ్యాచ్ కోసం తామేం ఆత్రుతగా ఎదురుచూడడం లేదని అతడు చెప్పాడు. తాము ఆడే తొమ్మిది మ్యాచుల్లో టీమిండియాతో ఆడే మ్యాచ్ కూడా ఒకటని.. అన్ని మ్యాచ్ లకూ సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని బాబర్ అన్నాడు. తాము ప్రపంచ కప్ ఆడేందుకు ఇండియాకు వెళ్తున్నామని, అంతేతప్ప, కేవలం భారత్ తో ఆడేందుకు కాదని చెప్పాడు. టీమిండియా కాకుండా మరో ఎనిమిది జట్లతోనూ తాము పోటీ పడి గెలవాల్సి ఉందని బాబర్ తెలిపాడు. అన్ని జట్లపై ఆధిక్యత సాధిస్తేనే ఫైనల్ కు చేరుకుంటామని అతడు వ్యాఖ్యానించాడు.
Read Also: Kevin Spacey: థియేటర్లో అభిమానిది ‘అది’ పట్టుకున్న హీరో.. అచ్చం కోబ్రాలాగే ఉందంటూ..
కేవలం భారత్ తో జరిగే మ్యాచ్ పైనే కాకుండా అన్ని జట్లపైనా దృష్టి సారించామని పాక్ సారథి అన్నాడు. అన్ని జట్లపైనా బాగా ఆడి, గెలుస్తామని అతను ధీమా వ్యక్తం చేశాడు. ఓ కెప్టెన్ గా తాను ఏ దేశంలో మ్యాచ్ ఆడినా ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం సాధించాలని..అలాగే పాకిస్థాన్ ను గెలిపించాడని కృషి చేస్తానని బాబర్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కూడా ఇదే విధంగా ఆడతామన్నాడు. అయితే.. భారత్ లో జరుగనున్న వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా అహ్మదాబాద్లో అక్టోబరు 15న ఇండియా-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతంది. ఇప్పటికే ఐసీసీ మ్యాచ్ ల వివరాలను ప్రకటించింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ప్రపంచ కప్-2023 జరగనుంది. మొత్తం పది జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!