Meerut: ఒక అమ్మాయి, నలుగురు స్నేహితులు.. మూడు హత్యలు.. మళ్లీ వెలుగులోకి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వారు నలుగురూ మంచి స్నేహితులు. వారి మధ్య స్నేహం ఎలా ఉంటుందంటే.. ఒకరినొకరు చూసుకోకుండా, మాట్లాడకుండా ఉండలేరు. అయితే ఆ స్నేహితుల్లో ఇద్దరి స్నేహితుల కళ్లు ఒక్క అమ్మాయిపైనే పడ్డాయి. ఇద్దరూ ఆమెను ప్రేమించారు. అంతలోనే ఆ అమ్మాయిని ఇద్దరు ప్రేమిస్తున్నారని తెలిసింది. దీంతో ఇద్దరూ ఒకరికొకరు శత్రువులుగా మారారు. అయితే కొన్ని రోజుల తర్వాత.. నలుగురు స్నేహితులు కలిసి మద్యం సేవిస్తున్నారు. మత్తులో ఉండగా.. ఆ అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ఒకరికొకరు ఆ అమ్మాయి నాదంటే నాది అని గొడవ పెట్టుకున్నారు. అయితే ఆ గొడవ పెద్దదిగా కావడంతో అమ్మాయిని ప్రేమించే వారిలో ఒకరు.. తన తన స్నేహితులకు ఫోన్ చేసి రమ్మని ముగ్గురు స్నేహితులను హత్య చేయించాడు.
Project K: ప్రాజెక్ట్ కె.. రిలీజ్ డేట్ తెలిసిపోయిందోచ్.. ?
Also Read
- తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
- Farmers Protest: వ్యవసాయాన్ని ట్రేడ్ డీల్లో చేర్చొద్దు.. కేంద్రానికి రైతుల వార్నింగ్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్కు స్పష్టమైన సందేశం..
- స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
నిందితుడు తన ముగ్గురు స్నేహితుల మృతదేహాలను బాగ్పత్లోని హిండన్ ఒడ్డున పాతిపెట్టేందుకు ప్రయత్నించగా.. అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ట్రిపుల్ మర్డర్ 2008లో జరగగా.. ఇంకా ఈ కేసు కోర్టులోనే పెండింగ్లో ఉంది. మరోవైపు ప్రధాన నిందితుడు హాజీ ఇజ్లాల్కు ఇటీవల పెరోల్ రావడంతో.. 15 ఏళ్ల తర్వాత మరోసారి ఈ ఘటన వార్తల్లో నిలిచింది. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ముఖ్యమంత్రి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధాన నిందితుడు ఇజ్లాల్ను విచారించగా మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మీరట్ కాలేజీలో చదువుతున్న షీబా సిరోహి అనే విద్యార్థినితో ఇజ్లాల్ ఏకపక్షంగా ప్రేమలో ఉన్నాడని పోలీసులకు తెలిపాడు. అదే సమయంలో అతని స్నేహితుడు సునీల్ ధాకా కూడా అతన్ని ఇష్టపడటం ప్రారంభించాడని తెలిపాడు.
Pawan Kalyan: నన్ను అరెస్ట్ చేసుకోండి.. చిత్రవధ చేసుకోండి.. రెడీ..
అప్పట్లో ఈ మర్డర్ మిస్టరీపై మీరట్ నుండి ఢిల్లీ వరకు వందలాది మంది విద్యార్థులు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అంతేకాకుండా వ్యాపారులు కూడా తమ సంస్థలను మూసివేసి శాంతిభద్రతలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అయితే అప్పటి ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని మీరట్ కోర్టుకు బదిలీ చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై మీరట్ కోర్టులో విచారణ కొనసాగుతోంది. అయితే నిందితుడు ఇజ్లాల్ ఇటీవలే పెరోల్పై విడుదలయ్యాడు.
తాజావార్తలు
-
Kalyan Ram: ‘గెట్ వెల్ సూన్ బాబాయ్’.. బాలయ్య కోసం కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
-
Gopichand Malineni: ఫ్యాన్స్ టెన్షన్ పడొద్దు.. బాలయ్యకు స్వల్ప గాయమే
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
Farmers Protest: వ్యవసాయాన్ని ట్రేడ్ డీల్లో చేర్చొద్దు.. కేంద్రానికి రైతుల వార్నింగ్..
ట్రెండింగ్
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?