DK Aruna: ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడానికే ఈ సర్వే..
- సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర విమర్శలు
- ఈ సర్వే ద్వారా కుల.. జన గణన చేస్తామని ప్రభుత్వం చెబుతుంది- డీకే అరుణ
- కుల గణనకు విరుద్ధంగా ప్రశ్నావళి ఉంది- డీకే అరుణ
- ఆస్తులు.. అప్పులు.. భూములు.. ఏ పార్టీ అని అడుగుతున్నారు- డీకే అరుణ
- వ్యక్తిగత ఆస్తుల వివరాలు ప్రభుత్వానికి ఎందుకు- డీకే అరుణ
- ఈ సర్వే దేని కోసమో స్పష్టం చేయాలి- డీకే అరుణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా కుల, జన గణన చేస్తామని ప్రభుత్వం చెబుతుంది.. కుల గణనకు విరుద్ధంగా ప్రశ్నావళి ఉందని డీకే అరుణ ఆరోపించారు. ఆస్తులు, అప్పులు, భూములు, ఏ పార్టీ అని అడుగుతున్నారు.. వ్యక్తిగత ఆస్తుల వివరాలు ప్రభుత్వానికి ఎందుకని ప్రశ్నించారు. ఈ సర్వే దేనికోసమో స్పష్టం చేయాలి.. బీసీ వర్గాలను మోసం చేయడానికే ఈ సర్వే అని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడానికే ఈ సర్వే అని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెట్టడం సమంజసమా.. ఎన్నికల్లో ప్రజలను మోసం అధికారంలోకి వచ్చిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Read Also: HYDRA: బెంగళూరులో హైడ్రా బృందం పర్యటన.. పలు ప్రాజెక్టులపై స్టడీ
Also Read
- Tamil Nadu: "తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది".. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
- KTR: '8+8 = 0'.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సెటైర్లు..!
- Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
- Deputy CM Pawan Kalyan: ఏపీ మారుమూల గ్రామాలకు గుడ్న్యూస్.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
కేసీఆర్ కాళేశ్వరం పేరుతో దోచుకుంటే.. రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన పేరుతో దోచుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. లక్షన్నర కోట్ల దోపిడీకి మాత్రమే బీజేపీ వ్యతిరేకమని డీకే అరుణ అన్నారు. డ్రైనేజీ వెళ్లకుండా ముందు మూసీ చుట్టూ రీటైనింగ్ వాల్ కట్టండి.. కుల జన గణన పేరుతో ప్రజలను పక్కదారి పట్టించడం మోసం చేయడమేనని అన్నారు. బీసీల అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు.. రాజకీయంగా మోసం చేస్తున్నారని తెలిపారు. ప్రజలు ఇచ్చిన వివరాలు మాత్రమే స్వీకరించాలి.. బలవంతంగా వివరాలు స్వీకరిస్తే చూస్తూ ఊరుకోమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల స్వేచ్చను హరిస్తుంది.. 60 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఎందుకు కుల గణన చేయలేదని ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు.
Read Also: Truecaller: ట్రూకాలర్పై ఆదాయపు పన్ను శాఖ దాడులు.. ఆరోపణ ఏంటంటే?
తాజావార్తలు
-
Tamil Nadu: “తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది”.. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
-
KTR: ‘8+8 = 0’.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సెటైర్లు..!
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ స్పైడర్ మ్యాన్ అవ్వాలనుకున్నాడా? మరి ఎందుకు కుదరలేదు?
-
2027 ODI World Cup: ప్రపంచ కప్కు పసికూన నేరుగా అర్హత.. రెండుసార్లు ఛాంపియన్కు బిగ్ షాక్!
-
Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!