PM Modi: రక్తంతో ఆడుకున్నారు.. బెంగాల్ ఎన్నికల హింసపై ప్రధాని మోడీ ధ్వజం
PM Modi: మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పై ప్రధాని నరేంద్ర మోడీ శనివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పంచాయతీ ఎన్నికల సమయంలో ఆ పార్టీ రక్తంతో ఆడుకుందని అన్నారు. పశ్చిమ బెంగాల్లోని క్షేత్రీయ పంచాయితీ రాజ్ పరిషత్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తూ, “టీఎంసీ నే ఖూనీ ఖేల్ ఖేలా హై…” అని పీఎం మోడీ హిందీలో అన్నారు. అంతేకాకుండా, ఆ పార్టీ ఓటర్లను బెదిరిస్తోందని, వారి జీవితాలను నరకం చేస్తోందని కూడా ప్రధాని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి తమను తాము చాంపియన్లుగా అభివర్ణించుకునే వారే ఈవీఎంలను తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని ప్రధాని మోదీ అన్నారు.
Read Also: Indian Railway Cheap Medicine: ప్రయాణంలో ఆరోగ్యం క్షీణించిందా.. ఈ 50 రైల్వే స్టేషన్లలో చౌకగా మందులు
Also Read
- Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
- Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
“బీజేపీ అభ్యర్థి ఎవరూ నామినేషన్ వేయకుండా ఉండేందుకు వారు ఏమైనా చేస్తారు. బీజేపీ కార్యకర్తలను మాత్రమే కాకుండా ఓటర్లను కూడా బెదిరిస్తున్నారు. బూత్లను స్వాధీనం చేసుకునేందుకు కాంట్రాక్టులు ఇచ్చారు.. ఇది రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్న వారి తీరు.” అని ప్రధాన మంత్రి మోడీ మండిపడ్డారు. పార్టీ పనిని పూర్తి చేయడానికి ప్రాణాంతక దాడులను తన సాధనంగా ఉపయోగిస్తోందని తృణమూల్ కాంగ్రెస్పై ప్రధాని విరుచుకుపడ్డారు.
Read Also: Binoy Viswam: పార్లమెంట్లో బీజేపీ డాన్లాగా ప్రవర్తిస్తోంది..
పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికలు జూలై 8న జరగగా, 63,229 గ్రామ పంచాయతీ స్థానాలకు జూలై 11న ఓట్ల లెక్కింపు జరిగింది. పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) భారీ విజయం సాధించింది. మొత్తం 63,219 పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరగగా, 35 వేలకు పైగా స్థానాల్లో తృణమూల్ గెలిచింది. బీజేపీ దాదాపు 10 వేల స్థానాల్లో గెలుపొందగా, లెఫ్ట్- కాంగ్రెస్ కూటమి 6 వేల చోట్ల విజయం సాధించింది. 928 జిల్లా పరిషత్ సీట్లలో టీఎంసీ 880 సీట్లు కైవసం చేసుకోగా, బీజేపీ 31 సీట్లు, లెఫ్ట్- కాంగ్రెస్ కూటమి 15 సీట్లు గెలుచుకున్నాయి. మిగిలిన 2 సీట్లను ఇతరులు గెలుచుకున్నారు. పశ్చిమ బెంగాల్లో పంచాయితీ ఎన్నికలకు ముందు నెలలో ఎన్నికల సంబంధిత హింసలో మొత్తం 40 మంది మరణించారని నివేదికలు తెలిపాయి.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!