Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
- భారత విమానాలపై పాక్ నిషేధం పొడగింపు..
- ఆగస్టు 23 వరకు ఎయిర్ స్పేస్ క్లోజ్..
- NOTAM జారీ చేసిన పాకిస్థాన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ.
- పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పరస్పర ఎయిర్స్పేస్ ఆంక్షలు అమల్లోనే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: భారత విమానాలకు, సైనిక విమానాలకు విధించిన గగనతల ఆంక్షల్ని పాకిస్తాన్ మరోసారి పొడగించింది. తాజా నిర్ణయం ప్రకారం, భారత రిజిస్ట్రేషన్ కలిగిన విమానాలు, భారత ఎయిర్లైన్స్ నిర్వహించే లేదా లీజుకు తీసుకున్న విమానాలు, సైనిక విమానాలకు పాకిస్థాన్ గగనతలం ఆగస్టు 23 రాత్రి 11.59 గంటల వరకు అందుబాటులో ఉండదు. ఈ మేరకు పాకిస్తాన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ నోటీస్ టు ఎయిర్మెన్ (NOTAM) జారీ చేసింది. గతంలో ఉన్న ఆంక్షలు జూలై 24తో ముగియాల్సి ఉండగా, దానిని మరోసారి పాకిస్తాన్ పొడగించింది.
2025 ఏప్రిల్లో జరిగిన పహల్గామ్ దాడి అనంతరం భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించి పాక్, పీఓకేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. దీని తర్వాత పాకిస్తాన్ సైన్యం భారత్పై దాడికి ప్రయత్నించింది. దీనికి ప్రతిగా భారత్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన పలు కీలక వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. క్షిపణులు నూర్ ఖాన్ వంటి కీలక పాక్ ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేసింది.
Also Read
దీని తర్వాత పాకిస్తాన్, భారత్లు ఒకరిపై ఒకరు గగనతల ఆంక్షలు విధించుకున్నాయి. పాకిస్తాన్ తరహాలోనే పాక్ ఎయిర్ లైన్స్ నడుపుతున్న విమానాలు, సైనిక విమానాలకు భారత్ తన గగనతలాన్ని మూసేసింది. పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసేయడం వల్ల భారత విమానాలు అరేబియా సముద్రం మీదుగా తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీని వల్ల అదనపు సమయం, అదనపు ఖర్చులు పెరుగుతున్నాయి. ప్రయాణికులపై ఈ భారం పడుతోంది.
తాజావార్తలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
-
GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
-
Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో ‘ఇరుముడి’ ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
-
Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!