Off The Record : కాంగ్రెస్ ఢిల్లీ నేతల నుంచి షర్మిలకు ఫోన్స్ వస్తున్నాయా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెకు వరుసబెట్టి మిస్డ్ కాల్స్ ఇస్తోంది ఎవరు? ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తాజా వ్యాఖ్యల ఆంతర్యం ఏంటి? ఆమె తమతో కలిసి వస్తే బాగుంటుందని కాంగ్రెస్ అధిష్టానం అనముకుంటోందా? లేక ఆమే… కాంగ్రెస్కు దగ్గర అవుతున్నారా? అసలేం జరుగుతోంది?
కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి నాకు మిస్డ్ కాల్స్ ఎక్కువయ్యాయని వైఎస్ షర్మిల ప్రకటించడం కలకలం రేపుతోంది. తెలంగాణ కాంగ్రెస్లో ఎవరి నుంచి ఆమెకు మిస్డ్కాల్స్ వస్తున్నాయి? ఎందుకలా చేస్తున్నారు? ఇప్పుడే ఆ తంతు ఎందుకు మొదలైందన్న చర్చ జరుగుతోంది. కొంత కాలంగా తెలంగాణ రాజకీయాల్లో హడావిడి చేస్తున్నారు షర్మిల. వైఎస్ కరిష్మా రాజకీయంగా తనకు ఉపయోగపడేలా పావులు కదుపుతున్నారు. అది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో తెలియకున్నా… ఆమె మాత్రం తన ప్రయత్నం తాను చేస్తున్నారు. అంత వరకు బాగానే ఉంది గానీ…ఇప్పుడు మిస్డ్ కాల్ మేటర్స్ కొత్త చర్చకు దారితీస్తున్నాయి.
Also Read
- OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
- Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
- Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
అసలేం జరిగిందంటే….రెండు నెలల క్రితం ఢిల్లీలో కాంగ్రెస్ సుప్రీమ్ సోనియా గాంధీని కలిశారట షర్మిల. కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఈ దిశగా పావులు కదిపారట. ఆయన స్వయంగా షర్మిలను వెంట పెట్టుకుని వెళ్లి.. సోనియా గాంధీని కలిసినట్టు సమాచారం. ఆ సమయంలోనే.. వైఎస్సార్ టీపీని… విలీనం చేయాలనే ప్రతిపాదనపై చర్చ జరిగినట్టు తెలిసింది. షర్మిల, డీకే శివకుమార్ల ఉమ్మడి ఎన్ఆర్ఐ మిత్రుడొకరి చొరవతో ఈ భేటీ జరిగిందనే టాక్ కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో డీకే… కర్నాటక కాంగ్రెస్ కోసం చాలా కష్టపడ్డారని, వైఎస్ అంటే ఆయనకు అభిమానం అని తాజాగా కామెంట్ చేశారు షర్మిల. దీంతో చాలామందికి సోనియాతో భేటీ విషయంలో క్లారిటీ వచ్చిందని అంటున్నారు. షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయటానికే ఢిల్లీకి వెళ్లారా..? ఆ క్రమంలోనే మిస్డ్ కాల్స్ వస్తున్నాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు సంబంధం లేకుండానే… ఢిల్లీ నేతలు కాల్స్ చేస్తున్నారా..? అనే అనుమానం కూడా మొదలైందట. షర్మిల రాజకీయ వ్యవహారాలపై టి కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. తమను దెబ్బతీయడానికే… ఆమె పార్టీ పెట్టారన్న చర్చలు కూడా జరిగాయి. అలాంటి పరిస్థితిలో ఇక్కడి నేతల నుంచి ఆమెకు మిస్డ్ కాల్స్ వెళ్లే అవకాశం లేదు. అంటే డైరెక్ట్గా ఢిల్లీ నుంచి వస్తున్నాయా.. అన్న అనుమానాలు గాంధీభవన్లో పెరుగుతున్నాయి. తెలంగాణలో షర్మిల తమకు ఉపయోగపడతారని అధిష్టానం భావిస్తోందా? లేదంటే..వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఖమ్మం జిల్లా నాయకుడు కూడా కలిసి వస్తారనే ఎత్తుగడ ఉందా? అన్న సందేహాలు కూడా తాజాగా వస్తున్నాయట. ఖమ్మం జిల్లాకు చెందిన ఆ నాయకుడు కాంగ్రెస్ అధిష్టానం ముందు పెట్టిన సీట్ల జాబితాలో సికింద్రాబాద్ అసెంబ్లీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ సీటు షర్మిల కోసమేనా అన్న అనుమానాలు ఉన్నాయి. అక్కడ క్రిస్టియన్ ఓట్లు ఎక్కువ కాబట్టి గతంలో జయసుధ లాగా ఇప్పుడు షర్మిల చట్టసభలో అడుగుపెట్టాలనుకుంటున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. కానీ.. బయట జరుగుతున్న ప్రచారాన్ని షర్మిల కొట్టి పారేసినట్టు చెబుతున్నారు. ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో తేలాలంటే…మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
Survival Thriller: గుహల్లో చిక్కుకున్న స్నేహితులు.. ప్రాణాలు తీసే రహస్య జీవి… వణికించబోతున్న సర్వైవల్ థ్రిల్లర్
-
Kannada Villains : తెలుగు సినిమాల్లో బలమైన విలన్లుగా ముద్ర వేస్తున్నారు కన్నడ నటులు
-
Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
-
Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!