Off The Record : ఆ నేతల మధ్య విచిత్రమైన సిట్యువేషన్..! బీజేపీలో ఎవరికి వారే యమునాతీరే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ పార్టీ నేతలు…పైకి మాత్రం మేమంతా ఐక్యంగా ఉన్నామని చెప్పుకుంటారు. లోపల మాత్రం ఎవరికీ వారే…యమునా తీరే. ఒకరి రిస్క్లోకి ఇంకొకరు రారు…వైరి పక్షం నుంచి విమర్శలు వచ్చినా…అసలు పట్టించుకోరు. అరోపణలను తిప్పికొట్టడానికి ప్రయత్నించరు. విమర్శలు ఎదుర్కొన్న నేతలే…చివరికి కౌంటర్ ఇచ్చుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది ? రాజకీయాల్లో పార్టీలు, నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు కామన్. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం…పాలిటిక్స్లో నిత్యం జరిగేదే. పార్టీలపై ప్రత్యర్థులు ఏవైనా ఆరోపణలు, విమర్శలు చేస్తే…వాటిని ఇంకో పార్టీ తిప్పి కొడుతుంది. ఒక నేత ఏదైనా కామెంట్ చేస్తే…ఇంకో పార్టీ నేత దానికి కౌంటర్ ఇస్తారు. విమర్శలు, ప్రతి విమర్శలు రెగ్యులర్గా నడిచేవే. ఒక పార్టీలోని నేతను ఇంకో పార్టీ నేత విమర్శిస్తే .. ఆ పార్టీలోని మిగతా నేతలు కౌంటర్ ఇస్తారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతకు మూకుమ్మడిగా సపోర్ట్గా వస్తారు. తమ నేత మాట్లాడింది కరెక్ట్ అని ఎదురు దాడికి దిగుతారు. కానీ కాషాయ పార్టీలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. విచిత్రమైన సిట్యువేషన్ ఉందట. ఎవరైనా ఏదైనా మాట్లాడితే…దానికి వైరి పక్షాల నుంచి విమర్శలు వస్తే…బీజేపీలో మరో నేత స్పందించడం లేదు. తమ పార్టీ నుంచి మాట్లాడిన నేతకు మద్దతుగా నిలవడం లేదని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ పార్టీలో బడా నేతల మధ్య ఉండాల్సినంత ఎఫెక్షన్…అంతగా లేదని పార్టీ నేతలు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ను…బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బండిపై కేటీఆర్ సీరియస్ కామెంట్స్ చేస్తే…బీజేపీ నుంచి ఎవరు కౌంటర్ ఇవ్వలేదట. చివరికి బండి సంజయే…కేటీఆర్కు కౌంటర్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. పార్టీ నుంచి పెద్ద నేతలు ఎవరు రియాక్ట్ కాలేదట. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ను టార్గెట్ చేస్తూ…సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
Also Read
- 60 Years of Shiv Sena: 60 ఏళ్లలో 6 ముక్కలైన శివసేన.. ఆవిరైన బాలాసాహెబ్ ఆశయాలు?
- FIFA World Cup 2026: 'మంజాంబి' డబుల్ ట్రీట్.. స్విట్జర్లాండ్ 4-1 తేడాతో ఘన విజయం.!
- FIFA World Cup 2026: మెక్సికో సంచలన విజయం.. నాకౌట్ దశలోకి తొలి అర్హత సాధించిన జట్టుగా.!
- Bhadradri Kothagudem: దారుణం.. గర్భిణి కడుపులోనే కత్తెర మర్చిపోయిన నర్సు.. తల్లీబిడ్డల మృతి!
రేవంత్రెడ్డికి కౌంటర్ ఇచ్చేందుకు మరో నేత ప్రయత్నించలేదు. ఒక్క నేత కూడా ఈటల రాజేందర్కు సపోర్ట్గా మాట్లాడపోవడంపై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. చివరికి ఆయనే ఒక్కడే…రేవంత్రెడ్డికి కౌంటర్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని…కాంగ్రెస్ నేతలు, మంత్రులు, BRS నేతలు విమర్శిస్తున్నారు. తెలంగాణకు తెచ్చింది ఏంటని ప్రశ్నిస్తున్నారు. కిషన్ రెడ్డికి మద్దతుగా…ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పందించడానికి వెనుకడుగు వేస్తున్నారట. మీడియా సమావేశం పెట్టి ఖండించడానికి ఆసక్తి చూపడం లేదట. మహేశ్వర్ రెడ్డి…ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్పై విమర్శలు చేశారు. ఆయన కామెంట్స్పై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. అయితే ఒక్క బీజేపీ నేత కూడా తిరిగి కౌంటర్ ఇవ్వకపోవడంపై పార్టీలో ఏం జరుగుతోందని కింది స్థాయి కార్యకర్తలు చర్చించుకుంటున్నారట. ఈ పరిణామాలు చూస్తుంటే…ఆ పార్టీ నేతల్లో సమిష్టితత్వం లోపించిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒకరికొకరు అండగా నిలబడకపోతే ఎలా అని కాషాయ పార్టీ కేడర్ ప్రశ్నిస్తోందట. ఇప్పటికైనా నేతలు మారకపోతే…మున్ముందు పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు తయారవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
తాజావార్తలు
-
Telegram: నీట్ పేపర్ లీక్ కేసు.. టెలిగ్రామ్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
60 Years of Shiv Sena: 60 ఏళ్లలో 6 ముక్కలైన శివసేన.. ఆవిరైన బాలాసాహెబ్ ఆశయాలు?
-
FIFA World Cup 2026: ‘మంజాంబి’ డబుల్ ట్రీట్.. స్విట్జర్లాండ్ 4-1 తేడాతో ఘన విజయం.!
-
Best Bikes: బడ్జెట్ ధరలో.. రోజువారీ ప్రయాణానికి బెస్ట్ బైక్స్..
ట్రెండింగ్
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!