Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record Over Ap Go Tuni Train Fire

Off The Record : తుని రైలుపై జీవో.. 24 గంటలు గడవకముందే రద్దు

Published Date :June 3, 2025 , 7:29 pm
By Gogikar Sai Krishna
Off The Record : తుని రైలుపై జీవో.. 24 గంటలు గడవకముందే రద్దు
  • Follow Us :
  • google news
  • dailyhunt

జీవో ఇచ్చి 24 గంటలు కూడా గడవక ముందే ఏపీ సర్కార్‌ ఎందుకు యూ టర్న్‌ తీసుకుంది? తుని రైలు దహనం కేసు రీ ఓపెన్‌ కోసం ఉత్తర్వులు ఇచ్చి వెంటనే ఉపసంహరించుకోవడానికి కారణం ఏంటి? తెర వెనక కథ ఏం జరిగింది? పర్యవసానాలు గరించి ముందే ఆలోచించకుండా జీవో ఇచ్చేశారా? ఏ స్థాయిలో ఫైల్‌ కదిలి జీవో బయటికి వచ్చింది? ఉత్తర్వులు ఇచ్చిందెవరు? ఆపిందెవరు? కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌తో 2016 జనవరి 31న తునిలో బహిరంగ సభ నిర్వహించారు. ఆ మీటింగ్ తర్వాత రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. తుని టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లను కాల్చేశారు. రైల్వే ఆస్తులు ధ్వంసం చేశారంటూ విజయవాడ రైల్వే కోర్టులో దాదాపు ఏడేళ్ళు విచారణ జరిగింది. విచారణ తర్వాత ఈ కేసులో నాటి కాపు ఉద్యమ నేత ముద్రగడతో పాటు మరో 41 మందికి సంబంధం లేదని కొట్టేసింది కోర్ట్‌. అయితే.. ఆ తీర్పు మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం హై కోర్ట్‌లో అప్పీల్‌కు వెళ్ళాలని నిర్ణయిచడం సంచలనమైంది. దీనికి సంబంధించిన జీవో కూడా జారీ అవడం ఒక ఎత్తయితే… 24 గంటలు గడవకముందే దాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు రావడం అంతకు మించిన సంచలనమైంది. తుని కేసును తిరగదోడే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తాజాగా క్లారిటీ ఇచ్చేశారు. కేసును కొట్టేస్తూ…రైల్వే కోర్ట్‌ ఇచ్చిన తీర్పును హైకోర్ట్‌లో సవాల్‌ చేయబోమని కూడా చెప్పేసింది ప్రభుత్వం. హైకోర్ట్‌కు వెళ్ళాలని నిర్ణయించినట్టు వచ్చిన జీవోను తక్షణనే రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకచన వచ్చింది ప్రభుత్వం వైపు నుంచి. అయితే… అసలు చర్చ ఇక్కడే మొదలైంది. ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా జీవో బయటికి వచ్చిందా? అదే నిజమైతే… అలాంటి జీవోను ఇచ్చిందెవరన్న చర్చ జరుగుతోంది సచివాలయ వర్గాల్లో. ఏ స్థాయిలో ఆమోదంతో ఫైల్ నడిచిందన్న విషయంపై ఆరా తీస్తోందట సర్కార్‌. ఆర్పీఎఫ్‌ సీనియర్ డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన ప్రతిపాదనల ఆధారంగా ఆ ఉత్తర్వులు వచ్చినట్టు గుర్తించారట అధికారులు. కాపు రిజర్వేషన్ అన్నది చాలా సున్నితమైన అంశం. ఇలాంటి విషయంలో పార్టీలు, ప్రభుత్వాలు ఆచితూచి వ్యవహరిస్తూ వస్తున్నాయి.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా గతంలో కాపు రిజర్వేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా స్పందించిన పరిస్థితి. కానీ… వీటితో సంబంధం లేకుండా…. సున్నితమైన అంశాల్ని పట్టించుకోకుండా… తుని కేసును రీ ఓపెన్‌ చేయాలనుకోవడంపై కూటమిలో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయిట్టు తెలుస్తోంది. ఇలాంటి అంశం మీద మొండిగా, మూర్ఖంగా ముందుకు వెళితే…కాపు సామాజిక వర్గంలో అలజడి రేగే ప్రమాదం ఉందని గుర్తించారు కూటమి పెద్దలు. ఆ క్రమంలోనే… ముందు ఇచ్చిన జీవోను ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అప్పీల్‌కు వెళితే… దాని మీద కచ్చితంగా వివిధ వర్గాల్లో చర్చ జరుగుతుందని, అంతిమంగా అది కాపు సామాజికవర్గంలో వ్యతిరేకతకు దారి తీసే ప్రమాదం ఉందని సర్కార్‌ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. కానీ… ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్న ప్రభుత్వ పెద్దలు ఎవరికీ తెలియకుండా జీవో ఎలా వచ్చిందన్నది ఇక్కడ క్వశ్చన్‌ మార్క్‌. సాధారణంగా… ఒక జీఓ ఇచ్చేటప్పుడు సంబంధిత మంత్రి..అవసరం అయితే ముఖ్యమంత్రి అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ.. ఇప్పుడు అలాంటివే జరక్కుండానే ఉత్తర్వులు బయటికి వచ్చాయా? అందుకే 24 గంటల్లోపే వెనక్కి తీసుకున్నారా అన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. జీవో ఎలా బయటికి వచ్చినా… పర్యవసానాలను ముందుగానే ఊహించారు కాబట్టే… ప్రభుత్వ పెద్దలు వెంటనే స్పందించి దాన్ని ఉపసంహరించుకుని ఉండవచ్చంటున్నారు. సమస్య కాపు సామాజిక వర్గానికి సంబంధించినది కావడం, కూటమి ప్రభుత్వం పవన్‌ కళ్యాణ్‌ కీలకంగా ఉండటంతో… తక్షణ స్పందన ఉండి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • NTV Telugu
  • off the record
  • tuni train fire

తాజావార్తలు

  • RCB vs SRH : ఆర్సీబీ రచ్చ..కోహ్లీ-పడిక్కల్ తుఫాన్‌తో హైదరాబాద్ చిత్తు

  • Off The Record : ఆ నేతలు మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నారా..?

  • Iran Warning: భూతల దాడులు చేస్తే… అమెరికాకు అదే గతి.. ఇరాన్ పత్రిక వార్నింగ్

  • Viral Video: సీఎం బుగ్గపై ముద్దు పెట్టిన మహిళ.. నెట్టింట వీడియో వైరల్..

  • Story Board : ఇరాన్ ఉచ్చులో ట్రంప్..! యుద్ధం మొదలుపెట్టి.. ఎగ్జిట్ దొరకక అమెరికా అయోమయం

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions