Off The Record: కేంద్ర నాయకత్వం టాస్క్ను టి.బీజేపీ లైట్ తీసుకుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: కేంద్రంలో నరేంద్రమోడీ సర్కార్ అధికారంలోకి వచ్చి 9ఏళ్ళు పూర్తయిన సందర్భంగా…దేశవ్యాప్తంగా జన సంపర్క్ అభియాన్ కార్యక్రమం చేపట్టింది బీజేపీ. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్ళాలన్నది ఈ నెల రోజుల కార్యక్రమం లక్ష్యం. దాంతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా.. బీజేపీ అనుబంధ మోర్చాల ఉమ్మడి సమ్మేళనాలు, మేధావులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని ప్రోగ్రాం ఇచ్చింది పార్టీ. ఈనెల 15 నుంచి 22 దాకా అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పెట్టాలని కూడా సూచించింది. అయితే…ఐదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలుండి, ఈసారి అధికారంలోకి రావాలనుకుంటున్న తెలంగాణలో ఈ కార్యక్రమాలు ఎంతవరకు అమలవుతున్నాయన్నది పార్టీ నేతలకే అంతుబట్టడం లేదట. జాతీయ స్థాయి నాయకులు వస్తున్నారు, వెళ్తున్నారు తప్ప రాష్ట్రంలో పెద్దగా చురుకుముట్టినట్టు లేదన్నది పొలిటికల్ టాక్.
పార్టీ నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు వచ్చారు. ఒకటి రెండు రోజులు ఉన్నారు. ప్రకాష్ జవదేకర్ అయితే.. 6 రోజులు తెలంగాణలోనే ఉండి తన తిప్పలేవో తానుపడి వెళ్ళిపోయారు. కానీ… ఇక్కడి నాయకులెవరూ…పెద్దగా వాళ్ళతో కలిసి పాల్గొన్నట్టు కనిపించలేదు. పాత నేతల సంగతి పక్కనపెడితే… వలస నాయకులు అస్సలు పట్టించుకోలేదట. అంతా టచ్ మీ నాట్ అన్నట్టుగానే ఉన్నారట. వాళ్ళసలు తమ సొంత నియోజకర్గాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేయలేదంటున్నాయి పార్టీ వర్గాలు. కొందరు నేతల్ని పిలిచి ప్రోగ్రామ్ ఇచ్చినా… నియోజకవర్గాలకు వెళ్ళేందుకు అస్సలు ఆసక్తి చూపించలేదని తెలిసింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జరిగిన సభల్ని కూడా వేళ్ళమీదే లెక్కించవచ్చంటున్నారు.
Also Read
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
అభియాన్కు అనుకున్నంత ప్రాధాన్యం దక్కకపోవడానికి కారణం అంతర్గత విభేదాలేనని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఉండాలా? బయటికి పోవాలా? అన్న మీమాంసలో వలస నాయకులు, వాళ్ళు చూసుకుంటారులే అన్న ధోరణిలో పాత నేతలు ఉండి… అంతా కలిసి ప్రోగ్రామ్ని అట్టర్ ఫ్లాప్ చేశారన్నది టి బీజేపీ కేడర్ ఆవేదన. వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటూ… రాష్ట్రంలో పార్టీని నాశనం చేస్తున్నారని ఆవేదనగా ఉన్నారట కార్యకర్తలు. వెళ్ళేవాళ్లు వెళ్ళాలి, ఉండాలనుకుంటే పార్టీలైన్కు కట్టుబడి పనిచేయాలి గానీ…ఇలా చేయడమేంటని అంటోందట కేడర్. అటు అమిత్ షా సభ వాయిదా పడటం కూడా… పార్టీ శ్రేణుల్ని నిరాశ పర్చిందట. ఎన్నికల ముంగిట్లో…. ముందు ముందు చేపట్టబోయే కార్యక్రమాలైనా సక్సెస్ అవుతాయా లేక ఇలాగే ఉంటాయా అన్న ఆందోళన కూడా టీ బీజేపీ వర్గాల్లో వ్యక్తం అవుతోందట.
తాజావార్తలు
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!