Off The Record: మైనంపల్లి హనుమంతరావు దారెటు.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: మెదక్ బీఆర్ఎస్ టికెట్ తన కొడుక్కి ఇవ్వకపోవడంతో.. రగిలిపోయిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నిప్పులు చెరిగారు. తీవ్రంగా రగిలిపోయారు. తన కొడుక్కి టికెట్ రాకుండా చేశారంటూ.. ఘాటైన వ్యాఖ్యలతో రాజకీయాన్ని హీటెక్కించారు. ఆ పరిణామాలతో.. ఇక మైనంపల్లి టికెట్ కట్ అవుతుందని భావించారు అంతా. కానీ, వీటన్నిటినీ పట్టించుకోని కేసీఆర్ మైనంపల్లికే మల్కాజిగిరి టికెట్ ఇచ్చారు. ఆ తరువాత జరిగిన పరిణామ క్రమంలో చాలా మంది ఒకటి రెండు రోజుల్లో మైనంపల్లి ప్లేస్లో మరొకరిని ఖరారు చేస్తారని, ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తారని అనుకున్నారు. అలాంటివేం జరగలేదు. ఇంకా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారు మైనంపల్లి. కొడుకు రోహిత్ మెదక్ నుంచి పోటీచేసి తీరుతాడని బహిరంగంగానే చెప్పారు. మల్కాజ్గిరిలో మైనంపల్లి, మెదక్లో కొడుకు రోహిత్ టూర్లు కొడుతూనే ఉన్నారు. బిఆర్ఎస్ క్యాడర్ అంతా తమతోనే ఉందని చెబుతూ.. వారితో పాటు జెడ్పీటీసీలు, ఎంపిటీసీలు, సర్పంచ్లు, చైర్మన్లు, కార్పోరేటర్లు అందరినీ వెంటేసుకుని తిరుగుతున్నారు. క్యాడర్ కూడా పార్టీ వ్యవహారాల గురించి పట్టించుకోకుండా ఎమ్మెల్యే ఏ నిర్ణయం తీసుకున్నా సై అంటున్నారు.
ఈ పరిస్థితుల్లోనే హన్మంతరావు కాంగ్రెస్లో చేరుతున్నారన్న ప్రచారం ఇటీవల ఊపందుకుంది. ఒకవైపు మల్కాజ్గిరి టిక్కెట్ వరకు మైనంపల్లికి ఢోకా లేదు. బీఆర్ఎస్ అభ్యర్దిని మార్చలేదు. తీవ్ర వ్యాఖ్యలు చేసినా… పార్టీ నుంచి ఆయన్ని సాగనంపలేదు. ఈ లోగానే కాంగ్రెస్… మల్కాజిగిరి, మెదక్ టికెట్లను తండ్రి కొడుకులిద్దరికీ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయినా…. ఇంకా మైనంపల్లి ఏ డిసిషన్ చెప్పలేదంటున్నారు. ఇంతకీ మైనంపల్లి మల్కాజ్గిరి నుంచి ఏ పార్టీ తరపున పోటీచేప్తారు? కొడుకును మెదక్ బరిలోకి దింపుతారా? అసలు బిఆర్ఎస్లోనే ఉంటారా? కాంగ్రెస్ ఆఫర్ను కాదంటారా? ఆయన విషయంలో కేసీఆర్ ఏం చేయబోతున్నారన్న ప్రశ్నలన్నీ ప్రస్తుతానికి ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. ఇవన్నీ ఇప్పుడిప్పుడే తేలేలా కనిపించడం లేదు. అయితే క్యాడర్ను కంట్రోల్లో పెట్టుకున్న హన్మంతరావు కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూసిన తరువాతే తన భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తనను బలవంతంగా పార్టీ నుంచి బయటకు పంపినా, లేదా తనకు కాకుండా మరొకరికి టికెట్ ఇచ్చినా అప్పుడు ఇతర మార్గాల గురించి ఆలోచిస్తానని క్యాడర్కు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి అయితే సైలెంట్ అయిన మైనంపల్లి ఇది తుఫాన్ ముందు ప్రశాంతత అంటున్నారట. ముందు ముందు ఆ తుఫాన్ ఎలా మారుతుందో చూడాలి మరి.
Also Read
తాజావార్తలు
-
Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
-
YS Jagan: ముద్రగడకు జగన్ భావోద్వేగ నివాళి.. ‘పితృసమాన నేతను కోల్పోయాం’
-
Posani Krishna Murali: ‘మా నాన్న కూలీ.. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు’
-
IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
-
Venkatesh Maha: రంగస్థలం నేను రాసిన కథ: డైరెక్టర్ వెంకటేష్ మహా
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!