Off The Record: నామ మాత్రంగా జనసేన-బీజేపీ పొత్తు.. మేడం మార్చేస్తారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఉన్నా… అది పేరుకే తప్ప రెండు పార్టీలు కలిసి ప్రజా సమస్యలపై పోరాటాలు చేసింది లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి ఉద్యమించిన దాఖలాలు లేవు. పైగా… అందుకు కారణం మీరంటే… మీరంటూ.. పరస్పరం విమర్శలు సైతం చేసుకున్నారు. కేంద్రంలో బీజేపీకున్న అధికారానికి, లోకల్గా పవన్కున్న మాస్ ఇమేజిని కలగలిపి గట్టిగా వర్కవుట్ చేసి ఉంటే.. ఫలితం వేరేలా ఉండేదని, ఆ పని మానేసి నిందారోపణలతో కాలం వెళ్ళబుచ్చడంతో… ఇద్దరూ నష్టపోతున్నారన్నది రాజకీయ వర్గాల్లో బలంగా ఉన్న అభిప్రాయం.
మంచి ఫలితాలివ్వాల్సిన పొత్తు నామ్కే వాస్తేగా మిగిలిపోవడానికి కారణం బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు.. ఇంకొందరు వైసీపీ అనుకూలురైన నేతలేనన్న భావన జనసేన వర్గాల్లో బలంగా ఉంది. అందుకే ఓ అడుగు ముందుకు, పది అడుగులు వెనక్కి అన్నట్టుగా వ్యవహారం మారిపోయిందన్నది వారి మాట. వివిధ సందర్భాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతితో పాటు.. వివిధ అంశాల్లో జగన్ ప్రభుత్వంపై పోరాడేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కలిసి రావడం లేదనేది జనసేనలో జరుగుతున్న చర్చ. ఈ క్రమంలో వీర్రాజును మార్చి బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని నియమించడంతో ఇప్పడు కొత్త ఆశలు చిగురిస్తున్నాయట. రెండు పార్టీల మధ్య ఉన్న గ్యాప్ను కొత్త అధ్యక్షురాలు తగ్గిస్తారని ఏపీ బీజేపీ వర్గాల్లో నమ్మకం కుదురుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. సోము వీర్రాజును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా… పెద్దగా గుర్తించినట్టు కనిపించని జనసేనాని …పురంధేశ్వరిని నియమించిన వెంటనే కంగ్రాట్స్ చెబుతూ ప్రకటన ఇవ్వడాన్ని గుర్తు చేస్తున్నాయి ఆ వర్గాలు. పరిస్థితి చూస్తుంటే.. గ్యాప్ తగ్గి వ్యవహారం చక్కబడుతుందన్న నమ్మకం పెరుగుతోందంటున్నారట ఏపీ బీజేపీ లీడర్స్.
Also Read
- Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
- Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
- India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
- Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్లో భూకంపం..
పురంధేశ్వరి పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే… కేడర్లో జోష్ నింపాలంటే ముందు జనసేనతో మీటింగ్ పెట్టి అంతరాలు తొలగించుకోవడం ముఖ్యం అన్నది ఆ పార్టీ నేతల అభిప్రాయమట. ఓ కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసుకుని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటే తప్ప రెండు పార్టీల మధ్య ఉన్న అవరోధాలు, అప నమ్మకాలు తొలిగిపోవంటున్నారు బీజేపీ సీనియర్స్. ఇన్నాళ్ళు సోము వీర్రాజు జనసేనతో టచ్మీ నాట్ అన్నట్టుగా ఉండటమే అసలు సమస్య అని, ఇక నుంచి కొత్త అధ్యక్షురాలు ఆ స్థితిలో మార్పు తీసుకు రావాలంటున్నారు. మరి పురంధేశ్వరి ప్రాధాన్యతల్లో జనసేన ఉందా లేదా అన్నది ఇప్పుడు క్వశ్చన్ మార్క్.
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!