Off The Record: తమ్మినేని హంగామా అంతా పైపై డాంబికమేనా?
Off The Record: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం . శాసనసభాపతిగా ఉంటూనే ఫక్తు రాజకీయ విమర్శలు చేయడం ఆయన స్టైల్. అధికారులను మందలించడం, ప్రతిపక్షం మీద విరుచుకుపడటం లాంటి విషయాల్లో ఎక్కడా తగ్గరు తమ్మినేని. కానీ…అదంతా పైపై హంగామాయేనా అన్న అనుమానాలు ఇప్పుడు నియోజకవర్గంలో పెరుగుతున్నాయట. అక్రమ మైనింగ్ విషయంలో ఎందుకంత ఉదాసీనంగా ఉంటున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి.
పొందూరు, కృష్ణాపురం పరిసరాల్లో ప్రతిపక్ష టీడీపీ నేతలు అక్రమంగా మైనింగ్ చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు తమ్మినేని. కోట్లాది రూపాయల ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడుతుంటే… ఎలా చూస్తూ ఊరుకున్నారని అధికారులను నిలదీశారాయన. అక్రమ క్వారీల సంగతి తేల్చమని మైనింగ్ శాఖ అధికారులకు ఒకరకంగా క్లాస్ తీసుకున్నారు. భారీగా అనుచరులను వెంటేసుకుని తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారాయన. సీఐడీ దర్యాప్తునకు ఆదేశిస్తామని అప్పట్లో ప్రకటించారు కూడా. కానీ… సీన్ కట్ చేస్తే మేటర్ తుస్ మంది. విజిట్ చేసిన రోజు తప్ప తర్వాత దాని గురించి పట్టించుకున్నవాళ్ళు లేరట. ఎలాంటి ఎంక్వైరీలు లేకుండా యధేచ్చగా క్వారీలు రన్ అవుతున్నాయట. దీంతో అడుగుతున్న వాళ్ళకు ఏం చెప్పాలో అర్ధంగాక మండలంలో తమ్మినేని అనుచరులుగా ముద్ర పడ్డనేతలు తెల్ల ముఖాలు వేస్తున్నారట. అంతన్నారింతన్నారు.. అంతా ఏమైందని ఎవరైనా అడిగితే… ఎవ్వరి దగ్గరా సరైన సమాధానం లేదు.
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
కొన్ని విషయాల్లో అతి దూకుడు వ్యవహారాలు పార్టీ ఇమేజ్తోపాటు వ్యక్తిగతంగా తమ్మినేనికి కూడా నష్టం చేస్తున్నాయన్నది లోకల్ టాక్. గ్రావెల్ తవ్వకాలను క్షణాల్లో ఆపేయిస్తానంటూ నాడు చెప్పిన మాట నీటి మూటగానే మిగిలిపోయిందని నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. ఉక్కుపాదం మోపుతానన్న వ్యక్తి నుంచి ఉలుకూ పలుకూ లేదేంటని కేడర్లో కూడా చర్చ జరుగుతోందట. రాపాక , కృష్ణాపురం, ఇల్లయ్యగారిపేట, రెడ్డిపేట, వి.ఆర్. గూడెం , వావిలపల్లి పేటల్లో అక్రమ క్వారియింగ్, గ్రావెల్ త్రవ్వకాలు యధేచ్ఛగా జరుగుతున్నాయి. ఓ యువకుడి మృతితో అర్ధరాత్రి తవ్వకాల వ్యవహారం బయటపడింది. పోలీస్ , మైనింగ్ , రెవెన్యూ అధికారులతో పాటు వైసీపీ నేతలంతా ఆ ప్రాంతాన్ని చుట్టివచ్చారు. ఉపేక్షించబోమని హెచ్చరించారు. కానీ మాటలు కోటలు దాటాయి తప్ప చేతలు గడప దాటడం లేదన్నది లోకల్ టాక్. స్థానిక ఎమ్మెల్యేగా తమ్మినేని అటు బాధితుడి కుటుంబానికి గాని, ఇటు ప్రభుత్వ ఖజానాకు గాని న్యాయం చేయలేకపోయారని చెప్పుకుంటున్నారు. ఎలక్షన్ సీజన్లో ప్రతి అంశం ఓటరును ప్రభావితం చేస్తుంది. అలాంటిది ఓ మండలాన్నే కుదిపేస్తున్న అక్రమ మైనింగ్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తమ్మినేనికి మైనస్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అధికారంలో ఉండి కూడా అక్రమాలపై దర్యాప్తు చేయించలేకపోవడాన్ని ఎలా చూడాలని అడుగుతున్నారు స్థానికులు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!