Daggubati Purandeswari: ఎన్టీఆర్ది మరణం లేని జననం.. రాజకీయాల్లో కొత్త చరిత్ర రాశారు!
- ఎన్టీఆర్ 29వ వర్ధంతి
- ఎన్టీఆర్ సర్కిల్లో నివాళి అర్పించిన దగ్గుబాటి పురధేశ్వరి
- జన్మ జన్మకి ఆయనకే కూతురిగా పుట్టాలని కోరుకుంటున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహంకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురధేశ్వరి ఘన నివాళి అర్పించారు. మరణం లేని జననం ఎన్టీఆర్ జననం అని, జన్మ జన్మకి ఆయనకే కూతురిగా పుట్టాలని కోరుకుంటున్నాను అని పురధేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ గారు ఏ రంగంలో ఉన్నా.. ఆ రంగానికి ఆయన వన్నె తెచ్చారన్నారు. నేడు ఎన్టీఆర్ 29వ వర్ధంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబసభ్యులు నివాళులు అర్పిస్తున్నారు.
దగ్గుబాటి పురధేశ్వరి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ… ‘మరణం లేని జననం ఎన్టీఆర్ జననం. జన్మ జన్మకి ఆయనకే కూతురిగా పుట్టాలని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ గారు ఏ రంగంలో ఉన్నా.. ఆ రంగానికి ఆయన వన్నె తెచ్చారు. చలన చిత్రంలో కేవలం రంగులు వేసే వారీగా మాత్రమే గుర్తింపు వుండేది. ఎన్టీఆర్ గారు సినీ రంగంలోకి అడుగుపెట్టిన తరువాత సినీ చరిత్రకి కొత్త గుర్తింపు తెచ్చారు. రాజకీయాల్లో కూడా తన కంటూ కొత్త చరిత్ర రాశారు. మహిళల కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. పేదల కోసం రెండు రూపాయల కిలో బియ్యం, జనతా వస్త్రాలు, మాండలిక వ్యవస్థను తీసుకువచ్చారు. ఎన్టీఆర్ గారు ఆంధ్రులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు, ఆంధ్రుల ఆత్మ గౌరవం తీసుకువచ్చారు’ అని అన్నారు.
Also Read
- Pakistan-Taliban Tensions: పాకిస్తాన్కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
Also Read: Nara Lokesh: త్వరలోనే తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేస్తాం!
ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా విజయవాడ ఎన్టీఆర్ భవన్లో ఎంపీ కేశినేని చిన్ని నివాళులు అర్పించారు. ‘పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్. నారా లోకేష్ ఆధ్వర్యంలో కోటి సభ్యత్వంతో రికార్డు సృష్టించాం. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ కి కృషి చేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగడం లేదు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్యాకేజీ ప్రకటించడం ఆనందకరం’ అని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు.
తాజావార్తలు
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
-
Iran Hijab Law: ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు
-
Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
-
Pakistan-Taliban Tensions: పాకిస్తాన్కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
-
CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!