Daggubati Purandeswari: ఎన్టీఆర్ది మరణం లేని జననం.. రాజకీయాల్లో కొత్త చరిత్ర రాశారు!
- ఎన్టీఆర్ 29వ వర్ధంతి
- ఎన్టీఆర్ సర్కిల్లో నివాళి అర్పించిన దగ్గుబాటి పురధేశ్వరి
- జన్మ జన్మకి ఆయనకే కూతురిగా పుట్టాలని కోరుకుంటున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహంకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురధేశ్వరి ఘన నివాళి అర్పించారు. మరణం లేని జననం ఎన్టీఆర్ జననం అని, జన్మ జన్మకి ఆయనకే కూతురిగా పుట్టాలని కోరుకుంటున్నాను అని పురధేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ గారు ఏ రంగంలో ఉన్నా.. ఆ రంగానికి ఆయన వన్నె తెచ్చారన్నారు. నేడు ఎన్టీఆర్ 29వ వర్ధంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబసభ్యులు నివాళులు అర్పిస్తున్నారు.
దగ్గుబాటి పురధేశ్వరి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ… ‘మరణం లేని జననం ఎన్టీఆర్ జననం. జన్మ జన్మకి ఆయనకే కూతురిగా పుట్టాలని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ గారు ఏ రంగంలో ఉన్నా.. ఆ రంగానికి ఆయన వన్నె తెచ్చారు. చలన చిత్రంలో కేవలం రంగులు వేసే వారీగా మాత్రమే గుర్తింపు వుండేది. ఎన్టీఆర్ గారు సినీ రంగంలోకి అడుగుపెట్టిన తరువాత సినీ చరిత్రకి కొత్త గుర్తింపు తెచ్చారు. రాజకీయాల్లో కూడా తన కంటూ కొత్త చరిత్ర రాశారు. మహిళల కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. పేదల కోసం రెండు రూపాయల కిలో బియ్యం, జనతా వస్త్రాలు, మాండలిక వ్యవస్థను తీసుకువచ్చారు. ఎన్టీఆర్ గారు ఆంధ్రులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు, ఆంధ్రుల ఆత్మ గౌరవం తీసుకువచ్చారు’ అని అన్నారు.
Also Read
- Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన 'బేబీ బాస్'.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
Also Read: Nara Lokesh: త్వరలోనే తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేస్తాం!
ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా విజయవాడ ఎన్టీఆర్ భవన్లో ఎంపీ కేశినేని చిన్ని నివాళులు అర్పించారు. ‘పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్. నారా లోకేష్ ఆధ్వర్యంలో కోటి సభ్యత్వంతో రికార్డు సృష్టించాం. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ కి కృషి చేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగడం లేదు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్యాకేజీ ప్రకటించడం ఆనందకరం’ అని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు.
తాజావార్తలు
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
-
Sankranthi 2027: మరోసారి చిరు వర్సెస్ బాలయ్య?.. సంక్రాంతి పోరుకు రంగం సిద్ధమా!
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
-
Cinema News: థియేటర్లలో ఫ్లాప్.. యూట్యూబ్లో చరిత్ర సృష్టించిన బెల్లంకొండ సినిమా!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!