Daggubati Purandeswari: ఎన్టీఆర్ది మరణం లేని జననం.. రాజకీయాల్లో కొత్త చరిత్ర రాశారు!
- ఎన్టీఆర్ 29వ వర్ధంతి
- ఎన్టీఆర్ సర్కిల్లో నివాళి అర్పించిన దగ్గుబాటి పురధేశ్వరి
- జన్మ జన్మకి ఆయనకే కూతురిగా పుట్టాలని కోరుకుంటున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహంకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురధేశ్వరి ఘన నివాళి అర్పించారు. మరణం లేని జననం ఎన్టీఆర్ జననం అని, జన్మ జన్మకి ఆయనకే కూతురిగా పుట్టాలని కోరుకుంటున్నాను అని పురధేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ గారు ఏ రంగంలో ఉన్నా.. ఆ రంగానికి ఆయన వన్నె తెచ్చారన్నారు. నేడు ఎన్టీఆర్ 29వ వర్ధంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబసభ్యులు నివాళులు అర్పిస్తున్నారు.
దగ్గుబాటి పురధేశ్వరి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ… ‘మరణం లేని జననం ఎన్టీఆర్ జననం. జన్మ జన్మకి ఆయనకే కూతురిగా పుట్టాలని కోరుకుంటున్నాను. ఎన్టీఆర్ గారు ఏ రంగంలో ఉన్నా.. ఆ రంగానికి ఆయన వన్నె తెచ్చారు. చలన చిత్రంలో కేవలం రంగులు వేసే వారీగా మాత్రమే గుర్తింపు వుండేది. ఎన్టీఆర్ గారు సినీ రంగంలోకి అడుగుపెట్టిన తరువాత సినీ చరిత్రకి కొత్త గుర్తింపు తెచ్చారు. రాజకీయాల్లో కూడా తన కంటూ కొత్త చరిత్ర రాశారు. మహిళల కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. పేదల కోసం రెండు రూపాయల కిలో బియ్యం, జనతా వస్త్రాలు, మాండలిక వ్యవస్థను తీసుకువచ్చారు. ఎన్టీఆర్ గారు ఆంధ్రులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు, ఆంధ్రుల ఆత్మ గౌరవం తీసుకువచ్చారు’ అని అన్నారు.
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
Also Read: Nara Lokesh: త్వరలోనే తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేస్తాం!
ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా విజయవాడ ఎన్టీఆర్ భవన్లో ఎంపీ కేశినేని చిన్ని నివాళులు అర్పించారు. ‘పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్. నారా లోకేష్ ఆధ్వర్యంలో కోటి సభ్యత్వంతో రికార్డు సృష్టించాం. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ కి కృషి చేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగడం లేదు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్యాకేజీ ప్రకటించడం ఆనందకరం’ అని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?