Nara Lokesh: త్వరలోనే తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేస్తాం!
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన నారా లోకేశ్
- ఎన్టీఆర్ కేవలం మూడు అక్షరాలు కాదు
- తెలంగాణలో కూడా పార్టీ కార్యకలాపాలు ప్రారంభిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో టీడీపీ పార్టీ పునర్నిర్మాణంపై చర్చిస్తున్నాం అని, త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం అని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తెలంగాణలో 1.60 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారని, టీడీపీపై తెలంగాణ ప్రజలకు ప్రేమ మరియు ఆశ ఉందన్నారు. తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేయడమే తమ లక్ష్యం అని లోకేశ్ చెప్పారు. నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి నారా లోకేశ్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సీఎంగా ఎన్టీఆర్ ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేశారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి నారా లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ… ‘ఎన్టీఆర్ కేవలం మూడు అక్షరాలు కాదు.. అదొక్క ప్రభంజనం. సినీ రంగంలో అన్ని రకాల సినిమాలు తీసి తన మార్క్ చూపించారు. రాజకీయాల్లో కూడా ఎన్నో సేవలు అందించారు. రెండు రూపాయలకే బియ్యం అందించారు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్. తెలుగు వారిని మద్రాసీలు అనేవారు.. వాళ్లందరికీ తెలుగు వరమని గర్వంగా చెప్పుకునేలా చేశారు. ఎన్టీఆర్ ఏ ఆశయాలతో పార్టీని పెట్టారో మాకు తెలుసు. ఆయన ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళతాం. ఏదైనా తప్పు జరిగితే.. దానిని సరిదిద్దడానికి కూడా పార్టీలో పెద్దలు ఉన్నారు’ అని చెప్పారు.
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
Also Read: Lakshmi Parvathi: సీఎం చంద్రబాబుపై లక్ష్మీ పార్వతి హాట్ కామెంట్స్!
‘మా చిన్న తనంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నారు. అప్పుడు ఆయన అబిడ్స్ లో ఉండేవారు. ఆ సమయంలో మమ్మల్ని గండిపేట తీసుకెళ్లేందుకు ఒక పెద్ద కారులో ఆయనే స్వయంగా డ్రైవ్ చేస్తూ తీసుకెళ్ళారు. దారి మధ్యలో లెఫ్టుకు వెళ్లాలో, రైటుకు వెళ్లాలో తెలియక రోడ్డు మధ్యలో గుద్దేశారు. అది మాకు ఎప్పుడు గుర్తుండి పోయే మెమరీ. తెలంగాణలో టీడీపీపై ప్రజలకు ఎంతో ప్రేమ ఉంది. అందుకు ఉదాహరణ.. స్వచ్చందంగా లక్షా 60 వేల సభ్యత్వాలు ప్రజలు తీసుకోవడం. ఇప్పుడు ఎలాంటి ఎమ్మెల్యేలు లేకుండా ఇంతమంది సభ్యత్వం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా పార్టీ కార్యకలాపాలు ప్రారంభిస్తాం. త్వరలోనే తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేస్తాం’ అని నారా లోకేశ్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!