PM Modi: సీఏఏపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.. ఎవరికీ భయపడం
ప్రతిపక్ష పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ప్రధాని మోడీ అన్నారు. ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా బీహార్లోని పూర్ణయాలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోడీ మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాల కోసం పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారు ఒక విషయం తెలుసుకోవాలని, సీఏఏ అమలు విషయంలో తాను ఎంతమాత్రం భయపడేది లేదని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మోడీ తేల్చిచెప్పారు. తమ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎన్నో చర్యలు చేపట్టిందని, ఆర్జేడీ అధికారంలో ఉన్నప్పుడు అవకతవకల పాలన సాగించిందని ధ్వజమెత్తారు. విపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాట్లను అనుమతిస్తున్నాయని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Ram Charan: రామ్ చరణ్ ధరించిన షర్ట్ రేటు అన్ని వేలా? వామ్మో!
Also Read
- Babar Azam: టీ20 క్రికెట్లో నయా హిస్టరీ.. కోహ్లీ, డుప్లెసిస్ను వెనక్కి నెట్టేసిన బాబర్ ఆజామ్..
- Instagram Star Murder: భర్త చేతితో ఇన్స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
- AC Health Risks: గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా..? ఈ వ్యాధులకు కారణం కావచ్చు..! ఏం చేయాలి..
- Top Selling CNG Cars: భారత్లో అత్యధికంగా సేల్ అయిన CNG కార్లు ఇవే..
సీమాంచల్ చాలా సున్నితమైన ప్రాంతమని… ఓట్ బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న వారు సీమాంజల్ పూర్ణియా ప్రాంతంలో అక్రమ చొరబాట్లకు అనుమతిస్తూ భద్రతతో రాజీపడుతున్నారని ఆరోపించారు. దేశ భద్రతను గందరగోళంలో పడేసే శక్తుల పట్ల తమ ప్రభుత్వం ఒక కన్నేసి ఉంచుతుందని మీకు భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. సీమాంచల్, పూర్ణియా అబివృద్ధికి కట్టుబడి తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. దేశంలోని 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేశామని, వారికోసం తమ ప్రభుత్వం రేయింబవళ్లు పనిచేస్తోందని తెలిపారు. సీమాంచల్ ఏరియాలో వందే భారత్, నమో భారత్ రైళ్ల ద్వారా డపలప్మెంటీ కనెక్టివిటీ కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఒక ట్రయిలర్ మాత్రమేనని, ఇప్పుడు సీమాచంల్, బీహార్, యావద్దేశాన్ని మరింత అభివృద్ధి దిశగా పరుగులు తీయిస్తామని మోడీ భరోసా ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Dharmapuri Arvind: దేశానికి మోడీ తప్ప ఏ గ్యారంటీ లేదు
కాగా పూర్ణియాలో లోక్సభ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ఇంతకుముందు ఈ సీటులో గెలిచిన పప్పూ యాదవ్ ఇక్కడ ఇండిపెండెంట్గా బరిలోకి దిగారు. ఇటీవలే ఆయన కాంగ్రెస్లో చేరారు. ఇక్కడ తమ అభ్యర్థిగా సంతోష్ కుమార్ను బీజేపీ నిలబెట్టగా, బీమా భారతిని ఆర్జేడీ నిలబెట్టింది. 40 లోక్సభ స్థానాలున్న బీహార్లో మొత్తం 7 దశల్లోనూ పోలింగ్ జరుగనుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో 40 సీట్లలో ఎన్డీయే 39 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 17 స్థానాల్లో, జేడీయూ 16 స్థానాల్లో గెలువగా, ఎల్జేపీ 6 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్కు ఒక సీటు దక్కింది.
ఇది కూడా చదవండి: KKR vs RR: రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.. సెంచరీతో చెలరేగిన నరైన్
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కాగా.. ఏప్రిల్ 26న సెకండ్ విడత, మే 7, 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య-కొరటాల శివ అనౌన్స్మెంట్ వచ్చేసింది.. మాస్ విద్వంసమే
-
Babar Azam: టీ20 క్రికెట్లో నయా హిస్టరీ.. కోహ్లీ, డుప్లెసిస్ను వెనక్కి నెట్టేసిన బాబర్ ఆజామ్..
-
Instagram Star Murder: భర్త చేతితో ఇన్స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
-
TGSRTC: రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసిన టికెట్ ఇన్ స్పెక్టర్.. చెప్పుతో దాడి చేసిన కండక్టర్, ప్రయాణికులు
-
Bhuvneshwar Kumar Record: దూసుకెళ్తున్న స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్.. జస్ప్రీత్ బుమ్రా రికార్డు బ్రేక్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!