West Bengal: బెంగాల్లో ఓటింగ్ ముగిసిన ఆగని హింస.. దాడుల పరంపర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగాల్లో ఓటింగ్ ముగిసిన తర్వాత కూడా హింస కొనసాగుతోంది. శనివారం రాత్రి నుంచి పలుచోట్ల బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడికి కారణం తృణమూల్ కాంగ్రెస్ (TMC) మద్దతుదారులేనని బీజేపీ ఆరోపిస్తుంది. కాగా.. వరుస దాడులతో భయాందోళనకు గురైన పలువురు బీజేపీ కార్యకర్తలు ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. మరి కొందరు పార్టీ కార్యాలయాల్లో తలదాచుకున్నారు.
Delhi: కౌంటింగ్ నేపథ్యంలో ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు
Also Read
ఓటమి భయంతోనే టీఎంసీ గూండాలు బీజేపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారని బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపించారు. మరోవైపు.. బెంగాల్ వ్యాప్తంగా బీజేపీ కౌంటింగ్ ఏజెంట్లను బెదిరించి అక్రమంగా అరెస్టు చేస్తున్నారని.. బీజేపీ ఐటీ సెల్ హెడ్, బెంగాల్ కో-ఇన్చార్జ్ అమిత్ మాల్వియా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఉత్తర 24 పరగణాల జిల్లా బసిర్హత్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని సందేశఖాలీలో శనివారం ఓటింగ్ సమయం నుండి గందరగోళ వాతావరణం ఉంది. పోలీసులకు, మహిళలకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మరోవైపు.. హింసాత్మక ఘటనల్లో ఆదివారం రాత్రి మరో ఏడుగురు బీజేపీ మద్దతుదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అరెస్టయిన బీజేపీ మద్దతుదారుల సంఖ్య 12కి చేరింది. బీజేపీ మద్దతుదారులు పోలీసులపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో వారిని అదుపులోకి తీసుకున్నారు.
India bloc: ఎన్నికల రిజల్ట్స్ తర్వాత ఇండియా కూటమి నేతలు సమావేశం..
కాగా.. నదియా జిల్లాలోని దేవ్గ్రామ్ ప్రాంతంలో శనివారం రాత్రి బీజేపీ కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన వెనుక రాష్ట్రంలోని అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ గూండాలు ఉన్నారని స్థానిక బీజేపీ నాయకత్వం ఆరోపిస్తోంది. మరోవైపు ఈ ఘటనతో తమకు సంబంధం లేదని తృణమూల్ కొట్టిపారేసింది. అదే సమయంలో.. నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని భట్పరాలోని ప్రియాంకు పాండే అనే బీజేపీ నేత ఇంటిపై శనివారం అర్థరాత్రి కొందరు వ్యక్తులు బాంబులతో దాడి చేశారు.
తాజావార్తలు
-
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
-
PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
-
Ram Charan: బుచ్చిబాబు వల్లే నా చేతికి గాయమైంది
-
CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!