Nitish Kumar: విపక్షాల కూటమి పేరుపై నితీశ్ కుమార్ అసంతృప్తి.. పేరు మార్చాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని ఓడించేడమే లక్ష్యంగా విపక్షాలు కూటమిగా ఏర్పాడ్డాయి. ఇందులో భాగంగా పట్నాలో తొలి భేటీ జరిగింది. తర్వాత బెంగళూరులో రెండోసారి సమావేశమయ్యారు. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, జేడీయూ, సహా 26 పార్టీల అధినేతలు, పార్టీ సీనియర్ నేతలు ఈ మీటింగ్ లో పాల్గొని పలు కీలకమైన అంశాలపై చర్చించారు. అయితే, విపక్ష కూటమికి ఇండియాగా పేరు పెట్టినట్లు సోమవారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. ఈ ఇండియా పేరును తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించినట్టు తెలుస్తోంది. దీనిపై నేతలలంతా లోతుగా చర్చించి, ఏకాభిప్రాయంతో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇండియా అనే పేరును బిహార్ సీఎం నితీశ్ కుమార్ గట్టిగా వ్యతిరేకించినట్లు సమాచారం. విపక్షాల కూటమి పేరు గురించి కాంగ్రెస్ ఏ విధంగానూ తనతో చర్చించలేదని అతడు చెప్పుకొచ్చినట్లు తెలిపారు.
Read Also: MP Komatireddy: కోమటిరెడ్డి నివాసంలో కాంగ్రెస్ సీనియర్ల సమావేశం.. పార్టీ చేరికలపై చర్చ
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ఈ ఇండియా అనే పేరులో ఎన్డీయే అక్షరాలు ఉండటంపై నితీశ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కూటమికి ఆ పేరు ఎలా పెడ్తారని భేటీలోనే ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నితీశ్ తోపాటు వామపక్ష నేతలు కూడా ఇండియా పేరుపై అభ్యంతరం చేస్తూ మరో పేరును సూచించినట్లు టాక్. కానీ మెజార్టీ పార్టీలు ఆమోదించడంతో నితీశ్ కుమార్ సైతం చివరికి ఒప్పుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తేవడంలో నితీశ్ కుమార్ పాత్ర ఎంతో కీలకమైనది. విపక్షాల తర్వాతి భేటీ మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరుగనుంది. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం ఈ మీటింగ్ ను ఏర్పాటు చేస్తుంది. ఈ సమావేశంలోనే ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే అశం, సీట్ల సర్ధుబాటుపైనా ఆరోజే చర్చించే అవకాశం ఉందని నేతలు చెప్పారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో కలిసి కట్టుగా పోరాడి విజయం సాధిస్తామని విపక్ష కూటమి ధీమా వ్యక్తం చేసింది.
Read Also: Minister Roja: సినిమాలో హీరో పాలిటిక్స్లో జీరో.. పవన్పై రోజా కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?