Nitin Gadkari: ఇకపై టూవీలర్తో పాటు రెండు హెల్మెట్లు.. కంపెనీలకు కీలక సూచన
- ఇకపై టూవీలర్తో పాటు రెండు హెల్మెట్లు
- కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కంపెనీలకు కీలక సూచన
- హెల్మెట్లు ISI సర్టిఫికేట్ కలిగి ఉండాలని తెలిపారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భద్రతలో భాగమైన హెల్మెట్ ప్రతిఒక్కరు ధరించాల్సిందే. అయితే చాలామంది టూవీలర్ అయితే కొంటున్నారు. కానీ, హెల్మెట్ కొనేందుకు మాత్రం ఆలోచిస్తుంటారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కంపెనీలకు కీలక సూచన చేశాడు. దేశంలోని టూవీలర్ తయారీ సంస్థలు ఇక నుంచి తమ వాహనాలతో పాటు రెండు హెల్మెట్లను అందించడం తప్పనిసరి అని కేంద్ర రోడ్డు రవాణా అండ్ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. వాహనాన్ని కొనుగోలు చేసేటపుడు రెండు హెల్మెట్స్ ను అందించాలని సూచించారు. ఈ హెల్మెట్లు ISI సర్టిఫికేట్ కలిగి ఉండాలని తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఆటో సమ్మిట్ సందర్భంగా కేంద్ర మంత్రి ఈ మేరకు ప్రకటన చేశారు.
Also Read:MI vs KKR: సొంత ఇలాకాలోనైనా ముంబై ఇండియన్స్ విజయం సాధిస్తారా?
Also Read
- Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
- Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
- Akhil Raj: "డెలివరీ బాయ్ని కొట్టారు.. ఉమ్మేశారు".. రాజు వెడ్స్ రాంభాయ్ హీరోపై చర్యలు తీసుకోవాల్సిందే!
నితిన్ గడ్కరీ చేసిన ఈ ప్రకటనను టూ వీలర్ హెల్మెట్ తయారీదారుల సంఘం స్వాగతించింది. ఇది కేవలం ఒక నియమం కాదని, దేశ అవసరం అని టీహెచ్ఎంఏ అధ్యక్షుడు రాజీవ్ కపూర్ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ నిర్ణయం ఆశాకిరణం అని అన్నారు. నాణ్యమైన ISI హెల్మెట్ల ఉత్పత్తిని పెంచుతామని, దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంచుతామని హెల్మెట్ తయారీదారుల సంఘం హామీ ఇచ్చింది.
Also Read:Malaika Arora : స్టేడియంలో క్రికెటర్ తో మలైకా అరోరా.. డేటింగ్ లో ఉన్నారా..?
భారతదేశంలో ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నివేదికల ప్రకారం.. దేశంలో ప్రతి సంవత్సరం 4.80 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో 1.88 లక్షల మంది మరణిస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాల ప్రమాదాల్లో ఏటా 69 వేల మంది మరణిస్తున్నారు. ఇందులో 50 శాతం మరణాలు హెల్మెట్ ధరించకపోవడం వల్లే సంభవిస్తున్నాయి. ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించకపోతే, ప్రమాదంలో తలకు గాయం అయ్యే ప్రమాదం పెరుగుతుంది. హెల్మెట్ ధరించడం వల్ల తలకు రక్షణ కల్పించడమే కాకుండా, బలమైన గాలి, దుమ్ము నుంచి కళ్ళను రక్షించడంలో కూడా సహాయపడుతుంది.
తాజావార్తలు
-
mAadhaar app: ఎమ్-ఆధార్ యాప్కు గుడ్బై.. నేటి నుంచి పాత యాప్ సేవలు నిలిపివేత.. కొత్త Aadhaar యాప్లో అదిరే ఫీచర్లు
-
Health Tips: టూత్ బ్రష్ ను బాత్రూమ్ లోనే పెడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది
-
Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
-
Ramayana : లాస్ ఏంజెల్స్లో ‘రామాయణ’ ట్రైలర్ లాంచ్
-
Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!