భద్రతలో భాగమైన హెల్మెట్ ప్రతిఒక్కరు ధరించాల్సిందే. అయితే చాలామంది టూవీలర్ అయితే కొంటున్నారు. కానీ, హెల్మెట్ కొనేందుకు మాత్రం ఆలోచిస్తుంటారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కంపెనీలకు కీలక సూచన చేశాడు. దేశంలోని టూవీలర్ తయారీ సంస్థలు ఇక నుంచి తమ వాహనాలతో పాటు రెండు హెల్మెట్లను అందించడం తప్పనిసరి అని కేంద్ర రోడ్డు రవాణా అండ్ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. వాహనాన్ని కొనుగోలు చేసేటపుడు రెండు హెల్మెట్స్ ను అందించాలని సూచించారు.…