Heavy Floods: ముంచెత్తిన వరదలు.. 600 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Floods: ఆఫ్రికా దేశమైన నైజీరియాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొద్దీ రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహించడం వల్ల పలు పట్టణాలు, గ్రామాలు వరదల్లో మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో వివిధ ప్రమాదాల్లో దాదాపు 600 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వ సాయం కోసం లక్షల మంది ఎదురుచూస్తున్నారు. నైజీరియా చరిత్రలోనే ఇదే అతిపెద్ద విపత్తు అని అక్కడి అధికారులు తెలిపారు. దాదాపు 10 ఏళ్ల క్రితం సంభవించిన వరదల్లో 360 మంది ప్రాణాలు కోల్పోగా.. 2లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు.
CM KCR Suffering From Fever: సీఎం కేసీఆర్కు జ్వరం.. మరో నాలుగు రోజులు ఢిల్లీలోనే..!
Also Read
నైజీరియాలో వరదలు సృష్టించిన బీభత్సం కారణంగా 13లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దాదాపు 2లక్షల నివాసాలు దెబ్బతిన్నాయి. దాదాపు 2.72 లక్షల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. సహాయక బృందాలు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా వరదలు ముంచెత్తుతున్నా అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో మృతుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. నైజీరియాలో ప్రతీ ఏటా వరదలు సంభవించినప్పటికీ.. ఈసారి మాత్రం భారీ విపత్తు సంభవించింది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!