Delhi: ఢిల్లీ తొక్కిసలాట ఘటన.. పోస్ట్మార్టం నివేదికలో సంచలన విషయాలు
- న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మృతి
- మృతులలో 11 మంది మహిళలు, ఐదుగురు చిన్నారులు
- తొక్కిసలాటలో మరణించిన ఐదుగురి పోస్ట్మార్టం నివేదికలు
- ఈ ఐదుగురు "ట్రామాటిక్ అస్ఫిక్సియా" కారణంగా మరణించారని నివేదికలో వెల్లడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులలో 11 మంది మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. మహా కుంభమేళాకు వెళ్లే రెండు రైళ్లు ఆలస్యంగా వచ్చాయని, దీని కారణంగా స్టేషన్ వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారని చెప్పారు. ఈ వ్యక్తులు తమ రైలు కోసం వేచి ఉన్నారు. ఇంతలో, అకస్మాత్తుగా ప్లాట్ఫారమ్ మార్పు ప్రకటన కారణంగా, ప్రజలు ఒక ప్లాట్ఫారమ్ నుండి మరొక ప్లాట్ఫారమ్కు పరిగెత్తడం ప్రారంభించారు.. దీంతో తొక్కిసలాట జరిగింది.
Read Also: మధ్యాహ్నం పూట నిద్రపోవడం మంచిదే.. కానీ..
Also Read
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
- Tollywood : అటు నందమూరి.. ఇటు మెగా.. ముహూర్తం పెట్టేసారు
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
కాగా.. తొక్కిసలాటలో మరణించిన ఐదుగురి పోస్ట్మార్టం నివేదికలు వెలువడ్డాయి. నివేదిక ప్రకారం.. ఈ ఐదుగురు “ట్రామాటిక్ అస్ఫిక్సియా” కారణంగా మరణించారని తేలింది. ఇది ఛాతీ లేదా పొత్తికడుపు పైభాగంపై అధిక ఒత్తిడి వల్ల ఆక్సిజన్ లేదా రక్త సరఫరా కోల్పోవడాన్ని సూచిస్తుంది. వార్తా సంస్థ ANI ప్రకారం.. చాలా మందికి ఛాతీ, ఉదరంపై గాయాలు ఉన్నాయి. వారు ఊపిరాడక చనిపోయి ఉండవచ్చు అని ఆర్ఎమ్ఎల్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆర్ఎమ్ఎల్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్ శుక్లా తెలిపిన వివరాల ప్రకారం.. “మేము ఐదు మృతదేహాలను కనుగొన్నాము. అందులో 25 సంవత్సరాల వయస్సు గల పురుషుడు, నలుగురు మహిళలు ఉన్నారు. 30, 70 సంవత్సరాల మధ్య వయస్సు కల మహిళలు ఉన్నారు.” అని పేర్కొన్నారు. నాలుగు మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించామని చెప్పారు.
Read Also: Warangal: ఇంటర్ విద్యార్థినితో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన.. కుటుంబీకుల ఆందోళన
ఈ సంఘటనపై ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ విచారణకు ఆదేశించారు. “సంఘటన సమయంలో పాట్నాకు వెళ్లే మగధ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 14పై, జమ్మూకు వెళ్లే ఉత్తర సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 15పై ఉన్నాయి” అని ఆయన తెలిపారు. కొంతమంది ప్రయాణికులు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నుండి ప్లాట్ఫారమ్కి వెళ్లే మెట్లపై జారిపడ్డారు. దాంతో ఈ తొక్కిసలాట జరిగిందని చెప్పారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట నన్ను తీవ్రంగా బాధించింది. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారందరికీ సంతాపం వ్యక్తం చేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.” అని తెలిపారు.
తాజావార్తలు
-
Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
-
RCB Physiotherapist: ఆర్సీబీ ఫిజియోథెరపిస్ట్ స్టోరీ అంతా డూపే.. హేజిల్వుడ్, లివింగ్స్టోన్ ఏం చేయలేదు!
-
Sara Ali Khan: తల్లిదండ్రుల విడాకుల ప్రభావం.. పెళ్లిపై సారా సంచలన వ్యాఖ్యలు
-
Ram pothineni : Rapo 23 కోసం రూత్ లెస్ విలన్
-
Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!