Delhi: ఢిల్లీ తొక్కిసలాట ఘటన.. పోస్ట్మార్టం నివేదికలో సంచలన విషయాలు
- న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మృతి
- మృతులలో 11 మంది మహిళలు, ఐదుగురు చిన్నారులు
- తొక్కిసలాటలో మరణించిన ఐదుగురి పోస్ట్మార్టం నివేదికలు
- ఈ ఐదుగురు "ట్రామాటిక్ అస్ఫిక్సియా" కారణంగా మరణించారని నివేదికలో వెల్లడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులలో 11 మంది మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. మహా కుంభమేళాకు వెళ్లే రెండు రైళ్లు ఆలస్యంగా వచ్చాయని, దీని కారణంగా స్టేషన్ వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారని చెప్పారు. ఈ వ్యక్తులు తమ రైలు కోసం వేచి ఉన్నారు. ఇంతలో, అకస్మాత్తుగా ప్లాట్ఫారమ్ మార్పు ప్రకటన కారణంగా, ప్రజలు ఒక ప్లాట్ఫారమ్ నుండి మరొక ప్లాట్ఫారమ్కు పరిగెత్తడం ప్రారంభించారు.. దీంతో తొక్కిసలాట జరిగింది.
Read Also: మధ్యాహ్నం పూట నిద్రపోవడం మంచిదే.. కానీ..
Also Read
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
- Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
కాగా.. తొక్కిసలాటలో మరణించిన ఐదుగురి పోస్ట్మార్టం నివేదికలు వెలువడ్డాయి. నివేదిక ప్రకారం.. ఈ ఐదుగురు “ట్రామాటిక్ అస్ఫిక్సియా” కారణంగా మరణించారని తేలింది. ఇది ఛాతీ లేదా పొత్తికడుపు పైభాగంపై అధిక ఒత్తిడి వల్ల ఆక్సిజన్ లేదా రక్త సరఫరా కోల్పోవడాన్ని సూచిస్తుంది. వార్తా సంస్థ ANI ప్రకారం.. చాలా మందికి ఛాతీ, ఉదరంపై గాయాలు ఉన్నాయి. వారు ఊపిరాడక చనిపోయి ఉండవచ్చు అని ఆర్ఎమ్ఎల్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆర్ఎమ్ఎల్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్ శుక్లా తెలిపిన వివరాల ప్రకారం.. “మేము ఐదు మృతదేహాలను కనుగొన్నాము. అందులో 25 సంవత్సరాల వయస్సు గల పురుషుడు, నలుగురు మహిళలు ఉన్నారు. 30, 70 సంవత్సరాల మధ్య వయస్సు కల మహిళలు ఉన్నారు.” అని పేర్కొన్నారు. నాలుగు మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించామని చెప్పారు.
Read Also: Warangal: ఇంటర్ విద్యార్థినితో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన.. కుటుంబీకుల ఆందోళన
ఈ సంఘటనపై ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ విచారణకు ఆదేశించారు. “సంఘటన సమయంలో పాట్నాకు వెళ్లే మగధ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 14పై, జమ్మూకు వెళ్లే ఉత్తర సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 15పై ఉన్నాయి” అని ఆయన తెలిపారు. కొంతమంది ప్రయాణికులు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నుండి ప్లాట్ఫారమ్కి వెళ్లే మెట్లపై జారిపడ్డారు. దాంతో ఈ తొక్కిసలాట జరిగిందని చెప్పారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట నన్ను తీవ్రంగా బాధించింది. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారందరికీ సంతాపం వ్యక్తం చేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.” అని తెలిపారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!