Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story New Delhi Stampede Postmortem Report Reveals Cause Of Death

Delhi: ఢిల్లీ తొక్కిసలాట ఘటన.. పోస్ట్‌మార్టం నివేదికలో సంచలన విషయాలు

Published Date :February 16, 2025 , 5:39 pm
By Rajesh Veeramalla
  • న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మృతి
  • మృతులలో 11 మంది మహిళలు, ఐదుగురు చిన్నారులు
  • తొక్కిసలాటలో మరణించిన ఐదుగురి పోస్ట్‌మార్టం నివేదికలు
  • ఈ ఐదుగురు "ట్రామాటిక్ అస్ఫిక్సియా" కారణంగా మరణించారని నివేదికలో వెల్లడి.
Delhi: ఢిల్లీ తొక్కిసలాట ఘటన.. పోస్ట్‌మార్టం నివేదికలో సంచలన విషయాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులలో 11 మంది మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. మహా కుంభమేళాకు వెళ్లే రెండు రైళ్లు ఆలస్యంగా వచ్చాయని, దీని కారణంగా స్టేషన్ వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారని చెప్పారు. ఈ వ్యక్తులు తమ రైలు కోసం వేచి ఉన్నారు. ఇంతలో, అకస్మాత్తుగా ప్లాట్‌ఫారమ్ మార్పు ప్రకటన కారణంగా, ప్రజలు ఒక ప్లాట్‌ఫారమ్ నుండి మరొక ప్లాట్‌ఫారమ్‌కు పరిగెత్తడం ప్రారంభించారు.. దీంతో తొక్కిసలాట జరిగింది.

Read Also: మధ్యాహ్నం పూట నిద్రపోవడం మంచిదే.. కానీ..

Also Read

  • UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..
  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!
  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
  • Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!

కాగా.. తొక్కిసలాటలో మరణించిన ఐదుగురి పోస్ట్‌మార్టం నివేదికలు వెలువడ్డాయి. నివేదిక ప్రకారం.. ఈ ఐదుగురు “ట్రామాటిక్ అస్ఫిక్సియా” కారణంగా మరణించారని తేలింది. ఇది ఛాతీ లేదా పొత్తికడుపు పైభాగంపై అధిక ఒత్తిడి వల్ల ఆక్సిజన్ లేదా రక్త సరఫరా కోల్పోవడాన్ని సూచిస్తుంది. వార్తా సంస్థ ANI ప్రకారం.. చాలా మందికి ఛాతీ, ఉదరంపై గాయాలు ఉన్నాయి. వారు ఊపిరాడక చనిపోయి ఉండవచ్చు అని ఆర్‌ఎమ్‌ఎల్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆర్‌ఎమ్‌ఎల్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్ శుక్లా తెలిపిన వివరాల ప్రకారం.. “మేము ఐదు మృతదేహాలను కనుగొన్నాము. అందులో 25 సంవత్సరాల వయస్సు గల పురుషుడు, నలుగురు మహిళలు ఉన్నారు. 30, 70 సంవత్సరాల మధ్య వయస్సు కల మహిళలు ఉన్నారు.” అని పేర్కొన్నారు. నాలుగు మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించామని చెప్పారు.

Read Also: Warangal: ఇంటర్ విద్యార్థినితో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన.. కుటుంబీకుల ఆందోళన

ఈ సంఘటనపై ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ విచారణకు ఆదేశించారు. “సంఘటన సమయంలో పాట్నాకు వెళ్లే మగధ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్ 14పై, జమ్మూకు వెళ్లే ఉత్తర సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫామ్ 15పై ఉన్నాయి” అని ఆయన తెలిపారు. కొంతమంది ప్రయాణికులు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నుండి ప్లాట్‌ఫారమ్‌కి వెళ్లే మెట్లపై జారిపడ్డారు. దాంతో ఈ తొక్కిసలాట జరిగిందని చెప్పారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట నన్ను తీవ్రంగా బాధించింది. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారందరికీ సంతాపం వ్యక్తం చేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.” అని తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Delhi railway incident
  • New Delhi stampede
  • postmortem Report
  • Stampede deaths
  • telugu news

తాజావార్తలు

  • UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్

  • The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?

  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions