Nandi Drama Festivals: నంది నాటకోత్సవాలు ప్రారంభం.. అనర్హులకు నంది అవార్డులు రావు: పోసాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandi Drama Festivals: గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నంది నాటకోత్సవాల వేడుకలు ప్రారంభమయ్యాయి. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి 1200 మంది నాటక రంగ కళాకారులు హాజరయ్యారు. ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే నాటక రంగం మళ్ళీ పునర్జీవం పోసుకుంటుందని, నాటకాలు ఆడుకునేందుకు ఓపెన్ ఆడిటోరియాలు నిర్మించాలని కళా పరిషత్ నిర్వాహకులు కోరుతున్నారు. మరో వైపు అత్యంత పారదర్శకంగా ఈ పోటీలు నిర్వహించేందుకు, అవార్డులు ప్రకటించేందుకు విస్తృత ఏర్పాటు చేసింది ప్రభుత్వం. నాటక పోటీలకు వచ్చే కళాకారులకు విస్తృత సౌకర్యాలు కల్పించింది. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నంది నాటకొత్సవ ప్రారంభ వేడుకలకు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, శాసనమండలి విప్ అప్పిరెడ్డి, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి తదితరులు హాజరయ్యారు.
Read Also: Janasena: అభ్యర్థుల ఎంపికపై జనసేన కసరత్తు.. నియోజకవర్గాల వారీగా పవన్ సమీక్షలు
Also Read
- IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
- Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
- Rythu Shankaravam: 'రైతు శంఖారావం'కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
అత్యంత పారదర్శకతతో నంది నాటక పోటీలు: పోసాని కృష్ణమురళి
ఈ ప్రభుత్వాన్ని కళాకారులు నమ్మాలని, ఒకరికి కూడా అనర్హులకు నంది అవార్డులు రావు అని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి తెలిపారు. అత్యంత పారదర్శకతతో నంది నాటక పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. కళాకారుల సాధక బాధకాలు తెలిసిన 27 మంది జడ్జిలను పెట్టామని ఆయన వెల్లడించారు. వాళ్ల తీర్పులో ఎలాంటి పొరపాటుకు తావు ఉండదన్నారు. రాజకీయాలు ఉండవు, రికమండేషన్లు ఉండవన్నారు. అవార్డులు తీసుకున్న వారు అనర్హులు అని తేలితే తెలుగు రాష్ట్రాలనుండి వెళ్లిపోతానని పోసాని అన్నారు.
Also Read: Congress Manifesto: 2024 ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా పి. చిదంబరం
గాంధీజీని చూసి ప్రేరణ పొందిన నాయకుడు జగన్
నాటక రంగం ఒక అద్భుతమని, మహాత్మా గాంధీకి ప్రేరణ కలిగించింది కూడా నాటక రంగమేనని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ పేర్కొన్నారు. సత్యహరిచంద్ర నాటకం చూసే సత్యమేవ జయతే అనే నినాదాన్ని గాంధీ అనుసరించారన్నారు. అదే గాంధీజీని , అదే సత్య హరిచంద్ర నాటకాన్ని చూసి ప్రేరణ పొందిన నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ మంత్రి తెలిపారు. పేదరికం అనే తరతరాల రోగాన్ని తగ్గించే ఔషదాన్ని కనిపెట్టిన సీఎం జగన్ మోహన్ రెడ్డి అంటూ కొనియాడారు. నాటక రంగాన్ని సజీవంగా ఉంచాలన్న ధ్యేయంతో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు. నంది అవార్డులు ఇవ్వడం ద్వారా కళాకారుల పట్ల, కళాకారుల జీవన ప్రమాణాలు పట్ల ప్రభుత్వానికి ఉన్న భావం తెలుస్తుందన్నారు.
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మాట్లాడుతూ.. “2014కు ముందు చంద్రబాబు రైతులకు రుణమాఫీ చేస్తానని అబద్ధాలు చెప్పారు.. ఆరోజు ఉన్న పరిస్థితుల్లో ఆ పని చేయలేము అని జగన్ భావించారు. అసత్యంతో అధికారం అవసరం లేదు అని చెప్పిన గొప్ప నేత జగన్. జగన్ నిజం లాగా ఉంటారు. నిజానికి ఓటు వేయండి. అబద్ధం అనే ఆరు తలలు కలిగిన నేత చంద్రబాబు.. నిత్యం నిజాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నంది నాటకాలు ఉన్న గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేయడం విశేషం. చరిత్ర ఒక ప్రేరణ కావాలి , చరిత్రకారుడు ఒక మార్గదర్శక కావాలి…బలహీన వర్గాలు మిగిలిన సమాజాలు బలహీనులుగా కనిపిస్తున్నారు. కానీ బీసీలను సమాజానికి వెన్నెముకగా భావించిన నాయకుడు జగన్. మన జీవితంలో బీసీ వర్గాలు లేకుండా ఏ పని జరగదు. సమాజాన్ని ప్రేరేపించే నాటకాలు ఈ నంది అవార్డుల ప్రదర్శనలో ఉంచారు.” అని మంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Raaz Actress: అప్పుడు దెయ్యంగా భయపెట్టిన నటి.. ఇప్పుడు ఫామ్స్టే నడుపుతూ ప్రశాంత జీవితం..
-
India Missile Test: సాహో భారత్.. శత్రు దేశాలకు వార్నింగ్ సిగ్నల్! అడ్వాన్స్డ్ అగ్ని సిరీస్లో కీలక టెస్ట్..
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
-
Bigg Boss 10 Telugu: బోల్డ్ పర్సనాలిటీ.. భారీ ఫాలోయింగ్.. హౌస్లోకి ఈమె ఎంట్రీ ఇస్తే కుర్రాళ్లు చూపు తిప్పుకోలేరు!
ట్రెండింగ్
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!