Naima Khatoon: వందేళ్లలో అలీఘర్ వర్సిటీకి మొదటి మహిళా వైస్ ఛాన్సలర్.. ఎవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naima Khatoon: అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ (AMU) వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ నైమా ఖాతూన్ నియమితులయ్యారు. వర్సిటీ 100 ఏండ్ల చరిత్రలో ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె ఘనత సాధించారు. ఆమె నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో ఏఎంయూ మహిళా వైస్-ఛాన్సలర్ను కలిగి ఉన్న మూడవ కేంద్రీయ విశ్వవిద్యాలయంగా కూడా అవతరించింది. శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి ప్రస్తుత వీసీగా ఉండగా, నజ్మా అక్తర్ జామియా మిలియా ఇస్లామియా వైస్-ఛాన్సలర్గా తన పదవీకాలాన్ని 2023లో పూర్తి చేశారు. వర్సిటీ 123 ఏళ్ల చరిత్రలో ఈ పదవికి నియమితులైన తొలి మహిళ నైమా ఖాతూన్. బేగం సుల్తాన్ జహాన్ 1920లో ఏఎంయూకి ఛాన్సలర్ అయ్యారు. ఆ పదవిలో ఉన్న మొదటి, ఏకైక మహిళగా ఆమె నిలిచింది. ఆమె, 5 ఏండ్లపాటు వర్సిటీ వీసీగా కొనసాగనున్నారు. 1875లో ఏర్పాటైన ముహమ్మదన్ ఆంగ్లో ఓరియెంటల్ కాలేజీ ..1920లో ‘అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ’గా మారింది.
Read Also: Supreme Court: క్షమాపణ మీ ప్రకటనల పరిమాణంలో ఉందా?.. రామ్దేవ్ బృందానికి సుప్రీంకోర్టు చురకలు
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
నైమా ఖాతూన్ ఆగస్ట్ 1988లో ఏఎంయూలో లెక్చరర్గా తన వృత్తిపరమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె క్రమంగా ర్యాంకులతో ఎదుగుతూ, ఏప్రిల్ 1998లో అసోసియేట్ ప్రొఫెసర్గా, చివరికి జూలై 2006లో ప్రొఫెసర్గా మారింది. జూలై 2014లో మహిళా కళాశాలలో ప్రిన్సిపాల్గా నియమితులయ్యే ముందు సైకాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్, ఛైర్పర్సన్గా పనిచేశారు. ఆమె నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ రువాండా, సెంట్రల్ ఆఫ్రికాలో ఒక విద్యా సంవత్సరం పాటు బోధించారు. ఆమె ఏఎంయూలో వివిధ అడ్మినిస్ట్రేటివ్ పాత్రలలో కూడా పనిచేశారు. నైమా ఖాతూన్ పొలిటికల్ సైకాలజీలో పీహెచ్డీ డిగ్రీని కలిగి ఉన్నారు. ఆమె సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, ఢిల్లీ, ఏఎంయూలో డాక్టరల్ వర్క్ నిర్వహించారు. యూనివర్శిటీ ఆఫ్ లూయిస్విల్లే (USA), యూనివర్శిటీ ఆఫ్ ఆల్బా యూలియా (రొమేనియా), చులాలాంగ్కార్న్ విశ్వవిద్యాలయం (బ్యాంకాక్) మరియు ఇస్తాంబుల్ (టర్కీ), బోస్టన్ (USA) రెండింటిలోని హోలింగ్స్ సెంటర్లో ఆమె తన పరిశోధన ఫలితాలను సమర్పించారు.నైమా ఖాతూన్ రచయిత, పరిశోధకురాలు. ఆరు పుస్తకాలను రచించారు. అనేక జాతీయ, అంతర్జాతీయ జర్నల్లలో వివిధ పత్రాలను ప్రచురించారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!