Naga Vamshi : మూడు గంటల వినోదం కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టలేరా.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Vamshi : ఇండస్ట్రీలో సినిమా టికెట్ రేట్ల మీద నిరంతరం చర్చలు జరుగుతూనే ఉంటాయి. అధిక ధరల కారణంగా సామాన్యుడికి సినీ వినోదం దూరం అవుతోందనే వాదన వినిపిస్తూనే ఉంటుంది. మరోపక్క ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది కాబట్టి, నిర్మాతలు బతకాలంటే దానికి తగ్గట్లు రేట్లు ఉండాలని మరో వాదన కూడా ఉంది. అందుకే పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే, వారం పది రోజుల పాటు రేట్లు పెంచుకునేలా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటారు నిర్మాతలు. కానీ ఈ అధిక రేట్ల కారణంగా ఇటీవల జనాలు థియేటర్లలోకి రావడం తగ్గిపోయారన్న అభిప్రాయాలున్నాయి. ప్రస్తుతం నిర్మాత నాగవంశీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆయన ఇప్పుడు థియేటర్లలో టికెట్ రేట్లు ఎక్కువేమీ లేవని అన్నారు. మూడు గంటల వినోదం కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టలేరా అని జనాలను ప్రశ్నించారు. 1500 రూపాయలు ఖర్చు పెడితే నలుగురు సినిమా చూసి ఎంజాయ్ చేయచ్చని సూచించారు.
Read Also:CM Revanth Reddy: నేడు రంగారెడ్డిలో సీఎం పర్యటన.. ఫాక్స్కాన్ పనుల పురోగతిపై సమీక్ష
Also Read
- Pakistan-Taliban Tensions: పాకిస్తాన్కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఒక ఫ్యామిలీలో నలుగురు కలిసి సినిమాకు వెళ్తే, సింగిల్ స్క్రీన్ లో ఒక టికెట్ కి రూ.250 లెక్కన రూ. 1000 అవుతుంది. పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ కి రూ. 500 అనుకున్నా 1500 అవుతుంది. 1500 రూపాయలకు మూడు గంటల ఎంటర్టైన్మెంట్ మీకు ఎక్కడ దొరుకుతుంది?. ఆంధ్రా, తెలంగాణ, యూఎస్ లలో అదే పదిహేను వందలకు అన్ని గంటలు ఎంటర్టైన్ చేసే ప్లేస్ ఏముందో చెప్పండని జనాలకే ప్రశ్న వేశారు. షాపింగ్ మాల్స్ కి వెళ్తే ఇంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. మిమ్మల్ని మూడు గంటలు కూర్చోబెట్టి ఎంటర్టైన్ చేసి 1500 తీసుకుంటే తప్పేంటి?. ఇవాళ్టికీ చీప్ గా దొరికే ఎంటర్టైన్మెంట్ సినిమా మాత్రమేని నాగవంశీ చెప్పారు.
Read Also:Karimnagar Manasa Devi Temple: తెలుగు రాష్ట్రాల్లో ఏకైక స్వయంభు ఆలయం..
ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిందనే ఎక్కువ రేట్లు అడుగుతున్నాం. సినిమా మీద అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తున్నాం కాబట్టే ప్రభుత్వం నుంచి రేట్లు పెంచుకుంటామని పర్మీషన్ తెచ్చుకుంటున్నామన్నారు. దాని వల్ల జనాలకేమీ అన్యాయం చేయడం లేదు. నేను టికెట్ రేట్ 1000 పెడితే తప్పు. కానీ నేను ‘దేవర’ సినిమాకు పెట్టింది రూ.250లు మాత్రమే అన్నారు. ఫ్యామిలీకి వెయ్యి రూపాయలు మాత్రమే కదా అవుతుంది. నెలకు మహా అయితే రెండు సినిమాలు చూస్తారు.. ఎవరూ 20 సినిమాలు చూడటం లేదు కదా అని నాగవంశీ అన్నారు. అలాగే ఓటీటీలోకి నాలుగు వారాలకు సినిమా వస్తే తప్పేంటని ప్రశ్నించారు. వాళ్లు మేము అడినంత డబ్బులు ఇస్తున్నారు కాబట్టే రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. అయినా సినిమాలకు నాలుగు వారాలు తక్కువ సమయమేమీ కాదు అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Pakistan-Taliban Tensions: పాకిస్తాన్కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
-
CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్కు బెయిల్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!