Nagababu: వారాహి యాత్రకు ముందు పవన్పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ప్రజల ఆకాంక్ష అదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagababu: వారాహి యాత్రకు ముందు జనసేన ప్రధాన కార్యదర్యి నాగబాబు ఆసక్తికర కామెంట్లు చేశారు.. పవన్ సీఎం కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని నాగబాబు తాను విడుదల చేసిన ప్రెస్నోట్లో పేర్కొన్నారు.. సంఖ్యా బలాన్ని బట్టే సీఎం పదవి అంటూ ఇటీవలే పవన్ కల్యాణ్ స్పష్టం చేయగా.. నాగబాబు సీఎం పదవి ప్రస్తావనపై ఆసక్తికర చర్చ సాగుతోంది.. రాజకీయ విప్లవ శంఖారావం వారాహిగా అభివర్ణించిన ఆయన.. జనసేన జెండా పట్టి వారాహి వెంట నడుద్దాం.. చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములవుదాం అని పిలుపునిచ్చారు.. ఏపీలో ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే జనసేన పాలన రావాల్సిందే అన్నారు.. పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తిగానే వేలాది మందికి ఆపన్న హస్తం అందిస్తున్నారు. పవన్కు ఏపీ సీఎం అనే శక్తిని అందిస్తే ఇంకెంతో ఉపయోగకరమైన సేవలు అందిస్తారనే భావన ప్రజల్లో బలంగా నాటుకుందని పేర్కొన్నారు.
Read Also: Viral News: రోడ్డును ఎత్తేస్తున్న గ్రామస్తులు.. ఇదేం విడ్డూరం కాంట్రాక్టరు!
Also Read
- Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
- Naga Babu: ఒక పెద్ద చెట్టు కొట్టేస్తే.. పది మొక్కలు నాటాలి!
- Mithali Raj: 'నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు'.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
- Mithali Raj: 'సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..' పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
ప్రజాధనం ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా, అప్పులను అదుపు చేసి, అభివృద్ధి బాటలు వేయగల సమర్థత గల నాయకుడు పవన్ అన్నారు నాగబాబు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పు కోసం శంఖారావం మోగించడానికి బయలు దేరుతోంది వారాహి అన్నారు.. వారాహి యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతోంది. జన సైనికులు, వీర మహిళలు, నాయకులు, జనసేన శ్రేణులు సమిష్టిగా, సమాలోచనలతో వారాహి యాత్రను విజయవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో నెలకొన్న దుర్భరమైన పరిస్థితులకు సంబంధించి ప్రజల్లో ఆలోచనాత్మకమైన చైతన్యం పెరుగుతోంది. ప్రజలంతా కలిసి మెలిసి జీవించే వాతావరణాన్ని సృష్టించడమే వారాహి యాత్ర ప్రధాన ధ్యేయం అన్నారు.. పవన్ కల్యాణ్కు మద్దతుగా జనసేన జెండా పట్టి వారాహి వెంట అడుగులు వేద్దాం. చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములవుదాం అంటూ పిలుపునిచ్చారు జనసేన ప్రధాన కార్యదర్యి నాగబాబు.
రాజకీయ విప్లవ శంఖారావం వారాహి
* జనసేన జెండా పట్టి వారాహి వెంట నడుద్దాం
* చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములవుదాం – జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @NagaBabuOffl గారు#VarahiYatra#JanaSenaVarahi pic.twitter.com/KgBmQ5DDjw
— JanaSena Party (@JanaSenaParty) June 8, 2023
తాజావార్తలు
-
Raaka : ‘రాకా’లో త్రిపాత్రాభినయం చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ?
-
Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
-
Acer Swift Neo AI Laptop: Acer Swift Neo AI ల్యాప్టాప్ రిలీజ్.. 32GB RAM, 1TB SSDతో అదిరిపోయే ఫీచర్లు.. తక్కువ ధరకే
-
Nagarjuna: బర్త్డే వేళ నాగార్జున ఫ్యాన్స్కు షాక్.. నెట్ఫ్లిక్స్ నుంచి ఆ సినిమా ఔట్.. లాస్ట్ డేట్ ఇదే!
-
Naga Babu: ఒక పెద్ద చెట్టు కొట్టేస్తే.. పది మొక్కలు నాటాలి!
ట్రెండింగ్
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!