Nagababu: వారాహి యాత్రకు ముందు పవన్పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ప్రజల ఆకాంక్ష అదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagababu: వారాహి యాత్రకు ముందు జనసేన ప్రధాన కార్యదర్యి నాగబాబు ఆసక్తికర కామెంట్లు చేశారు.. పవన్ సీఎం కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని నాగబాబు తాను విడుదల చేసిన ప్రెస్నోట్లో పేర్కొన్నారు.. సంఖ్యా బలాన్ని బట్టే సీఎం పదవి అంటూ ఇటీవలే పవన్ కల్యాణ్ స్పష్టం చేయగా.. నాగబాబు సీఎం పదవి ప్రస్తావనపై ఆసక్తికర చర్చ సాగుతోంది.. రాజకీయ విప్లవ శంఖారావం వారాహిగా అభివర్ణించిన ఆయన.. జనసేన జెండా పట్టి వారాహి వెంట నడుద్దాం.. చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములవుదాం అని పిలుపునిచ్చారు.. ఏపీలో ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే జనసేన పాలన రావాల్సిందే అన్నారు.. పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తిగానే వేలాది మందికి ఆపన్న హస్తం అందిస్తున్నారు. పవన్కు ఏపీ సీఎం అనే శక్తిని అందిస్తే ఇంకెంతో ఉపయోగకరమైన సేవలు అందిస్తారనే భావన ప్రజల్లో బలంగా నాటుకుందని పేర్కొన్నారు.
Read Also: Viral News: రోడ్డును ఎత్తేస్తున్న గ్రామస్తులు.. ఇదేం విడ్డూరం కాంట్రాక్టరు!
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ప్రజాధనం ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా, అప్పులను అదుపు చేసి, అభివృద్ధి బాటలు వేయగల సమర్థత గల నాయకుడు పవన్ అన్నారు నాగబాబు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పు కోసం శంఖారావం మోగించడానికి బయలు దేరుతోంది వారాహి అన్నారు.. వారాహి యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతోంది. జన సైనికులు, వీర మహిళలు, నాయకులు, జనసేన శ్రేణులు సమిష్టిగా, సమాలోచనలతో వారాహి యాత్రను విజయవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో నెలకొన్న దుర్భరమైన పరిస్థితులకు సంబంధించి ప్రజల్లో ఆలోచనాత్మకమైన చైతన్యం పెరుగుతోంది. ప్రజలంతా కలిసి మెలిసి జీవించే వాతావరణాన్ని సృష్టించడమే వారాహి యాత్ర ప్రధాన ధ్యేయం అన్నారు.. పవన్ కల్యాణ్కు మద్దతుగా జనసేన జెండా పట్టి వారాహి వెంట అడుగులు వేద్దాం. చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములవుదాం అంటూ పిలుపునిచ్చారు జనసేన ప్రధాన కార్యదర్యి నాగబాబు.
రాజకీయ విప్లవ శంఖారావం వారాహి
* జనసేన జెండా పట్టి వారాహి వెంట నడుద్దాం
* చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములవుదాం – జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @NagaBabuOffl గారు#VarahiYatra#JanaSenaVarahi pic.twitter.com/KgBmQ5DDjw
— JanaSena Party (@JanaSenaParty) June 8, 2023
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..