Nadendla Manohar: అసలు వాలంటీర్లకు సంబంధం ఏంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.. పవన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాలంటీర్లు నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు నిర్వహించారు.. పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మలను కూడా దగ్ధం చేశారు.. ఇక, ప్రతిగా కొన్ని ప్రాంతాల్లో జనసేన కార్యకర్తలు పవన్ ఫొటోలకు పాలాభిషేకాలు చేశారు. మరోవైపు మంత్రులు, వైసీపీ నేతలు కూడా పవన్ ను టార్గెట్ చేస్తున్నారు.. అయితే, వాలంటీర్ల వ్యవహారంలో అధికార పార్టీపై విరుచుకుపడ్డారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వ పధకాలు తీసుకొని వాళ్ల వివరాలు, ఫోటోలు, ఆధార్ కార్డులు, చిన్న పిల్లల వివరాలను.. వాలంటీర్స్ ఎందుకు తీసుకుంటున్నారు..? అని నిలదీశారు.
Read Also: Posani Krishna Murali: పవన్కి పోసాని ఛాలెంజ్.. నీకు ఆ దమ్ముందా?
Also Read
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
- Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
ప్రభుత్వంతో అసలు వాలంటీర్లకు సంబంధం ఏంటి? అని నిలదీశారు నాదెండ్ల మనోహర్.. ప్రభుత్వం తరపున వాలంటీర్లు పని చేస్తే అధికారులు మాట్లాడకుండా వైసీపీ నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారు..? అని ప్రశ్నించారు. వాలంటీర్స్ ద్వారా ప్రజలను మభ్య పెట్టి.. వచ్చే ఎన్నికలో లబ్ధి పొందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తోందని విరుచుకుపడ్డారు. ఆడపిల్లల భద్రత కోసం పవన్ కల్యాణ్ మాట్లాడుతుంటే.. వ్యక్తిగతంగా ఎందుకు విమర్శలు చేస్తున్నారు..? రాజకీయ లబ్ధి కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ గురించి ఏమిటా మాటాలు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక, ప్రభుత్వం మారాలనే ఆకాంక్షతో ప్రజలు వారాహి యాత్రకు పెద్దఎత్తున స్వాగతం పలుకుతున్నారని అన్నారు.. పవన్ కల్యాణ్ సమస్యలపైన విమర్శిస్తున్నరు.. కానీ, ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించట్లేదని స్పష్టం చేశారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.
తాజావార్తలు
-
BCCI-Team India: ఉన్నపళంగా బెంగళూరుకు టీమిండియా స్టార్ క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?
-
Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
-
NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
-
Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
ట్రెండింగ్
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!