Vasantha vs Deveneni: వసంత వర్సెస్ దేవినేనిగా మారిన మైలవరం పాలిటిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vasantha vs Deveneni: మైలవరం టీడీపీలో పొలిటికల్ రచ్చ జరుగుతోంది. వసంత వర్సెస్ దేవినేనిగా మారిన మైలవరం నియోజకవర్గ రాజకీయాలు మారిపోయాయి. పోటా పోటీ కార్యక్రమాల దెబ్బకి టీడీపీ క్యాడర్లో హైరానా మొదలైనట్లు తెలుస్తోంది. దేవినేని ఉమ, సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం టికెట్ కోసం పట్టుబడుతున్నారు. టికెట్ తనకే అంటూ వసంత కృష్ణ ప్రసాద్ ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. మండల స్థాయి నేతలతో వసంత కృష్ణ ప్రసాద్ ఫోన్లో టచ్లోకి వెళ్లారు. అయితే, వసంత కృష్ణ ప్రసాద్ ఇంతవరకు టీడీపీలో చేరలేదు.అంతేకాకుండా దేవినేని ఉమతో తనకు ఎలాంటి విబేధాలు లేవంటున్నారు వసంత. రేపు టీడీపీలో చేరేందుకు తన వర్గం నేతలతో హైదరాబాద్ వెళ్తున్నారు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.
Read Also: Harirama Jogaiah: జనసేన సహకారం లేకుండా టీడీపీ నెగ్గడం అసాధ్యం
Also Read
- IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
- Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్తో అభిమాని మృతి!
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
- 8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
ఇదిలా ఉండగా.. టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమ సైతం మైలవరం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మైలవరం టికెట్పై దేవినేనికి చంద్రబాబు క్లారిటీ ఇచ్చారని చర్చ జరుగుతోంది. దీంతో మైలవరం నియోజకవర్గం కార్యకర్తలు గందరగోళంలో పడిపోయారు. ఓవైపు వసంత కృష్ణ ప్రసాద్, మరోవైపు దేవినేని ఉమ.. మైలవరం టికెట్ నాదే అంటే నాదే అంటూ ప్రచారం చేసుకోవడంతో.. నియోజకవర్గంలోని టీడీపీ కేడర్ అయోమయంలో పడిపోయింది. ఇంతకీ మైలవరం టీడీపీ అభర్థి ఎవరో త్వరగా తేల్చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇవాళ నియోజక వర్గంలో ఎన్నికల శంఖారావం నిర్వహిస్తున్నారు దేవినేని ఉమా. ఇంకా అధిష్ఠానం టికెట్ ఖరారు చేయకపోవడంతో ఎవరికి వారు ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఉమాను చంద్రబాబు పిలిచి మాట్లాడితే బాబు మాటే శిరోధార్యం అని దేవినేని ఉమా చెప్పినట్లు తెలిసిది. ఉమా కార్యక్రమాలపై పార్టీ నేతలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఉమా, వసంత మధ్య సయోధ్య కుదరకపోతే పార్టీ గెలుపు ఓటములపై ప్రభావం చూపుతుందని క్యాడర్ టెన్షన్ పడుతోంది.
తాజావార్తలు
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
BCCI Selection Rule: బీసీసీఐ కీలక మార్పు.. ఇకపై 100 కాదు 200 శాతం.. టీమిండియా ఆటగాళ్లకు చుక్కలే!
-
Mirzapur: The Movie: రిలీజ్కు ముందే కోట్లు కొల్లగొట్టిన కలీన్ భయ్యా.. మొదటి రోజే అదిరిపోయిన అడ్వాన్స్ బుకింగ్స్!
-
Hamas Crypto Funding: హమాస్కు చావుదెబ్బ.. క్రిప్టో నెట్వర్క్పై FBI మెరుపుదాడి.. రూ. కోట్లలో నిధులు సీజ్!
-
418 Movie: ప్రశాంత్ నీల్ ‘418’కు సెన్సార్ షాక్.. భయపెట్టే సీన్లపైనే అభ్యంతరాలు!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!