Rahul Disqualification: నా ఇల్లే రాహుల్ గాంధీ ఇల్లు.. ఇంట్లో బోర్డు పెట్టిన కాంగ్రెస్ నేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Disqualification: రాహుల్గాంధీని అధికారిక బంగ్లా ఖాళీ చేయాలని పార్లమెంటు హౌసింగ్ ప్యానల్ ఆదేశించడం.. గడువు పొడిగించాలని కూడా అడగకుండా ఖాళీ చేసేందుకు రాహుల్ సిద్ధపడిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటారు? అన్న చర్చ నడుస్తున్నది. అయితే.. రాహుల్కు మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి. రాహుల్ ఎక్కడ ఉండబోతున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ‘అవసరమైతే ఆయన తన తల్లి సోనియా గాంధీ టికి వెళతారు. లేదంటే నా బంగ్లా ఇస్తా’ అని బదులిచ్చిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. రాహుల్ గాంధీకి ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజయ్ రాయ్ ప్రతీకాత్మకంగా తన ఇంటిని అంకితం చేశారు. మాజీ ఎమ్మెల్యే దంపతులు వారణాసి నగరంలోని లాహురాబీర్ ప్రాంతంలోని తమ ఇంటి వద్ద “మేరా ఘర్ శ్రీ రాహుల్ గాంధీ కా ఘర్ (నా ఇల్లు రాహుల్ గాంధీ ఇల్లు)” అని రాసి ఉన్న బోర్డును ఉంచారు. తన అధికారిక బంగ్లాను ఖాళీ చేయమని లోక్సభ సెక్రటేరియట్ నోటీసుకు రాహుల్ గాంధీ మంగళవారం సమాధానం ఇవ్వడంతో పాటు నోటీసుకు కట్టుబడి ఉంటానని చెప్పారు.
Also Read
- Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ '45' స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
Read Also: Revanth Reddy: నా ఇంటికి రా భయ్యా అంటూ రేవంత్ ఎమోషనల్ ట్విట్.. ఎరికోసమో తెలుసా..
‘‘దేశంలోని నియంతలు రాహుల్గాంధీ నివాసాన్ని లాక్కోవాలనుకుంటున్నారు.. కానీ, దేశవ్యాప్తంగా కోట్లాది మంది పార్టీ కార్యకర్తల ఇళ్లు రాహుల్గాంధీ అని వారికి తెలియదు.. వారణాసి నగరంలో లాహురాబీర్ ప్రాంతంలోని మా ఇంటిని రాహుల్ గాంధీకి అంకితం చేశాం’’ అని అజయ్ రాయ్ అన్నారు. రాహుల్ గాంధీకి మద్దతుగా ఈ ప్రచారం కాశీతో సహా మొత్తం ప్రయాగ్రాజ్ ప్రాంతంలో ప్రారంభించబడిందని ఆయన అన్నారు. “గాంధీ కుటుంబం కోట్ల విలువైన ఆనంద్ భవన్ (ప్రయాగ్రాజ్లోని) మొత్తాన్ని జాతికి అంకితం చేసింది. బహిష్కరణ నోటీసు (రాహుల్ గాంధీకి) పంపడం బీజేపీకి పిరికిపంద చర్య,” అని అజయ్ రాయ్ అన్నారు. రాహుల్ గాంధీ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారని ఉత్తకప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అశోక్ సింగ్ అన్నారు.
Read Also: Wayanad By-Election: వయనాడ్ ఉపఎన్నికపై ఉత్కంఠ.. కర్ణాటకతో పాటు ఈసీ షెడ్యూల్ ప్రకటిస్తుందా?
గత వారం క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలిన తర్వాత లోక్సభ సభ్యునిగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఏప్రిల్ 22లోగా ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని రాహుల్ గాంధీకి సోమవారం నోటీసు అందింది. నిబంధనల ప్రకారం నోటీసులు అందుకున్న 30 రోజుల్లోగా బంగ్లా ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే.. గడువు పొడిగించాలని రాహుల్ విజ్ఞప్తి చేసుకుంటే ప్యానల్ సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్నదని ఒక అధికారి చెప్పారు. కానీ.. తగ్గేదే లే అంటున్న రాహుల్.. కోర్టుకే క్షమాపణ చెప్పలేదు.. ప్యానల్ను గడువు పొడిగించాలని కోరుతానా? అన్నట్టు.. చెప్పిన టైమ్ లోపలే బంగ్లా ఖాళీ చేస్తానని లేఖ రాశారు.
తాజావార్తలు
-
Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
-
Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
-
Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!