Murder Attempt : ములుగు జిల్లాలో ఎంపిడీవోపై హత్యాయత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనగామ జిల్లాలో రిటైర్డ్ ఎంపిడివో రామకృష్ణయ్య కిడ్నాప్ హత్య ఘటన మరిచిపోక ముందే ములుగు జిల్లాలో ఎంపిడివో పై దాడి హత్యాయత్నం కలకలం సృష్టిస్తోంది. వెంకటాపూర్ ఎంపీడీవో శ్రీనివాస్ పై దాడికి ఆరుగురు కారులో వెంబడించారు. తృటిలో తప్పించుకుని పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ములుగు జిల్లా వెంకటాపూర్ ఎంపీడీవో సిహెచ్.శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘పోడు భూముల పట్టాల గురించి మాట్లాడేందుకు మల్లయ్యపల్లి, అడవి రంగాపూర్, రామకృష్ణాపూర్ గ్రామాలకు వెళ్లారు. అక్కడి సర్పంచ్ లు, గ్రామకార్యదర్శులతో చర్చించి తిరిగి వస్తుండగా బూర్గుపేటకు చెందిన భీంరావు, దుగ్యాల రాజు మరో నలుగురు కారులో వెంబడించారు. స్క్రూటి పై వెళ్తున్న ఎంపీడీవోను అడవి రంగాపూర్ దగ్గర ఆపి అడవి రంగాపూర్ సర్పంచ్, కార్యదర్శులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని బూతులు తిట్టారు. ఎంపీడీవో తప్పించుకుని పోగా లక్ష్మీదేవి పేట వద్ద కారు అడ్డుగా పెట్టారు. అక్కడి నుంచి కూడా తప్పించుకుపోగా వదలకుండా నల్లగుంట, రామకృష్ణాపూర్ వరకు వచ్చి కారుతో డ్యాష్ ఇవ్వడానికి ప్రయత్నించారు. సినిమా థ్రిల్లర్ ను తలపించేలా వెంబడించిన వారు దాడికి యత్నించడమే కాకుండా సెల్ ఫోన్ లో వీడియో సైతం తీసుకున్నారు.’ అని తెలిపారు.
Also Read
- Sonam Wangchuk: 'నేను ఇంకా బ్రతికే ఉన్నాను'.. ఆస్పత్రి బెడ్పై నుంచి సోనమ్ వాంగ్చుక్ భావోద్వేగ సందేశం
- Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
- Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
ప్రాణభయంతో తప్పించుకుని వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఎంపీడీవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకుడు గుంతల కాంట్రాక్టు తీసుకున్న రాజు, భీంరావు పనులు చేయకుండానే ఎంబి రికార్డు చేసి బిల్లులు చెల్లించాలని ఒత్తిడి చేశారని అందుకు నిరాకరించడంతో దూషించి దాడి చేసి చంపేందుకు యత్నించారని శ్రీనివాస్ తెలిపారు.
స్క్రూటిపై విధులకు హాజరై వెళ్తున్న ఎంపిడిఓ పై దాడికి యత్నించిన రాజు, భీంరావు తోపాటు ఆరుగురుపై ఐపీసీ 353, 341, 506, 290 r/w 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని మిగతా వారికోసం ఆరా తీస్తున్నారు. దాడికి యత్నించిన వారు ఎంతటివారైనా చర్యలు తప్పవని ఎస్ఐ స్పష్టం చేశారు.
పదిరోజుల క్రితం జనగామ జిల్లా పోచన్నపేటకు చెందిన రిటైర్డ్ ఎంపిడిఓ రామకృష్ణయ్య కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన మరిచిపోకముందే ములుగులో మరో ఎంపిడివో పై దాడికి యత్నించడం ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు.
తాజావార్తలు
-
Sonam Wangchuk: ‘నేను ఇంకా బ్రతికే ఉన్నాను’.. ఆస్పత్రి బెడ్పై నుంచి సోనమ్ వాంగ్చుక్ భావోద్వేగ సందేశం
-
Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
-
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
-
Dharmendra Pradhan: విదేశీ విద్యపై ఆన్లైన్ ట్రోలింగ్.. ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్..!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!