Mudragada Padmanabham: పిఠాపురం పాలిటిక్స్లోకి ముద్రగడ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mudragada Padmanabham: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంపైనే అందరి దృష్టి ఉంది.. కూటిమి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచి బరిలోకి దిగుతుండగా.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఎంపీ వంగా గీతను పోటీకి పెడుతుంది.. ఓవైపు జనసేన.. మరోవైపు వైసీపీ ఈ నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నాయి.. ఇక, ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కూడా పిఠాపురం పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు.. యూ కొత్తపల్లి మండలానికి చెందిన కాపు నేతలతో సమావేశం నిర్వహించారు.. కిర్లంపూడిలో తన నివాసంలో ఈ మీటింగ్ జరిగింది.. ఎన్నికల ప్రచార శైలి ఏ విధంగా ఉండాలి.. సభలు, సమావేశాలు ఎలా నిర్వహించాలి.. వాటిపై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.. పవన్ కల్యాణ్ను ఎదుర్కోవాలంటే కలిసి పని చేయాలని సూచించారు. గ్రామస్థాయి మీటింగ్ లు పెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే, 2009లో తాను పిఠాపురం నుంచి పోటీ చేసినప్పుడు, ఇప్పటికి రాజకీయాలు చాలా మారాయని తెలిపారు. పిఠాపురం సెగ్మెంట్ బాధ్యతలు తనకి కూడా అప్పగించారని అంటున్నారు ముద్రగడ.
Read Also: Robbery Video: దేవుడా.. మూర మల్లెపూల కోసం మరి ఇంతలా దిగజారాలా..?
Also Read
- Sonam Wangchuk: విద్యార్థులపై కేసులుండవు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం.. కేంద్రం ఇచ్చిన హామీలు ఇవే!
- India vs Afghanistan: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. భారత్ గడ్డపై టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనున్న ఆఫ్ఘనిస్థాన్.. పూర్తి షెడ్యూల్..
- Love Couple Attacked: ప్రేమ వివాహం చేసుకున్న నవ దంపతులపై దాడి.. తాళిబొట్టు తెంచి..!
- Student Protest: నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్..
కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభంను కలిశారు పిఠాపురంకు చెందిన వైసీపీ నాయకులు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అన్నారు.. వైఎస్ జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలన్న ఆయన.. ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికల్లో కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు మీ ఎన్నికలు అనుకొని.. కసిగా పని చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ గెలుపు కోసం నా కృషి నేను చేస్తాను.. మీ పని మీరు చేయండి అంటూ పిలుపునిచ్చారు కాపు ఉద్యమనేత, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం. మరోవైపు.. పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీత ఎన్నికల ప్రచారాన్ని ఈ రోజు అడ్డుకున్నారు అధికారులు.. పర్మిషన్ లేకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు అంటూ ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ వంగా గీత ప్రచారాన్ని అడ్డుకున్నారు.. ప్రచారం నిలిపివేయాలని సూచించడంతో.. అక్కడి నుంచి వెళ్లిపోయారు వంగా గీత.
తాజావార్తలు
-
Infosys Hiring 2026: గ్రాడ్యుయేట్స్ కు ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ చెప్పిన ఇన్ఫోసిస్..
-
Ramayana Trailer: చివరి నిమిషంలో ‘రామాయణ’ ట్రైలర్ వాయిదా.. అసలు కారణం ఏంటంటే?
-
Sonam Wangchuk: విద్యార్థులపై కేసులుండవు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం.. కేంద్రం ఇచ్చిన హామీలు ఇవే!
-
India vs Afghanistan: క్రికెట్ చరిత్రలో తొలిసారి.. భారత్ గడ్డపై టీమిండియాకు ఆతిథ్యం ఇవ్వనున్న ఆఫ్ఘనిస్థాన్.. పూర్తి షెడ్యూల్..
-
Stock Market Crash: ఒకే ఒక్క నిర్ణయం.. కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్, భారీ నష్టాల్లో టాప్ 10 షేర్లు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?