MS Dhoni-IPL 2025: ఎంఎస్ ధోనీ కోసమే కొత్త రూల్.. సీఎస్కేకు భారీ లాభం!
- మెగా వేలంకు సంబంధించి నిబంధనలు విడుదల
- అన్క్యాప్డ్ ప్లేయర్లకు ఛాన్స్
- ఎంఎస్ ధోనీకి 4 కోట్లు
ఐపీఎల్ 2025 మెగా వేలంకు సంబంధించి నిబంధనలను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈసారి రిటెన్షన్ పరిమితిని ఆరుగురు ఆటగాళ్లకు పెంచింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) ఆప్షన్ ఉంది. ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను ముందుగానే రిటైన్ చేసుకోవచ్చు లేదా మెగా వేలంలో ఆర్టీఎం ద్వారా రిటైన్ చేసుకోవచ్చు. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కోసమే బీసీసీఐ ఓ రూల్ను మరలా తీసుకొచ్చింది.
ఐపీఎల్ 2025లో రిటైన్ చేసుకునే ఆరుగురు ఆటగాళ్లలో ఓ అన్క్యాప్డ్ ప్లేయర్ ఉండాలనే కండిషన్ను బీసీసీఐ పెట్టింది. గరిష్టంగా ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు ఛాన్స్ ఉంది. అన్క్యాప్డ్ ప్లేయర్ నియమం లీగ్లో మొదటి నుంచి భాగంగా ఉంది. కానీ ఏ ప్రాంచైజీ దీనిని ఉపయోగించలేదు. దాంతో 2021లో రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ ఆ నియమంను ప్రారంభించాలని నిర్ణయించారు. దీనికి ప్రధాన కారణం ఎంఎస్ ధోనీనే అని తెలుస్తోంది. గత జులైలో రిటెన్షన్ నిబంధనలకు సంబంధించి బీసీసీఐ, ఫ్రాంచైజీ యజమానుల మధ్య సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ధోనీని కొనసాగించేందుకు అన్క్యాప్డ్ ప్లేయర్ నిబంధనను మళ్లీ చేర్చాలని బీసీసీఐని సీఎస్కే కోరిందట.
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
Also Read: IPL 2025 Retention: ఐపీఎల్ 2025 మెగా వేలం.. రిటెన్షన్ లిస్ట్ డెడ్లైన్ డేట్ ఇదే!
ఎంఎస్ ధోనీ ఆగస్ట్ 2020లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చాడు. కానీ జులై 2019 నుంచే అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్నాడు. 2024 జులైతోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించి 5 సంవత్సరాలు పూర్తయింది. ఇపుడు ధోనీ అన్క్యాప్డ్ ఆటగాడవుతాడు. ధోనీని కొనసాగించేందుకే అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ తీసుకొచ్చారు. ఈ నిబంధన ప్రకారం మహీని అన్క్యాప్డ్ ఆటగాడిగా చెన్నై సొంతం చేసుకుంటుంది. అన్క్యాప్డ్ ప్లేయర్కు రిటెన్షన్ ఫీజు రూ.4 కోట్లు అన్న విషయం తెలిసిందే. తక్కువ ధరకే ధోనీ లాంటి స్టార్ దక్కుతుండడంతో సీఎస్కేకు భారీ లాభం చేకూరనుంది. నవంబరులో ఐపీఎల్ 2025 వేలం జరిగే జరిగే అవకాశముంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!