IPL 2025 Retention: ఐపీఎల్ 2025 మెగా వేలం.. రిటెన్షన్ లిస్ట్ డెడ్లైన్ డేట్ ఇదే!
- అక్టోబర్ 31 రిటెన్షన్ లిస్ట్కు డెడ్లైన్
- రిటెన్షన్ లిస్ట్పై ఫ్రాంఛైజీలు కసరత్తు
- ప్రాంచైజీ వద్ద 41 కోట్లు మాత్రమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2025 Retention Deadline: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలానికి సంబంధించిన నిబంధనలు ఖారారు అయ్యాయి. శనివారం బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫ్రాంఛైజీలు ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ (అట్టిపెట్టుకోవడానికి) చేసుకోవడానికి గవర్నింగ్ కౌన్సిల్ అనుమతిని ఇచ్చింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) ఆప్షన్ ఉంది. అంతేకాదు ప్రతీ ఫ్రాంచైజీ పర్స్ వాల్యూను రూ.120 కోట్లకు పెంచారు.
ఐపీఎల్ 2025 రిటెన్షన్ లిస్ట్కు డెడ్లైన్ అక్టోబర్ 31 సాయంత్రం 5 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఈలోపు అన్ని ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ లిస్ట్ను సమర్పించాల్సి ఉంటుంది. నిబంధనలు ఖరారు చేయకముందే.. చాలా ఫ్రాంఛైజీలు రిటెన్షన్ లిస్ట్పై కసరత్తులు చేశాయి. ఫ్రాంఛైజీలు ఐదుగురు ఆటగాళ్లతో లిస్ట్ను ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా బీసీసీఐ నిబంధనలను అధికారికంగా ప్రకటించడంతో.. స్వల్ప మార్పులతో ప్రకటించనున్నాయి. ఆరుగురు ఆటగాళ్ల రిటైన్ చాలా ప్రాంచైజీలకు ప్రయోజనం చేకూర్చనుంది.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
Also Read: Kanpur Test: మూడో రోజు ఆట ఆలస్యం.. 12 గంటలకు మరోసారి పిచ్ పరిశీలన!
అట్టిపెట్టుకున్న మొదటి ఆటగాడికి ఫ్రాంఛైజీ రూ.18 కోట్లు ఇవ్వాలి. రెండో ఆటగాడికి రూ.14 కోట్లు, మూడో ఆటగాడికి రూ.11 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు, అయిదవ ఆటగాడిని కూడా అట్టిపెట్టుకుంటే.. వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలి. ఏ ఫ్రాంఛైజీ అయినా అయిదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంటే.. రూ.75 కోట్లు చెల్లించాలి. అన్క్యాప్డ్ ఆటగాడికి 4 కోట్లు ఇవ్వాలి. ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంటే ప్రాంచైజీ వద్ద రూ.41 కోట్లు మాత్రమే మిగులుతాయి. వేలంలో మరో 15 మందిని ఆ సొమ్ముతో మాత్రమే కొనాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!