ICC Hall of Fame: మిస్టర్ కూల్ ధోనికి అరుదైన గౌరవం..!
- ఎంఎస్ ధోనికు క్రికెట్లో మరో అరుదైన గౌరవం
- అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించిన 2025 హాల్ ఆఫ్ ఫేమ్ లో ధోనికి చోటు.
- ధోనితో పాటు మాథ్యూ హెడెన్, హాషిమ్ అమ్లా, గ్రేమ్ స్మిత్, డానియేల్ వెటోరి కూడా..
- మహిళలో ఇంగ్లాండ్కి చెందిన సారా టేలర్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సనా మిరకు కూడా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC Hall of Fame: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికు క్రికెట్లో మరో అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించిన 2025 హాల్ ఆఫ్ ఫేమ్ లో ధోనిని చేర్చింది. ధోనితో పాటు ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ హెడెన్, దక్షిణాఫ్రికా దిగ్గజాలు హాషిమ్ అమ్లా, గ్రేమ్ స్మిత్, న్యూజిలాండ్కు చెందిన డానియేల్ వెటోరి కూడా ఈ గౌరవంలో స్థానం సంపాదించారు. ఈ జాబితాలో మహిళా క్రికెటర్ల నుంచి ఇంగ్లాండ్కి చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ సారా టేలర్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సనా మిర్లకూ చోటు లభించింది.
Also Read
- Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
- AIADMK: ముదిరిన అన్నాడీఎంకే సంక్షోభం.. విజయ్కు మద్దతు ఇచ్చిన నేతలపై వేటు..
ఇక 2025 హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కడంపై ఎంఎస్ ధోని స్పందించాడు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కడం గొప్ప గౌరవం. ప్రపంచవ్యాప్తంగా వివిధ తరం క్రికెటర్లను గుర్తించడంలో ఇది ప్రత్యేకమైన గుర్తింపు. అటువంటి గొప్ప దిగ్గజాలతో నా పేరు చేరడం గర్వంగా ఉంది. ఇది నేను ఎప్పటికీ మరిచిపోలేనని అన్నాడు.
ఇకపోతే ధోని కెప్టెన్సీలో భారత్ 2007 టీ20 వరల్డ్కప్, 2011 వన్డే వరల్డ్కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీలను గెలుచుకుంది. అలాగే, ఆయన నేతృత్వంలో భారత్ టెస్ట్ ర్యాంకింగ్స్లో నెం.1 స్థానానికి చేరుకుంది. ఇక ధోని గణాంకాలను చూస్తే.. 538 మ్యాచ్లు, 17,266 అంతర్జాతీయ పరుగులు, 829 వికెట్లు (వికెట్ కీపర్గా) ధోనిని అత్యుత్తమ ఆటగాడిగా నిలబెట్టాయి. ఈ గణాంకాలు అతని స్థిరత్వం, ఫిట్నెస్, దీర్ఘకాలికతకు నిదర్శనంగా నిలిచాయి.
ఐసీసీ ప్రకటనలో చెప్పిన విధంగా, 2007 వన్డే వరల్డ్కప్లో భారత్ నిరాశజనకంగా బయటపడిన సమయంలో ధోనికి టీ20 వరల్డ్కప్ కెప్టెన్సీ అప్పగించారు. సీనియర్లు లేకుండా యువ జట్టుతో ధోని తిరుగులేని నాయకత్వాన్ని ప్రదర్శించాడు. రోహిత్ శర్మ, ఆర్పీ సింగ్, రాబిన్ ఉతప్ప, దినేశ్ కార్తిక్ లాంటి కొత్త ఆటగాళ్లను ప్రోత్సహించి వారిలో ఆత్మవిశ్వాసం పెంచి భారత్కు ప్రపంచ మొదటి టీ20 ఛాంపియన్గా నిలిచే ఘనతను తెచ్చిపెట్టాడు. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోని ప్రస్తుతం ఇంకా ఐపీఎల్లో క్రికెట్ కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ గౌరవం ధోని కెరీర్లో మరో చిరస్మరణీయ అధ్యాయంగా నిలవనుంది.
"Whenever you played against him, you knew the game was never over until he was out!" 😮💨
Cricket greats celebrate MS Dhoni, one of the newest inductees in the ICC Hall of Fame 🤩
📝: https://t.co/oV8mFaBfze pic.twitter.com/118LvCP71Z
— ICC (@ICC) June 10, 2025
తాజావార్తలు
-
Naga Vamsi: డిస్ట్రిబ్యూటర్లను చంపి ఎగ్జిబిటర్లను కాపాడటం సాధ్యమా?:
-
Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
-
CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Amul milk: సామాన్యుడి జేబుకు ‘అముల్’ చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
-
Mythri Ravi: ముగ్గురిదీ ఒకే సమస్య: మైత్రీ రవి
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!