Raghunandan Rao: చంపుతూ పోతుంటే చూసుకుంటూ పోవాలా.. ఉగ్రవాదులను చంపితే వీళ్లకేంటి నొప్పి?
- ఉగ్రవాదులను చంపితే వీళ్లకేంటి నొప్పి
- చంపుతూ పోతుంటే చూసుకుంటూ పోవాలా?
- మోడీ శాంతి కోరుకున్నాడు కాబట్టే ఇన్నాళ్లు యుద్ధం జరగలేదు
- ఉగ్రవాదులను మద్దతు పలికితే దేశద్రోహులే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ నిజంగా యుద్ధం చేస్తే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ ఉండదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ప్రధాని మోడీ శాంతి కోరుకున్నాడు కాబట్టే ఇన్నాళ్లు యుద్ధం జరగలేదని, దేశం ఎంతో సంయమనం పాటించిందన్నారు. ఆడ బిడ్డలకు అన్యాయం జరిగింది కాబట్టే.. ఇద్దరు ఆడబిడ్డలు ధర్మయుద్దానికి నాయకత్వం వహించారన్నారు. ఏ ఒక్క పాకిస్తానీ సామాన్యుని ముట్టుకోలేదని, కేవలం ముష్కరుల స్థావరాలపైనే దాడి జరిగిందన్నారు. దేశ సహనాన్ని చేతకాని తనం అనుకుంటే తగిన బుద్ధి చెప్తాం అని ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ అవగాహన సదస్సులో రఘునందన్ రావు పాల్గొన్నారు.
‘గత మూడు రోజులుగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ధర్మ యుధం చేస్తుంటే.. ఈ దేశ తిండి తింటూ కొందరు విమర్శిస్తున్నారు. అందులో కమ్యూనిస్టులు, పలు రంగుల జెండాల లీడర్లు, జర్నలిస్టు ముసుగులో అర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారు. ఉగ్రవాదులను చంపితే వీళ్లకేంటి నొప్పి. బట్టలిప్పి మతం తెలుసుకొని మరీ చంపుతుంటే ఎటుపోయారు ఈ సోకాల్డ్ లీడర్లు. చంపుతూ పోతుంటే.. చూసుకుంటూ పోవాలా?. కాళ్లకు పారాణి అరక ముందే సింధూరం కోల్పోయారు. భారత్ నిజంగా యుద్ధం చేస్తే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ ఉండదు. ప్రధాని మోడీ శాంతి కోరుకున్నాడు కాబట్టే ఇన్నాళ్లు యుద్ధం జరగలేదు. దేశం ఎంతో సంయమనం పాటించింది. ఆడ బిడ్డలకు అన్యాయం జరిగింది కాబట్టే ఇద్దరు ఆడ బిడ్డలు ధర్మయుద్దానికి నాయకత్వం వహించారు’ అని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు.
Also Read
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
Also Read: Murali Naik: మురళీ నాయక్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం: ఏపీ సీఎం
‘ఏ ఒక్క పాకిస్తానీ సామాన్యుని ముట్టుకోలేదు. కేవలం ముష్కరుల స్థావరాలపైనే దాడి జరిగింది. దేశ సహనాన్ని చేతకాని తనం అనుకుంటే తగిన బుద్ధి చెప్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న రోహింగ్యాలను, బంగ్లాదేశీయులను, పాకిస్తానీలను ఎపుడు ఏరివేస్తావని ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. ర్యాలీలతో మద్దతు రాదు. దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేలా మాట్లాడే ఉద్యోగులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కొందరు ప్రొఫెసర్లు దేశ సంపదలో జీతం తీసుకుంటూ ఉగ్రవాదులపై ప్రేమ కురిపిస్తున్నారు. ఉగ్రవాదులను మద్దతు పలికితే దేశద్రోహులే. కన్న తల్లికి అన్నం పెట్టని వాళ్ళే ఇలాంటి మాటలు మాట్లాడుతారు’ అని ఎంపీ రఘునందన్ రావు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..