Raghunandan Rao: చంపుతూ పోతుంటే చూసుకుంటూ పోవాలా.. ఉగ్రవాదులను చంపితే వీళ్లకేంటి నొప్పి?
- ఉగ్రవాదులను చంపితే వీళ్లకేంటి నొప్పి
- చంపుతూ పోతుంటే చూసుకుంటూ పోవాలా?
- మోడీ శాంతి కోరుకున్నాడు కాబట్టే ఇన్నాళ్లు యుద్ధం జరగలేదు
- ఉగ్రవాదులను మద్దతు పలికితే దేశద్రోహులే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ నిజంగా యుద్ధం చేస్తే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ ఉండదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ప్రధాని మోడీ శాంతి కోరుకున్నాడు కాబట్టే ఇన్నాళ్లు యుద్ధం జరగలేదని, దేశం ఎంతో సంయమనం పాటించిందన్నారు. ఆడ బిడ్డలకు అన్యాయం జరిగింది కాబట్టే.. ఇద్దరు ఆడబిడ్డలు ధర్మయుద్దానికి నాయకత్వం వహించారన్నారు. ఏ ఒక్క పాకిస్తానీ సామాన్యుని ముట్టుకోలేదని, కేవలం ముష్కరుల స్థావరాలపైనే దాడి జరిగిందన్నారు. దేశ సహనాన్ని చేతకాని తనం అనుకుంటే తగిన బుద్ధి చెప్తాం అని ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ అవగాహన సదస్సులో రఘునందన్ రావు పాల్గొన్నారు.
‘గత మూడు రోజులుగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ధర్మ యుధం చేస్తుంటే.. ఈ దేశ తిండి తింటూ కొందరు విమర్శిస్తున్నారు. అందులో కమ్యూనిస్టులు, పలు రంగుల జెండాల లీడర్లు, జర్నలిస్టు ముసుగులో అర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారు. ఉగ్రవాదులను చంపితే వీళ్లకేంటి నొప్పి. బట్టలిప్పి మతం తెలుసుకొని మరీ చంపుతుంటే ఎటుపోయారు ఈ సోకాల్డ్ లీడర్లు. చంపుతూ పోతుంటే.. చూసుకుంటూ పోవాలా?. కాళ్లకు పారాణి అరక ముందే సింధూరం కోల్పోయారు. భారత్ నిజంగా యుద్ధం చేస్తే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ ఉండదు. ప్రధాని మోడీ శాంతి కోరుకున్నాడు కాబట్టే ఇన్నాళ్లు యుద్ధం జరగలేదు. దేశం ఎంతో సంయమనం పాటించింది. ఆడ బిడ్డలకు అన్యాయం జరిగింది కాబట్టే ఇద్దరు ఆడ బిడ్డలు ధర్మయుద్దానికి నాయకత్వం వహించారు’ అని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు.
Also Read
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
Also Read: Murali Naik: మురళీ నాయక్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం: ఏపీ సీఎం
‘ఏ ఒక్క పాకిస్తానీ సామాన్యుని ముట్టుకోలేదు. కేవలం ముష్కరుల స్థావరాలపైనే దాడి జరిగింది. దేశ సహనాన్ని చేతకాని తనం అనుకుంటే తగిన బుద్ధి చెప్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న రోహింగ్యాలను, బంగ్లాదేశీయులను, పాకిస్తానీలను ఎపుడు ఏరివేస్తావని ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. ర్యాలీలతో మద్దతు రాదు. దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేలా మాట్లాడే ఉద్యోగులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కొందరు ప్రొఫెసర్లు దేశ సంపదలో జీతం తీసుకుంటూ ఉగ్రవాదులపై ప్రేమ కురిపిస్తున్నారు. ఉగ్రవాదులను మద్దతు పలికితే దేశద్రోహులే. కన్న తల్లికి అన్నం పెట్టని వాళ్ళే ఇలాంటి మాటలు మాట్లాడుతారు’ అని ఎంపీ రఘునందన్ రావు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?