Raghunandan Rao: “బీఆర్ఎస్ పరిస్థితి టైటానిక్ షిప్ లా తయారైంది”..బీఆర్ఎస్ పై రఘునందన్ ఫైర్
- మెదక్ లో తాను దెబ్బకొడితే బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయిందన్న రఘునందన్ రావు
- ఉద్యమకారులకు ద్రోహం చేస్తే ఏమవుతుందో ఇప్పటికైనా తెలుసుకోవాలని కేసీఆర్ కి సూచన
- ఓడీఎఫ్.. బీడీఎస్ పరిశ్రమ ఉద్యోగులకి వర్క్ అర్దర్లు పెంచుతామని హామీ
- సంగారెడ్డి బీజేపీ కార్యకర్తల అభినందన సభలో ప్రసంగించిన నూతన ఎంపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెదక్ పార్లమెంటు సీటు బీఆర్ఎస్ గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్పాయని..మెదక్ పార్లమెంట్ లో ఆరడుగులు ఉన్నోడు, గద్ద ముక్కోడు, డబ్బులున్నోడు ఉన్నాడు కాబట్టి వాళ్లే గెలుస్తారని అనుకున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మెదక్ లో తాను దెబ్బకొడితే బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయిందన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల అభినందన సభకు ఆయన హాజరై మాట్లాడారు. టైటానిక్ షిప్ లా బీఆర్ఎస్ పరిస్థితి తయారయ్యిందని విమర్శించారు. నాలాంటి తెలంగాణ ఉద్యమకారులకు ద్రోహం చేస్తే ఏమవుతుందో కేసీఆర్ ఇప్పటికైనా తెలుసుకోవాలన్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినప్పుడే జనాలు సీఆర్ఎస్ ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంగారెడ్డి వరకు మెట్రో కావాలన్న జగ్గారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. ఎంపీ అంటే సంగారెడ్డి వరకు మెట్రో పక్కా అనే నినాదంతో పని చేస్తానన్నారు. పార్టీలకతీతంగా నాకు ఓట్లేసి నాపై నమ్మకంతో గెలిపించారని కొనియాడారు. ఓడీఎఫ్, బీడీఎస్ పరిశ్రమ ఉద్యోగులకి వర్క్ అర్దర్లు పెంచుతామని హామీ ఇచ్చారు.
READ MORE: Health Tips: షుగర్ వ్యాధిగ్రస్తులు గుడ్లు తినొచ్చా.. తింటే ఏమౌతుంది?
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
మెదక్ లో బీజేపీ ఎలాగో గెలవదని మా నాయకులు పక్క నియోజకవర్గాలకి వెళ్లారని ఎంపీ రఘునందన్ రావు గుర్తుచేశారు. చీమల దండు కట్టి బలిసిన దొరల్ని ఓడించామన్నారు. జగ్గారెడ్డిపై ఎంపీ రఘునందన్ రావు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఆయన పుట్టింది బీజేపీలోనే పెరిగింది కూడా అందులోనే గెలిచింది బీజేపీలోనే అన్నారు.తల్లి పాలు తాగి రొమ్ము గుద్దుడు ఆయన్నే చూసి నేర్చుకోవాలని మండిపడ్డారు. ఓటేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
- Tags
- bjp
- BRS
- fire on BRS
- kcr
- medak
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!