Raghunandan Rao: “బీఆర్ఎస్ పరిస్థితి టైటానిక్ షిప్ లా తయారైంది”..బీఆర్ఎస్ పై రఘునందన్ ఫైర్
- మెదక్ లో తాను దెబ్బకొడితే బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయిందన్న రఘునందన్ రావు
- ఉద్యమకారులకు ద్రోహం చేస్తే ఏమవుతుందో ఇప్పటికైనా తెలుసుకోవాలని కేసీఆర్ కి సూచన
- ఓడీఎఫ్.. బీడీఎస్ పరిశ్రమ ఉద్యోగులకి వర్క్ అర్దర్లు పెంచుతామని హామీ
- సంగారెడ్డి బీజేపీ కార్యకర్తల అభినందన సభలో ప్రసంగించిన నూతన ఎంపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెదక్ పార్లమెంటు సీటు బీఆర్ఎస్ గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్పాయని..మెదక్ పార్లమెంట్ లో ఆరడుగులు ఉన్నోడు, గద్ద ముక్కోడు, డబ్బులున్నోడు ఉన్నాడు కాబట్టి వాళ్లే గెలుస్తారని అనుకున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మెదక్ లో తాను దెబ్బకొడితే బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయిందన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల అభినందన సభకు ఆయన హాజరై మాట్లాడారు. టైటానిక్ షిప్ లా బీఆర్ఎస్ పరిస్థితి తయారయ్యిందని విమర్శించారు. నాలాంటి తెలంగాణ ఉద్యమకారులకు ద్రోహం చేస్తే ఏమవుతుందో కేసీఆర్ ఇప్పటికైనా తెలుసుకోవాలన్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినప్పుడే జనాలు సీఆర్ఎస్ ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంగారెడ్డి వరకు మెట్రో కావాలన్న జగ్గారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. ఎంపీ అంటే సంగారెడ్డి వరకు మెట్రో పక్కా అనే నినాదంతో పని చేస్తానన్నారు. పార్టీలకతీతంగా నాకు ఓట్లేసి నాపై నమ్మకంతో గెలిపించారని కొనియాడారు. ఓడీఎఫ్, బీడీఎస్ పరిశ్రమ ఉద్యోగులకి వర్క్ అర్దర్లు పెంచుతామని హామీ ఇచ్చారు.
READ MORE: Health Tips: షుగర్ వ్యాధిగ్రస్తులు గుడ్లు తినొచ్చా.. తింటే ఏమౌతుంది?
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
మెదక్ లో బీజేపీ ఎలాగో గెలవదని మా నాయకులు పక్క నియోజకవర్గాలకి వెళ్లారని ఎంపీ రఘునందన్ రావు గుర్తుచేశారు. చీమల దండు కట్టి బలిసిన దొరల్ని ఓడించామన్నారు. జగ్గారెడ్డిపై ఎంపీ రఘునందన్ రావు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఆయన పుట్టింది బీజేపీలోనే పెరిగింది కూడా అందులోనే గెలిచింది బీజేపీలోనే అన్నారు.తల్లి పాలు తాగి రొమ్ము గుద్దుడు ఆయన్నే చూసి నేర్చుకోవాలని మండిపడ్డారు. ఓటేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
- Tags
- bjp
- BRS
- fire on BRS
- kcr
- medak
తాజావార్తలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!