MP Arvind: పసుపు సనాతన ధర్మం.. పసుపు బోర్డు నా రాజకీయ పునాది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పసుపు రైతుల కృతజ్ఞత సభలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామ రాజ్యం వస్తే సమస్యలన్ని పోతాయని.. తాను కబ్జాలు చేయనని, లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వనని చెప్పారు. నాలుగు పైసల అవినీతి కూడా తన మీద లేదని, ఉండదన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మూడు సార్లు గెలిచిన అవినీతి పరుడని.. ఎస్సైని ట్రాన్స్ఫర్ చేయిస్తే పది లక్షలు, సీఐని ట్రాన్స్ఫర్ చేయిస్తే ఇరవై ఐదు లక్షలు తీసుకుంటాడని విమర్శించారు. దళారి వ్యవస్థను పెంచింది కాంగ్రెస్ అని మండిపడ్డారు. కాంగ్రెస్ సచ్చిపోయిన పీనుగ అని.. తన తండ్రైన, జీవన్ రెడ్డి అయినా ఒక్కటేనని తెలిపారు.
Intelligence Bureau Recruitment : ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. 677 పోస్టుల భర్తీ..
Also Read
- DongaNaaKoduku : దొంగ నా కొడుకు సెప్టెంబర్ లో వస్తున్నాడు.. సెంటిమెంట్ కలిసొస్తుందా?
- Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
- AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
- CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
పసుపు సనాతన ధర్మం.. పసుపు బోర్డు తన రాజకీయ పునాది అని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఉత్తరప్రదేశ్లో మూసిన చక్కర ఫ్యాక్టరీ తెరిపించిన ఘనత బీజేపీదేనన్నారు. ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ తాళలు తెరిపిస్తానని.. ఈ ప్రాంత రైతులకు మళ్ళీ పూర్వ వైభవం తెస్తానని తెలిపారు. శారీరకంగా కాదు, రాజకీయంగా కూడా కవిత తనను అందుకోలేదని… కవిత లిక్కర్ బోర్డు తెచ్చిందని అర్వింద్ విమర్శించారు. ఇందూర్ పార్లమెంట్ లో 7 సీట్లు గెలిపించండి.. ఇందూర్ పార్లమెంట్ లో బీజేపీ హుందాతనం రావాలని కోరారు.
Tamannah : ఆ కాస్మోటిక్ సంస్థ కు బ్రాండ్ అంబాసిడర్ గా తమన్నా..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరిని వదిలి పెట్టేది లేదని ఎంపీ అర్వింద్ అన్నారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే దానంత పాపం మరొకటి లేదని విమర్శించారు. మన కొడుకుకో, బిడ్డకో శాపం పెట్టినట్లేనని తెలిపారు. హంగ్ వస్తే ఫస్ట్ జంప్ అయ్యేది రేవంత్ రెడ్డియేనని పేర్కొన్నారు. నవంబర్ 30న తెలంగాణకు బీఆర్ఎస్ పీడ పోతుందని ఆరోపించారు. ఇందూరు పార్లమెంట్ లోని 7 అసెంబ్లీ స్థానాల్లో బీజేపి గెలిస్తే.. షుగర్ ఫ్యాక్టరీతో చెరుకు పంటకు పునర్ వైభవం తీసుకొస్తానని ఎంపీ అర్వింద్ తెలిపారు.
- Tags
- bjp
- BRS
- congress
- mp arvind
- telugu news
తాజావార్తలు
-
DongaNaaKoduku : దొంగ నా కొడుకు సెప్టెంబర్ లో వస్తున్నాడు.. సెంటిమెంట్ కలిసొస్తుందా?
-
IND vs SL Test: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. రెండో టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం!
-
Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
-
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్లో…
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
ట్రెండింగ్
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!