MP Bastipati Nagaraju: విజయసాయి రెడ్డి.. సీఎంతో పెట్టుకునే స్థాయి కాదు మీది: కర్నూలు ఎంపీ
- కేవీ రావును అప్పట్లో బాగా బెదిరించారు
- సీఎంతో పెట్టుకునే స్థాయి కాదు
- రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై కేవీ రావు పెట్టిన కేసును ప్రజలు స్వాగతిస్తున్నారని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కాకినాడ పోర్ట్ సీఎండీగా ఉన్న కేవీ రావును అప్పట్లో బాగా భయపెట్టడమే కాకుండా బెదిరించారన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్పై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని ఎంపీ నాగరాజు పేర్కొన్నారు. ఏపీపై విజయసాయి రెడ్డి విషం కక్కుతున్నారని, రాష్ట్ర ప్రతిష్టను ఆయన దిగజార్చుతున్నారని మండిపడ్డారు. విజయసాయి రెడ్డి తనతో చర్చకు రావాలని, సీఎంతో పెట్టుకునే స్థాయి కాదని ఎంపీ నాగరాజు సవాల్ చేశారు.
ఢిల్లీలో ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ… ‘విజయసాయి రెడ్డిపై కేవీ రావు పెట్టిన కేసును ప్రజలు స్వాగతిస్తున్నారు. కాకినాడ పోర్ట్ సీఎండీగా ఉన్న కేవి రావును అప్పట్లో బాగా భయపెట్టారుఎం బెదిరించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్పై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. వైఎస్ జగన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. ఏపీపై విజయసాయి రెడ్డి విషం కక్కుతున్నారు. రాష్ట్ర ప్రతిష్టను ఆయన దిగజార్చుతున్నారు. ఢిల్లీలో కూర్చుని మాట్లాడినంత మాత్రాన అన్నీ నిజాలైపోవు. మా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ గురించి చాలా దిగజారి మాట్లాడారు. మీ హయాంలో వేల కోట్లు అప్పులు చేసి.. రాష్ట్రం దివాలా తీసేలా చేశారు. విజయసాయి రెడ్డి.. నాతో చర్చకు కూర్చో, సీఎంతో పెట్టుకునే స్థాయి కాదు మీది’ అని ఫైర్ అయ్యారు.
Also Read
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
‘ల్యాండ్ టైటిలింగ్ ఆక్ట్ పేరుతో రైతుల భూమి కాజేయాలని చూశారు. మేము సరిదిద్ది రైతుల భూములను కాపాడాం. కేవీ రావును మీ హయాంలో చాలా భయపెట్టారు. ఢిల్లీలో కూర్చుంటే సరిపోదు. మీ అరాచకాలన్నీ బయటకు వస్తాయి, సిద్ధంగా ఉండండి. ప్రజలు అలాంటి తీర్పు ఇచ్చినా మీకు బుద్ధి రాలేదు. ఒక రెండు సీట్లు తగ్గి ఉంటే వైసీపీకి ‘నవ రత్నాలు’ మిగిలేవి. కాకినాడ పోర్టులో చాలా అక్రమాలు జరిగాయి. నిదానంగా ఒక్కొక్కటి బయటకు వస్తాయి’ అని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు.
తాజావార్తలు
-
Swapnalok Complex Fire : సికింద్రాబాద్లో కలకలం.. మళ్లీ మంటల్లో స్వప్నలోక్.!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
-
CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!