MP Bastipati Nagaraju: విజయసాయి రెడ్డి.. సీఎంతో పెట్టుకునే స్థాయి కాదు మీది: కర్నూలు ఎంపీ
- కేవీ రావును అప్పట్లో బాగా బెదిరించారు
- సీఎంతో పెట్టుకునే స్థాయి కాదు
- రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై కేవీ రావు పెట్టిన కేసును ప్రజలు స్వాగతిస్తున్నారని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కాకినాడ పోర్ట్ సీఎండీగా ఉన్న కేవీ రావును అప్పట్లో బాగా భయపెట్టడమే కాకుండా బెదిరించారన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్పై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని ఎంపీ నాగరాజు పేర్కొన్నారు. ఏపీపై విజయసాయి రెడ్డి విషం కక్కుతున్నారని, రాష్ట్ర ప్రతిష్టను ఆయన దిగజార్చుతున్నారని మండిపడ్డారు. విజయసాయి రెడ్డి తనతో చర్చకు రావాలని, సీఎంతో పెట్టుకునే స్థాయి కాదని ఎంపీ నాగరాజు సవాల్ చేశారు.
ఢిల్లీలో ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ… ‘విజయసాయి రెడ్డిపై కేవీ రావు పెట్టిన కేసును ప్రజలు స్వాగతిస్తున్నారు. కాకినాడ పోర్ట్ సీఎండీగా ఉన్న కేవి రావును అప్పట్లో బాగా భయపెట్టారుఎం బెదిరించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్పై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. వైఎస్ జగన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. ఏపీపై విజయసాయి రెడ్డి విషం కక్కుతున్నారు. రాష్ట్ర ప్రతిష్టను ఆయన దిగజార్చుతున్నారు. ఢిల్లీలో కూర్చుని మాట్లాడినంత మాత్రాన అన్నీ నిజాలైపోవు. మా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ గురించి చాలా దిగజారి మాట్లాడారు. మీ హయాంలో వేల కోట్లు అప్పులు చేసి.. రాష్ట్రం దివాలా తీసేలా చేశారు. విజయసాయి రెడ్డి.. నాతో చర్చకు కూర్చో, సీఎంతో పెట్టుకునే స్థాయి కాదు మీది’ అని ఫైర్ అయ్యారు.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
‘ల్యాండ్ టైటిలింగ్ ఆక్ట్ పేరుతో రైతుల భూమి కాజేయాలని చూశారు. మేము సరిదిద్ది రైతుల భూములను కాపాడాం. కేవీ రావును మీ హయాంలో చాలా భయపెట్టారు. ఢిల్లీలో కూర్చుంటే సరిపోదు. మీ అరాచకాలన్నీ బయటకు వస్తాయి, సిద్ధంగా ఉండండి. ప్రజలు అలాంటి తీర్పు ఇచ్చినా మీకు బుద్ధి రాలేదు. ఒక రెండు సీట్లు తగ్గి ఉంటే వైసీపీకి ‘నవ రత్నాలు’ మిగిలేవి. కాకినాడ పోర్టులో చాలా అక్రమాలు జరిగాయి. నిదానంగా ఒక్కొక్కటి బయటకు వస్తాయి’ అని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!